India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేట్ వసతి గృహాల నిర్వాహకులు తగిన అనుమతులు లేకుండా నిర్వహణా చెయ్యడం, పిల్లల సంరక్షణ కేంద్రాల మార్గదర్శకాలు పాటించకుండా నిర్వహణా వ్యవస్థ ఉండటం గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ శాఖల అధికారులు వసతి గృహాలను, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, పిల్లల సంరక్షణ వసతి గృహాలను తన ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు ఆమె తెలిపారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక డీఎస్పీని బదిలీ చేశారు. మరో ఇద్దరు డీఎస్పీలను నియమిస్తూ ఏలూరు రేంజ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి ఎస్బీ డీఎస్పీ డి.ప్రభాకర్ను పలమనేరు బదిలీ చేశారు. అమలాపురం డీఎస్పీగా టీఎస్ఆర్ కే.ప్రసాద్ను నియమించారు. కాకినాడ డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో బుధవారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
శ్రావణమాసంలో ఈ నెల 22, 23 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో 2 రోజులు పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో వెయ్యి వరకు వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో రెండు రోజుల్లో 200 వివాహం జరగనున్నాయి. 22వ తేదీ 92, 23న 87 వివాహాలకు ఇప్పటికే మండపాలు బుక్ చేసుకున్నారు. ఇవి కాక మరో 50 వరకు వివాహాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. దీంతో పెళ్లిళ్ల కోలాహలం మొదలైంది.
తుని RTC డిపో ఒక్కరోజులో రూ.13.86 లక్షలు ఆదాయంతో 105% ప్రయాణికులతో రికార్డు సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో ఆక్యూపెన్సి రేషియోలో మొదటి స్థానంలో నిలిచింది. వరుస సెలవులు, శ్రావణం, రాఖీ పౌర్ణమి, వివాహముహూర్తాలతో సోమవారం బస్సులన్నీ ప్రయాణికులతో రద్దీగా మారాయి. తుని డిపో నుంచి నిత్యం 72 బస్సులను కాకినాడ, రాజమండ్రి, నర్సీపట్నం తదితర ప్రాంతాలకు నడుపుతారు. రద్దీదృష్ట్యా నిన్న మరో 6 బస్సులు అదనంగా తిప్పారు.
రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి మంగళవారం 2.92లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవలకు 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 10.90 అడుగుల నీటిమట్టం ఉందని చెప్పారు.
ప.గో. జిల్లా ఆచంట మండలం కోడేరులంకకు చెందిన రమేశ్ తూ.గో. జిల్లా పి.గన్నవరం మండలం L.గన్నవరంలో PMPగా వైద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వరలక్ష్మిని ప్రేమించాడు. అమ్మాయి తండ్రి రమణకు విషయం చెప్పగా ఒప్పుకోలేదు. దీంతో ఆదివారం వారు ఓ చర్చిలో పెళ్లి చేసుకొని ఇంటికెళ్లారు. విషయం తెలిసిన రమణ మంగళవారం రాత్రి అబ్బాయి ఇంటికెళ్లి కత్తితో దాడి చేసి పారిపోయాడు. రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
కాకినాడలోని పలు వసతి గృహాలను నగరపాలక సంస్థ కమిషనర్ భావన, ఐసీడీఎస్ పీడీ ప్రవీణ మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టరేట్ వెనకనున్న వసతి గృహం, సీబీఎం కాలేజ్ రోడ్డులోని కల్వరి టెంపుల్ వద్ద గల వసతి గృహం, భాస్కర్ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలోని పరివర్తన వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇబ్బందులు లేకుండా చూడాలని వసతి గృహాల నిర్వాహకులకు సూచించారు.
వ్యభిచారం ముఠాపై కొవ్వూరు పోలీసులు మంగళవారం దాడి జరిపారు. కొవ్వూరులోని రాజీవ్ కాలనీలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో వెళ్లి దాడి చేసినట్లు పట్టణ సీఐ విశ్వం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శిబిరం నిర్వాహకురాలు లక్ష్మీని అరెస్ట్ చేశామన్నారు. రాజమహేంద్రవరం, వైజాగ్కు చెందిన ఇద్దరు యువతలను ఆమె చెర నుంచి విడిపించినట్లు సీఐ పేర్కొన్నారు.
గోదావరి వరదల వల్ల కోనసీమ జిల్లాలో ఉద్యాన పంటలకు జరిగిన నష్టాన్ని అధికారులు పక్కాగా నిర్ధారించారు. 1926.73 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని లెక్క తేల్చారు. 759.65 హెక్టార్లలో అరటి, 28.92 హెక్టార్లలో తమలపాకు, 0.39 హెక్టార్లలో పూల తోటలు, 0.74 హెక్టార్లలో బొప్పాయి, 1063 హెక్టార్లలో కూరగాయల తోటలకు నష్టం వాటిలినట్లు పేర్కొన్నారు. 6,183 మంది రైతులకు రూ.4.05 కోట్ల పరిహారం అందించేందుకు నివేదిక పంపారు.
Sorry, no posts matched your criteria.