EastGodavari

News March 27, 2025

రాజమండ్రి : వెంటిలేటర్‌పై అంజలి

image

రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న అంజలి వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతోంది. దీనికి ఏజీఎం దీపకే కారణమని విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రకాశ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి కుటుంబీకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగులేదని వైద్యులు తెలిపారు. కాగా ఆమె తల్లిదండ్రులు తమ కూతురు బతికి వస్తుందని, రావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.

News March 27, 2025

గోదావరిలోకి దూకేసిన యువకుని మృతదేహం లభ్యం

image

ఏమైందో.. ఏమో గాని రాజానగరం కొత్త కాలనీకి చెందిన మునసా వీరబాబు (19) బుధవారం సాయంత్రం రాజమండ్రి గోదావరిలోకి దూకేశాడు. స్నేహితుడు వెంకీతో కలిసి బైక్‌పై రంపచోడవరం వెళ్లి తిరిగి వచ్చిన వీరబాబు రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదకి చేరుకుని, సెల్ ఫోన్‌ను స్నేహితునికి ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంకి ద్వారా సమాచారం అందుకున్న రాజమండ్రి పోలీసులు గల్లంతైన వీరబాబు మృతదేహాన్ని వెలికితీశారు.

News March 27, 2025

తానేటి వనితకు వైసీపీ అదిష్ఠానం మరో బాధ్యత

image

రాష్ట్ర మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ తానేటి వనితకు వైసీపీ అదిష్ఠానం మరో బాధ్యతను అప్పగించింది. ‘పార్టీ క్రమ శిక్షణ కమిటీ’లో సభ్యురాలిగా ఆమెను నియమిస్తూ బుధవారం వైసీపీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో శెట్టిపల్లి రఘురామి రెడ్డి, రెడ్డి శాంతి, కైలే అనీల్ కుమార్, విశ్వేశ్వర రెడ్డిలు ఉన్నారు.

News March 26, 2025

రాజమండ్రి: సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు

image

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకార కార్యక్రమంలో తేదీ మార్పు జరిగినట్లు బుధవారం రాజమండ్రిలో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. గతంలో తెలిపిన విధంగా ఏప్రిల్ 3వ తేదీకి బదులుగా 2వ తేదీకి మార్చినట్లు వెల్లడించారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని కోరారు. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 10 గంటలకి అమరావతిలో శాసనమండలి వద్ద ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు.

News March 26, 2025

రాజమండ్రి: పాస్టర్ మరణంపై ప్రభుత్వం విచారణకు ఆదేశం

image

పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై రాజమండ్రి ఆసుపత్రి ఎదుట తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. ఆయన మరణంపై వ్యక్తమవుతున్న అనుమానాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ అంశంపై.. ఎవరూ రాజకీయంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించొద్దని కోరారు.

News March 26, 2025

నల్లజర్ల : శిశువు మృతి

image

నల్లజర్ల ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు పీకుతుండగా.. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే శిశువు చికిత్స పొందుతూ రా.12 గం.లకు మరణించిందని సీడీపీఓ నాగలక్ష్మి తెలిపారు. ఘటనపై FIR చేయించామని, వివరాల సేకరణకు అంగనవాడీ సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.

News March 26, 2025

అనపర్తి: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి బెదిరింపులు

image

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి తమ కోరిక తీర్చాలని బెదిరించిన ఇద్దరూ వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీను నాయక్ మంగళవారం తెలిపారు. అనపర్తి మండలం పీరా రామచంద్రపురానికి చెందిన మణికంఠ రెడ్డి, రామకృష్ణారెడ్డి ఓ వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి, తమ కోరిక తీర్చాలని, రూ.1లక్ష ఇవ్వాలని ఆమెను బెదిరించారు. దీంతో ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News March 26, 2025

ఉపసర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: జేసీ

image

జిల్లాలో 12 గ్రామాలలో ఈ నెల 27న ఉప సర్పంచ్‌ల, బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, పెరవలి, రంగంపేటల రెండు కో-ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఆ మేరకు అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

News March 25, 2025

కొంతమూరు: ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి

image

కొంతమూరు హైవే సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల (45) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నివాసి అయిన పాస్టర్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో దిగి వ్యక్తిగత పనులు నిమిత్తమై బైక్‌పై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన చనిపోయారు. దీంతో నగరంలో ఉన్న పాస్టర్లు అందరూ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి చేరుకున్నారు.

News March 25, 2025

రాజమండ్రిలో జంట హత్యలు.. అసలేం జరిగిందంటే.!

image

రాజమండ్రిలో జంట హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. DSP శ్రీవిద్య ఈ కేసులో కీలక విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళానికి చెందిన శివకుమార్, సుమియా లవర్స్. తండ్రి మృతిచెందగా ఆమె తల్లి సాల్మాతో రాజమండ్రిలో ఉంటోంది. సుమియా వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శివ గొడవపడ్డాడు. ఆదివారం సుమియా మేడపైకి వెళ్లగా.. పడుకొని ఉన్న తల్లిని కత్తితో చంపేసి, తలుపు వెనుక ఉండి కూతురినీ చంపేశాడు. నిందితుడు అరెస్టయ్యాడు.

error: Content is protected !!