India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని హోటల్స్, లాడ్జిలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇక్కడి ఉత్సవాలు, కోడిపందేలను తిలకించేందుకు రాష్ట్రాంలోని పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున వస్తుంటారు. దీంతో రూమ్ల అద్దెలు కొండెక్కాయి. మండపేట, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, రాజోలు తదితర ప్రాంతాల్లో 4 రోజులకు రూ.వేలల్లో అద్దెలున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లతో హోటల్స్ బుక్ అయిపోయాయి.
షెడ్యూల్డ్ కులాల సర్వే జాబితా ప్రచురణ నిమిత్తం డిసెంబర్ 26న సర్వే ప్రారంభమైందని, ఈ జాబితాను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి ఈ నెల 31 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని కలెక్టర్ ప్రశాంతి శనివారం తెలిపారు. ఫిర్యాదులను VROలు సేకరించి పోర్టల్లో డిజిటలైజ్ చేస్తారని, తహశీల్దార్ ద్వారా తుది సమీక్ష పూర్తి చేసి 2025 జనవరి 1న తుది జాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు.
గోకవరం మండలం గుమ్మల దొడ్డి గ్రామంలో అలస్కాలో బాధితులు శనివారం తలపెట్టిన అఖిలపక్ష సమావేశాన్ని పోలీసులు భగ్నం చేశారు. గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా సమావేశాన్ని నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. తమ సమస్యలపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోరుకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సముద్ర తీరా ప్రాంత ఆక్వా జోన్, ఆక్వాయేతర జోన్లలో ఎంత మేర విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నాయనే అంశంపై జియో కో-ఆర్డినేట్ మ్యాపులతో సహా బృందాలు సర్వే ఆధారంగా కచ్చితంగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కాలుష్య నియంత్రణ మండలి, భూగర్భ జల శాఖ, మత్స్య శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆక్వా చెరువుల అనుమతులపై వివరాలు తెలుసుకున్నారు
ఈవీఎం, వీవీపాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కలెక్టరేట్ ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షణ్మోహన్ రెవిన్యూ, ఎన్నికలు అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు, జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు.
జిల్లాలో కౌలు రైతులు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరులో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహరించాలని తూ.గో. జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం బ్యాంకర్లతో సమావేశం జరిగింది. డిసెంబరు 30న నాబార్డు ఆధ్వర్యంలో రొయ్యల రైతుల ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సదస్సు జరుగుతుందన్నారు. త్రైమాసిక ప్రణాళిక, పేదల ఆర్థిక అభ్యున్నతి, వ్యవసాయ అనుబంధ రంగాల రుణాలపై దృష్టి సాధించాలన్నారు.
ప్రముఖ సినీ నటుడు, విక్టరీ వెంకటేశ్ శనివారం కాకినాడలో ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు ఉత్సవంలో పాల్గొననున్నారు. పీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో వెంకటేశ్తోపాటు సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, ఆమని, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి పాల్గొననున్నారు. సినీ నటుల రాక కోసం స్థానికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
LKG చదువుతున్న గీతాన్స్ (5)ను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి శైలజతోపాటు వచ్చిన చెల్లి హన్సిక చౌదరి (3) అదే స్కూలు బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన కోరుకొండ మండలం రాఘవపురంలో గురువారం జరిగింది. అల్లారు ముద్దుగా తనతో మాట్లాడిన మాటలే చెల్లె చివరి మాటలని తెలిసి గీతాన్స్ తల్లడిల్లిపోయాడు. తనతోపాటు హన్సిక వచ్చిన విషయాన్ని ఆ తల్లి గమనించలేదు. అదే చిన్నారి మృతికి కారణమైంది.
తూ.గో.జిల్లాలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో 2 చిన్నారులు, 3 యువకులు, 3వృద్ధులు ఉన్నారు. వివరాలు ఇవే..
కోరుకొండ(M)రాఘవాపురం- హన్సిక
తాళ్లపూడి (M)బల్లిపాడు- అద్విత్ కుమార్
శంఖవరం(M)పెదమల్లాపురం- వెంకటరమణ, సుబ్రహ్మణ్యం
రాజానగరం(M)జి.యర్రంపాలెం- ప్రేమకుమార్
సామర్లకోట(M)గంగనాపల్లి- రాంబాబు(59)
ముమ్మడివరం(M)కొమనాపల్లి- పల్లయ్య
కొత్తపేట(M)బిళ్లకర్రు- వెంకటరమణ
న్యూ ఇయర్ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని తూ.గో. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. కొవ్వూరు రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో గురువారం ఎస్పీ తనిఖీలు చేశారు. మద్యం సేవించి రోడ్లపై అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సైలెన్సర్లు పీకి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ 31న మద్యం దుకాణాలు సమయపాలన పాటించాలని సూచించారు. రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.