India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ప్రభుత్వం ప్రరతిష్టాత్మకంగా చేపట్టిన స్వేచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమం గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొని ఇంకుడు గుంటలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ అప్పలరాజు, తదితర మండల నాయకులు పాల్గొన్నారు.
గోకవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన కుంచే నాగేంద్ర (5) ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. మృతి చెందిన విద్యార్థి కోరుకొండలో ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. ఈ సంఘటనతో వెదురుపాకలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బిక్కవోలు కేంద్రంగా దోంగ నోట్లును ముద్రిస్తున్న ఐదుగురి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ.. దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠా నుంచి 1.07 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేశామన్నారు. బిక్కవోలుకు చెందిన మెకానిక్ నకిలీ నోట్లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నకిలీ నోట్ల గుట్టురట్టు చేశారు.
గులియన్ బారే సిండ్రోమ్ ఉమ్మడి గోదావరి జిల్లాలను తాకింది. ఇప్పటివరకు కాకినాడ GGHలో 16 కేసులు, రాజమండ్రి GGHలో ఓ కేసు నమోదైంది. ప.గోకు చెందిన వ్యక్తి ప్రస్తుతం కాకినాడలో చికిత్స పొందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాళ్లు, చేతులు తిమ్మిర్లు, కండరాల నొప్పులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. వ్యాధి ముదిరిన దశలో అవయవాలు చచ్చుబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
కోవిడ్ మహమ్మారి పరిస్థితి తరువాత గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, వీటి ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రభుత్వం ద్వారా అందచేస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. ప్రజల్లో గుండె జబ్బులు, వాటికి సంబంధించిన లక్షణాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
తూ.గో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలోని జీజీహెచ్లో వైద్య సేవలు అందిస్తున్నా పలు విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ రోగులు పొందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి, వారితో రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఫిబ్రవరి 19వ తేదీన తూ.గో జిల్లాకు పెన్షన్ కేసులు, జీపీఎఫ్ కేసులను సమీక్షించడానికి పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రపదేశ్ అకౌంటెంట్ జనరల్ విభాగం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఈ పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ట్రెజరీ అధికారి ఎన్.సత్యనారాయణ నోడల్ అధికారిగా వ్యవహారిస్తారని వెల్లడించారు.
అమలాపురంలోని సీతారాముల ఆయల సన్నిధిలో మంత్రి వాసంశెట్టి ప్రేమ కథకు బీజం పడింది. రాములోరి కళ్యాణం జరుగుతుండగా లక్ష్మీసునీతను చూసిన ఆయన ఆమెతో నూరేళ్ల జీవితాన్ని ఊహించుకున్నారు. తొలిచూపులోనే ఆమెపై మనసుపడ్డారు. ఈ విషయాన్ని ఆమెకు తెలుపగా కొన్నాళ్లకు పెద్దల ఇష్టమే తన ఇష్టమన్నారు. దీంతో ఇరు కుటుంబాలను సుభాశ్ ఒప్పించారు. 2009 APR19న ఘనంగా వివాహం జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా 2018లో కవలలు జన్మించారు.
ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామానికి చెందిన లారీడ్రైవర్ చంద్రుడు దివాన్చెరువు పండ్లమార్కెట్ దాటిన తరువాత రోడ్డుపక్కన లారీని ఆపాడు. గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి డ్రైవర్పై దాడిచేసి రూ.7,800 నగదు, రెండుసెల్ ఫోన్లు లాక్కుని పారిపోయారు. డ్రైవర్ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజమండ్రిలో సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీగా విధులు నిర్వర్తించే నాగరాజు గురువారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాజమండ్రిలోని గాంధీపురం పరిధిలోని ఓ గుడివద్ద మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి చూస్తే డీఎస్పీగా తెలింది. 1995 బ్యాచ్కి చెందినవారు. సీఐడీ విభాగంలో నాగరాజు రాజమండ్రిలో పని చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా ఆస్పరి.
Sorry, no posts matched your criteria.