EastGodavari

News December 24, 2024

ఉప్పాడ తీర ప్రాంతంలో మరోసారి బంగారం వేట

image

యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో మత్స్యకారులు మరోసారి బంగారం వేట ప్రారంభించారు. తుఫాన్లు, అల్పపీడనాల సమయంలో సముద్రం ఉప్పొంగి అల్లకల్లోలంగా మారినప్పుడల్లా ఇలా బంగారు రజను కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. ఈ సమయాల్లో బంగారు రజను కొట్టుకొస్తుందని మత్స్యకారుల నమ్మకం. ఒక్కొక్కరూ దువ్వెన పట్టుకుని కెరటాలు వచ్చి లోపలకు వెళ్లే సమయంలో ఇసుకపై దువ్వెనతో గీస్తే చిన్న చిన్న బంగారు వస్తువులు లభ్యమవుతాయన్నారు.

News December 24, 2024

కాకినాడ: 20 మందిపై కేసులు.. 10 మందికి జైలు

image

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 20 మందిపై కాకినాడ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ నరసింహారావు వారికి జరిమానా, జైలు శిక్ష విధించారని ట్రాఫిక్ సీఐలు రమేష్, రామారావు తెలిపారు. పది మందికి ఒక్కొక్కరికి రెండు రోజులు చొప్పున జైలు శిక్ష విధించారన్నారు. మరో 10 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారని తెలిపారు.

News December 24, 2024

రాజమండ్రి: కళ్ల ముందే కొడుకు మృతి.. రోదించిన తల్లి

image

రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు పిడింగొయ్యికి చెందిన నరేశ్ (20) అనే వ్యక్తి తన తల్లితో కలిసి బైక్‌పై వెళ్తుండగా కవలగొయ్యి జంక్షన్ వద్ద లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన నరేశ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. దీంతో తల్లి రోదన చూపరులకు కన్నీరు తెప్పించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బొమ్మూరు పోలీసులు తెలిపారు.

News December 23, 2024

తూ.గో: TODAY TOP NEWS

image

రాజమండ్రి: పాపికొండల విహారయాత్రకు ఛార్జ్ రూ.1250
*రాజమండ్రిలో పర్యటించిన కేంద్రమంత్రి రామ్మోహన్
*RCPM: పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సుభాష్
*అనపర్తిలో ఆకట్టుకున్న శాంటా క్లాస్ నృత్యం
*కాకినాడ: PGRSకు 434 అర్జీలు
*రంపచోడవరం: ప్రిన్సిపల్‌పై దురుసు ప్రవర్తన.. PD సస్పెండ్
*అమలాపురం: బైక్‌ను దర్జాగా ఎత్తుకెళ్లిన ఆగంతకుడు
*తుని: ఫ్లైఓవర్ నుంచి రైల్వే ట్రాక్‌పై పడిన లారీ
*రంప: ఉరితాళ్లతో టీచర్ల ఆందోళన

News December 23, 2024

రాజమండ్రిలోని గోల్డ్ షాపులో చోరీ

image

రాజమండ్రిలోని ఓ జువెలరీ షాపులో పట్టపగలే చోరీ చేసిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు కథనం.. జువెలరీ షాపుకు బురఖాలతో ముగ్గురు లేడీస్ వచ్చారు. కాసేపు ఆభరణాలు కావాలని టైం పాస్ చేసి వెళ్లిపోయారు. అయితే కాసేపటికి కొన్ని నగలు మిస్ అయినట్లు గుర్తించిన సిబ్బంది సీసీ కెమెరాలో పరిశీలించారు. ముసుగులో వచ్చిన మహిళలు 80 గ్రాముల బంగారం దొంగతనం చేశారని గుర్తించారు. దీనిపై యజమాని టౌన్-1 పోలీసులను ఆశ్రయించారు.

News December 23, 2024

అమలాపురం: నేడు యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్‌ సోమవారం ఉదయం 10.గంటల నుంచి యధావిధిగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ గోదావరి భవన్‌లో జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయితో పాటు డివిజన్, మండల స్థాయిలో గ్రీవెన్స్‌ జరుగుతుందన్నారు.

News December 22, 2024

రాజవొమ్మంగి: చుక్కల జింక మాంసం స్వాధీనం

image

రాజవొమ్మంగి మండలం ముంజవరప్పాడు గ్రామంలో చుక్కల జింక మాంసం స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులపై వన్యప్రాణుల చట్టం-1972 కింద కేసు నమోదు చేసామని అటవీ శాఖ అధికారి రాము ఆదివారం మీడియాకు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. అడవి జంతువుల వేటాడితే కఠిన చర్యలు తప్పవని రాజవొమ్మంగి రేంజ్ అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.

News December 22, 2024

నోరూరించే గోదావరి వంటకాలు..

image

గోదావరి జిల్లాలు అంటేనే నోరూరించే వంటకాలకు ఫేమస్. అందులోనూ సంక్రాంతి వచ్చేస్తోంది. దీంతో ఆత్రేయపురం పూతరేకులు, మందపల్లి నేతి బొబ్బట్లు, రాజమండ్రి పాలకోవా, బెండపూడి బెల్లంజీళ్లు, రావులపాలెం కుండబిర్యానీ, కాకినాడ గొట్టంకాజా, కత్తిపూడి కరకజ్జం, ముక్కామల పప్పు చెక్కలు, మండపేట గవ్వలు, కోనసీమ నగరం గరాజీలకు ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. మరి మన గోదావరి వంటకాల్లో మీకు బాగా నచ్చిన వంటకం ఏదో కామెంట్ చేయండి.

News December 22, 2024

యూ.కొత్తపల్లి: బీరువా మీద పడి చిన్నారి మృతి

image

యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడలోని ఫుల్ గాస్పల్ చర్చ్‌లో పాస్టర్‌గా ఉన్న రాజబాబు మనుమరాలు జయకేతన అనే రెండేళ్ల చిన్నారి క్రిస్మస్ వేడుకలకు తన తల్లి రత్న ప్రకాశ్‌తో కలిసి తాతయ్య ఇంటికి వచ్చింది. అయితే ఇల్లు శుభ్రపరుస్తూ ఉండగా ప్రమాదవశాత్తు బీరువా చిన్నారిపై పడింది. దీంతో కొత్తపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News December 22, 2024

సామర్లకోట: మరో 10 మంది అరెస్ట్ 

image

సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఇటీవల జరిగిన ఒక దాడి ఘటనకు సంబంధించి శనివారం మరో 10 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు CI కృష్ణ భగవాన్ ఒక ప్రకటనలో తెలిపారు. వేట్లపాలెంలో ఇంటి నిర్మాణ విషయమై రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్టు చేయగా, తాజాగా మరో 10 మందిని అరెస్టు చేసినట్లు CI తెలిపారు.