India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి తమ కోరిక తీర్చాలని బెదిరించిన ఇద్దరూ వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీను నాయక్ మంగళవారం తెలిపారు. అనపర్తి మండలం పీరా రామచంద్రపురానికి చెందిన మణికంఠ రెడ్డి, రామకృష్ణారెడ్డి ఓ వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి, తమ కోరిక తీర్చాలని, రూ.1లక్ష ఇవ్వాలని ఆమెను బెదిరించారు. దీంతో ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
జిల్లాలో 12 గ్రామాలలో ఈ నెల 27న ఉప సర్పంచ్ల, బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, పెరవలి, రంగంపేటల రెండు కో-ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఆ మేరకు అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
కొంతమూరు హైవే సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల (45) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నివాసి అయిన పాస్టర్ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి వ్యక్తిగత పనులు నిమిత్తమై బైక్పై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన చనిపోయారు. దీంతో నగరంలో ఉన్న పాస్టర్లు అందరూ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి చేరుకున్నారు.
రాజమండ్రిలో జంట హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. DSP శ్రీవిద్య ఈ కేసులో కీలక విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళానికి చెందిన శివకుమార్, సుమియా లవర్స్. తండ్రి మృతిచెందగా ఆమె తల్లి సాల్మాతో రాజమండ్రిలో ఉంటోంది. సుమియా వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శివ గొడవపడ్డాడు. ఆదివారం సుమియా మేడపైకి వెళ్లగా.. పడుకొని ఉన్న తల్లిని కత్తితో చంపేసి, తలుపు వెనుక ఉండి కూతురినీ చంపేశాడు. నిందితుడు అరెస్టయ్యాడు.
అన్నవరప్పాడు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టి , పిట్టల వేమవరం గ్రామానికి చెందిన మాకా సురేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హనుమంతు కూడా కన్నుమూశాడు. అయితే వారు ఇరువురూ చికెన్ కోసం అన్నవరప్పాడుకు వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు. ఘటనపై ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
హుకుంపేట డిబ్లాకుకు చెందిన తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో ముద్దాయి శివకుమార్ను కొవ్వూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య తెలిపారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ నిందితుడిని పట్టుకున్నారన్నారు. యువతి వేరొకరితో ఫోన్లో మాట్లాడుతోందని అది సహించకే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం విద్యార్థులను తన పిల్లలుగా భావిస్తానని చెప్పే వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ .. మరోసారి తన మాతృ హృదయాన్ని చాటుకున్నారు. సోమవారం రాజమండ్రి నుంచి మధ్యాహ్నం వస్తుండగా.. చాళుక్య ద్వారం వద్ద ఒక తల్లి తన బిడ్డను తీసుకొని మండుటెండలో నడుస్తూ వీసీకి కనిపించారు. తన కారు ఆపి, మండుటెండలో వస్తున్న ఆ బిడ్డను తీసుకుని లాలించి తన ఛాంబర్కు తీసుకువచ్చారు. ఆమె పని ముగిశాక అప్పగించారు.
రాజమండ్రి పుష్కర ఘాట్ లో సుమారు 50 సంవత్సరాల వయసు కలిగిన గుర్తు తెలియని మహిళ మృతి చెందిందని రాజమండ్రి మూడవ పట్టణ పోలీసులు సోమవారం తెలిపారు. మృతురాలు మృతురాలు వద్ద ఏ విధమైన ఆచూకీ లభ్యంకాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమని మృతురాలి వివరాలు తెలిసినవారు 9989786529 నంబర్ను సంప్రదించమన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని జాతీయ రహదారి పై పెరవలి మండలం అన్నవరపాడు సెంటర్లో సోమవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాద ఘటనలో పిట్టల వేమవరం గ్రామానికి చెందిన మాకా సురేశ్ మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోర్ట్ మార్టమ్ నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో వివిధ కారణాలు వల్ల ఖాళీగా ఉన్న 12 ఉపసర్పంచ్ పదవులకు ఈనెల 27న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీపీవో శాంతామణి అన్నారు. రాజమండ్రి డివిజన్లో మల్లవరం, పాతతుంగపాడు, లక్ష్మినరసాపురం, మర్రిపూడి, మురమండ, మునికుడలి, కొవ్వూరు డివిజన్లో పెనకనమెట్ట, కొవ్వూరుపాడు, గోపాలపురం, వెంకటాయపాలెం, తాడిపూడి, ఉంద్రాజవరం పంచాయతీల ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. EOPR&RD ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.