EastGodavari

News July 10, 2024

తూ.గో.: 24 గంటల్లో భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ పకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ బుధవారం తెలిపారు. కాకినాడ, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

News July 10, 2024

కాకినాడ డిపో బస్ డ్రైవర్‌కి GOLD MEDAL

image

కాకినాడ APSRTC డిపో పరిధిలో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న మందపల్లి శ్రీనివాసరావు గత నెల 8, 9 తేదీలలో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ మేరకు ఆయన్ను కాకినాడ కలెక్టర్ శన్మోహన్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ డ్రైవర్ అయినప్పటికీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమన్నారు.

News July 10, 2024

వంతెన కోసం ఎంతో కృషి చేశా: మురళీ మోహన్

image

తాను ఎంపీగా ఉన్నప్పుడే మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన కోసం కృషి చేశానని మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. మోరంపూడి సెంటర్‌లో జరిగిన ప్రమాదాలను అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి వంతెన నిర్మాణ పనులు మంజూరు చేయించానని తెలిపారు. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వంతెన నిర్మాణ పనులు ఆయనే మంజూరు చేయించినట్టు ప్రచారం చేసుకోవటం సరికాదన్నారు.

News July 10, 2024

హెవలాక్ వంతెనకు రూ.160 కోట్లతో అభివృద్ధి చర్యలు

image

శతాబ్ధి కాలం సేవలందించిన రాజమండ్రిలోని హెవలాక్ వంతెనను పర్యాటకంగా, వాణిజ్య సముదాయంగా తీర్చిదిద్దేందుకు అధికారులు రూ.160 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.2.95 కిలోమీటర్లు పొడవుతో 56 స్తంభాలతో నిర్మించిన ఈ వంతెనను 1997లో మూసివేశారు. పాదచారులతో పాటు యోగా, వ్యాయమం చేసుకునేలా గోదావరి లంక గ్రామాలతో అనుసంధానం చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

News July 10, 2024

22 ఏళ్ల క్రితం మూతపడిన ఆలమూరు సబ్ జైలు

image

ఆలమూరు సబ్ జైలు నుంచి 2002 మే 29 ముగ్గురు ఖైదీలు సిబ్బంది కళ్లుగప్పి పారిపోయిన కారణంగా జైలు మూతపడింది. మండపేట, అంగర, ఆలమూరు పోలీసు స్టేషన్లతో పాటు SEB స్టేషన్లలోని రిమాండ్ ఖైదీలను వాయిదాలకు రామచంద్రపురం నుంచి ఆలమూరు కోర్టుకు తీసుకురావాల్సి ఉంది. ఆలమూరు సబ్ జైలు మూసివేయడంతో ఇది పోలీసులకు సవాలుగా మారింది. అధికారులు స్పందించి సబ్ జైలును తెరిపించాలని కోరుతున్నారు.

News July 10, 2024

రాజానగరం: రూ.62 లక్షలకు చేరిన స్కామ్

image

రాజానగరం మండలం జి.యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో బిజినెస్ కరస్పాండెంట్ నానిబాబు చేసిన అవినీతిపై డీఆర్డీఏ చేపట్టిన విచారణ తుది దశకు చేరింది. బ్యాంకు పరిధిలోని ఐదు గ్రామాలకు చెందిన 116 స్వయం సహాయక సంఘాలలో 109 సంఘాల ప్రతినిధులను అధికారులు విచారించారు. రూ.62 లక్షల పైబడి స్కామ్ జరిగినట్లు ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదిక అందించారు. మరో ఏడు సంఘాలను విచారించాల్సి ఉందని పేర్కొన్నారు.

News July 10, 2024

చింతూరు: ప్రమాదంలో SEB కానిస్టేబుల్ మృతి

image

మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్డులో మంగళవారం జరిగిన ప్రమాదంలో చింతూరు SEB స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎండీ చాంద్ భాషా (52) మృతి చెందారు. తులసిపాక సమీపంలో వ్యూ పాయింట్ వద్ద భాషా మృత దేహం పడిఉండటాన్ని గమనించిన పర్యాటకులు 108కు సమాచారం ఇచ్చారు. భాషా విధులు ముగించుకొని చింతూరు నుంచి బైకుపై మారేడుమిల్లి వైపు వస్తుండగా ఘటన జరిగింది. ఆయన కాకినాడలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

News July 10, 2024

తూ.గో జిల్లా ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ వీరే..!

image

తూర్పుగోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్‌గా రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ దినేశ్ కుమార్‌కు మంగళవారం బాధ్యతలు అప్పగించారు. జిల్లా జేసీగా వ్యవహరిస్తున్న తేజ్ భరత్ 15 రోజుల పాటు పితృత్వ (వెటర్నిటీ) సెలవులో వెళ్లడంతో ..ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా సెలవుల అనంతరం జేసీ తిరిగి జాయిన్ అవుతారు.

News July 10, 2024

పవన్ నిర్ణయం.. పిఠాపురం మారేనా..?

image

పిఠాపురంలో రోజూ 25 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా ఇందులో 1.3 టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయి. అలాగే పాదగయ క్షేత్రంలో దాదాపు 1200 ప్యాకెట్ల ప్రసాదాలు విక్రయిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ వ్యాప్తంగా 1200 పీవోపీ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. పిఠాపురంలో ప్లాస్టిక్ వాడకం నిషేధించం, మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న పవన్ కళ్యాణ్ <<13594334>>ప్రతిపాదనతో <<>>ఏ మేర మార్పు వస్తుందో చూడాలి మరి.

News July 10, 2024

రాజమండ్రి MP పురందీశ్వరిని కలిసిన మాజీ ఎంపీ

image

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందీశ్వరిని మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీకి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు ఉన్నారు.