India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తొండంగి మండలం బెండపూడి హైవేపై జరిగిన శుక్రవారం రాత్రి రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు పని ముగించుకొని ఇంటికి బైక్పై వస్తుండగా కత్తిపూడి నుంచి వస్తున్న వీరబాబు బైక్ బలంగా ఢీకొన్నాయి. స్థానికులు వారిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. SI జగన్మోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఉప్పలగుప్తం మండలం సూరసేన యానాం బీచ్లో నిర్వహించనున్న ఆల్ ఇండియా ఉమెన్స్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్కు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఎస్.ఎస్ వై. బీచ్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిజికల్ డైరెక్టర్లు శుక్రవారం బీచ్లో ఏర్పాట్లు చేశారు. 8 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు.
కాట్రేనికోన మండలం కొత్తపాలెం వద్ద భైరవపాలానికి 7.6 నాటికన్ మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో యాంత్రిక లోపంతో రెండు మత్స్యకార బోట్లు నిలిచి పోయాయి. వాటిలో చిక్కుకున్న 14 మంది మత్స్యకారులను ఎస్పీ కృష్ణారావు పర్యవేక్షణలో మెరైన్ ఇన్స్పెక్టర్ మూర్తి ఆధ్వర్యంలో ఇండియన్ కోస్టల్ గార్డు సిబ్బంది, ఓడలరేవు కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, అల్లవరం పోలీసులు సురక్షితంగా బోటులో ఒడ్డుకు చేర్చి గమ్యస్థానాలకు పంపారు.
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన తూ.గో జిల్లా దివాన్చెరువులో గురువారం జరిగింది. మండపేట మండలం కేశవరానికి చెందిన చుక్కా శ్రీను(38) తన అత్తవారి గ్రామం శ్రీరాంపురానికి బయలుదేరాడు. దివాన్ చెరువు సెంటర్లో బైక్పై వెళుతున్న విద్యార్థి వెంకటరమణను శ్రీను లిప్ట్ అడిగి ఎక్కాడు. శ్రీరాంపురం సెంటర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో శ్రీను మృతి చెందగా, వెంకటరమణకు గాయాలయ్యాయి.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిలిని శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కోనసీమ జిల్లాలో జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో భూముల మార్కెట్ విలువల సవరణకు చర్యలు చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఈ మేరకు అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్లతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ విలువల సవరణకు సంబంధించిన అంశాలపై వారికి అవగాహన కల్పించారు
తూర్పుగోదావరి జిల్లాలోని జాతీయ రహదారులు, రైల్వే, విమానయాన సంస్థల ద్వారా చేపడుతున్న పనులకు సంబంధించి భూసేకరణను వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ ప్రశాంతి సూచించారు. ఈ మేరకు ఆమె రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద గురువారం విమానయాన, ఎన్.హెచ్, రైల్వే, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రహదారులు రైల్వేలకు సంబంధించిన 13 ప్రగతి అంశాలపై ఆమె సమీక్షించారు
ఎస్సీ ఉప కులాల వారీగా సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరాలు అందించాలని ఎస్సీ ఉప కులాల వర్గీకరణ పై ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా జిల్లా అధికారులను కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో గురువారం కాకినాడ కలెక్టరేట్లోని నాలుగు జిల్లాల ఎస్సీ ఉప కులాల వారీగా వారి స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు.
వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సంస్థాగత నిర్మాణం చేపట్టాలని తూ.గో. జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం రాజమండ్రి కలెక్టర్ ఛాంబర్ లో వాయు కాలుష్యంపై జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం, కాలుష్య నియంత్రణ మండలి, ఆర్ఎంసీ, రవాణా, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా నివారించడంలో ఉత్తమమైన పద్ధతులను అమలు చేయాలన్నారు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిలిని శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
Sorry, no posts matched your criteria.