EastGodavari

News August 13, 2025

క్యాన్సర్ సర్వే నిర్వహిస్తాం: మంత్రి సత్యకుమార్

image

సెప్టెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా క్యాన్సర్ సర్వే నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. రొమ్ము, సర్వైకల్ వంటి క్యాన్సర్లను గుర్తించేందుకు ఈ NCD-3 సర్వే చేపడతామన్నారు. ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సలహాలు, సూచనలు ఇస్తారని మంత్రి పేర్కొన్నారు.

News August 12, 2025

మార్కెట్ కమిటీల్లో డిజిటల్ విధానం: కలెక్టర్

image

తూ.గో జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులతో కలెక్టర్ ప్రశాంతి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇకపై మార్కెట్ కమిటీ చెక్‌పోస్టుల్లో డిజిటల్ విధానాన్ని అమలు చేయాలని ఆమె ఆదేశించారు. ప్రతి మార్కెట్ కమిటీలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News August 12, 2025

అవయవ దానంతో మరొకరికి జీవితం: మంత్రి సత్యకుమార్

image

“వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే” కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. అవయవదానంతో మరొకరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని మంత్రి అన్నారు. అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించి, దాని ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జీఎస్‌ఎల్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు గన్ని భాస్కరరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

News August 12, 2025

తూ.గో: లేని భూమి ఉన్నట్లు చూపించి.. రూ.14 లక్షలు వసూలు

image

లేని భూమి ఉన్నట్లు చూపించి మాజీ సైనికుడి నుంచి రూ.14 లక్షలు వసూలు చేసిన ఘటనపై తూ.గో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి కఠిన చర్యలు చేపట్టారు. ఈ విషయమై గోపాలపురం మండలం ఎలక్షన్ డి.టి. కృష్ణను సస్పెండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న వీఆర్ఏలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మాజీ సైనికుడు సంతోషం వ్యక్తం చేశారు.

News August 12, 2025

పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి: కలెక్టర్

image

రాజమండ్రిలో జరుగుతున్న వివిధ ఇంజినీరింగ్ పనులను సత్వరమే, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలను ఆమె మంగళవారం పరిశీలించారు. ప్రజలకు, ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా పనులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

News August 12, 2025

చవితి ఉత్సవాలకు సింగల్ విండో విధానంలో అనుమతులు: కలెక్టర్

image

నగరపాలక సంస్థ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీలకు సింగల్ విండో విధానంలో అనుమతులు మంజూరుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, కమిషనరు పి.ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో వినాయక చవితి ఏర్పాట్లపై కలెక్టర్ సోమవారం సమీక్షించారు. మట్టి గణపతిని పూజించాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు.

News August 11, 2025

పోలీస్ PGRSకు 31 ఫిర్యాదులు: ఎస్పీ

image

రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం’ నిర్వహించారు. వివిధ సమస్యలతో విచ్చేసిన 31 మంది ప్రజల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.

News August 11, 2025

తూ.గో: ఏ శాఖకు ఎన్నెన్ని అర్జీలంటే?

image

పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలు సోమవారం సమర్పించారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్. చినరాముడు ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 157 అర్జీలు అందగా, రెవెన్యూ–71, పంచాయతీరాజ్–43, విద్యుత్–7, పాఠశాల విద్య–5, పోలీస్, పురపాలక తదితర శాఖలు–31 ఉన్నాయి. ప్రతి అర్జీపై తప్పనిసరిగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.

News August 11, 2025

అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారి

image

రాబోయే మూడు రోజుల్లో జాతీయ భావాన్ని ప్రజల్లోకి చేర్చేలా క్షేత్రస్థాయిలో చురుకైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. ప్రతి ఇంటిలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం, దానికి గౌరవం ఇవ్వడం, ఐక్యతను ప్రదర్శించడం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో “హర్ ఘర్ తిరంగా”పై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ర్యాలీలు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

News August 11, 2025

పచ్చదనాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

image

మొక్కలు నాటి పచ్చదనాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. సోమవారం ఆర్ అండ్ బీ కార్యాలయం వద్ద జీటీ రోడ్డు స్థలంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పచ్చదనం ఉంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, బాధ్యత గల పౌరులందరూ ఈ విషయాన్ని గుర్తించాలని ఆమె పేర్కొన్నారు.