EastGodavari

News December 3, 2024

పవన్ లుక్: కాకినాడలో అలా.. క్యాబినెట్‌లో ఇలా!

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లుక్ మారింది. మూడ్రోజుల క్రితం కాకినాడ పోర్టుకు వెళ్లిన ఆయన గడ్డంతో కనిపించారు. మాస్ లుక్‌లో ‘సీజ్‌ ద షిప్‌’ అంటూ ఆయన చేసిన కామెంట్ నెట్టింట హల్‌చల్‌ చేసింది. తర్వాత ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో పాల్గొన్న పవర్ స్టార్ క్లీన్ షేవ్ చేసుకున్నారు. నిన్న సెట్స్ నుంచి సెల్ఫీ సైతం పోస్ట్ చేశారు. ఇవాళ క్యాబినెట్ సమావేశంలో పవన్ పాల్గొనగా ఆయన కొత్త లుక్‌కు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News December 3, 2024

ఉమ్మడి తూ.గో. జిల్లాలో రెండు రోజులు మద్యం బంద్

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో MLC ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేటి సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాల సమీపంలో మద్యం షాపులు మూసి వేయనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. సోమవారం రాత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల దృష్ట్యా మద్యాన్ని విక్రయిస్తే చట్ట రీత్యా నేరమని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

News December 3, 2024

కాకినాడ: ‘ఎమ్మెల్సీ పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించాలి’

image

ఈ నెల 5న జిల్లాలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఏఆర్వో జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జె.వెంకటరావు హాజరయ్యారు.

News December 2, 2024

ప్రధానితో కలిసి సినిమా చూశా: ఎంపీ పురందేశ్వరి

image

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాని సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి వీక్షించడం జరిగిందని సోమవారం X లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి సినిమా వీక్షిస్తూ ప్రేక్షకుల్లో భాగమయ్యారు. ఆనందంగా ఉందని వారితో కలిసి తీసిన సెల్ఫీని పోస్ట్ చేశారు.

News December 2, 2024

కాకినాడ: రేపు యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ

image

కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి కలెక్టరేట్ వద్ద, జిల్లాలోని అన్ని మండల స్థాయి, డివిజన్ స్థాయి కార్యాలయాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో అందిస్తే పరిష్కరమిస్తామన్నారు

News December 1, 2024

గండేపల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. ఎల్లమిల్లి గ్రామానికి చెందిన కర్ణం నాగరత్నం(58) స్వగ్రామం నుంచి తాళ్లూరు గుడికి వచ్చి దర్శనం అనంతరం బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News December 1, 2024

గండేపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామ శివారులో శనివారం టిప్పర్ బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. ఎల్లమిల్లి గ్రామానికి చెందిన కర్ణం నాగరత్నం (58), ఎల్లమెల్లి నుంచి తాళ్లూరు గుడికి వచ్చి దర్శనం అనంతరం బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో మహిళ మృతి చెందింది. లారీ డ్రైవర్ అతి వేగంవల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

News December 1, 2024

ఇబ్బందులు ఉన్నాయా.. కాల్ చేయండి: కోనసీమ కలెక్టర్

image

కోనసీమ జిల్లాలోని ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా తమకు తెలియజేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. శనివారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న రైతులు 94416 92275, 83094 32487 నంబర్లకు ఫోన్ చేసి వారి సమస్యలను తెలియజేయవచ్చని అన్నారు.

News November 30, 2024

తూగో: జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్వహణ

image

డిసిల్టేషన్ పాయింట్స్ ఆధ్వర్యంలో కనీస స్థాయిలో ఇసుక తవ్వకాలు జరిపే విధానం ఉండాలని జిల్లా కలెక్టర్, డిఎల్ ‌స్‌ఎ ఛైర్మన్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌‌లలో సరైన కార్యకలాపాలు నిర్వహించని బోట్స్ మ్యాన్ సొసైటీల అనుమతులు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 30, 2024

ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం కోసం వేట

image

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో మత్స్యకారులు కనకం కోసం వేటను ప్రారంభించారు. తుఫాన్, అల్పపీడనాలు ఏర్పడిన సందర్భాల్లో సముద్రగర్భంలో నుంచి బంగారు రజ కొట్టుకొస్తుందని మత్స్యకారుల నమ్మకం. ఒక్కొక్కరూ దువ్వెన పట్టుకుని, కెరటాలు ఒడ్డుకొచ్చి తిరిగి లోపలకు వెళ్లే సమయంలో ఇసుకపై దువ్వెనతో అడ్డుపెడతారు. ఆ సమయంలో ఇసుక లోపల నుంచి చిన్న బంగారు రజను వారికి దొరుకుతుందేమోనని ఆసక్తి చూపుతారు.