India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు హాజరు కానున్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్రెడ్డి, కందుల దుర్గేశ్ సమావేశానికి హాజరవుతున్నట్లు సమాచారం. వీరితో పాటు ఏపీ సీఎస్, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు భేటీకి వెళ్లనున్నారు. చర్చలకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు ఇప్పటికే 10 అంశాలను సిద్ధం చేసుకున్నాయి.
అమరావతిలో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను శుక్రవారం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, బోధన ఆసుపత్రులను అభివృద్ధి చేయడంతో పాటు, మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని కోరారు. అలాగే కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో జరిగిన అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
తూ.గో. జిల్లా గోకవరం మండలకేంద్రంలో శుక్రవారం దారుణం జరిగింది. తంటికొండ వెళ్లే దారిలోని అరవపేటలో ఉంటున్న గుర్తుతెలియని వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపై మతిస్థిమితం లేని యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. యువతి పరుగులు తీస్తుండగా బ్లేడుతో ఆమె చేతిపై, ముఖంపై దాడి చేసాడు. స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకొని స్తంభానికి కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి గత కొంత కాలంగా స్మశానంలో జీవిస్తున్నాడు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు HYDలో శనివారం భేటీ కానున్నారు. ప్రస్తుతం భద్రాచలం మండలంలో భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మిగిలినవి AP పరిధిలో ఉన్నాయి. ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. రేపు ఇద్దరు CMల భేటీ నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరుగుతుందా..? అనే ఉత్కంఠ నెలకొంది.
రాజమండ్రిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచారరథం దహనం కేసులో వీఎల్ పురానికి చెందిన దంగేటి శివాజీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తూర్పు మండల డీఎస్పీ కిషోర్ గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుడిని రిమాండ్ కోసం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.
పిఠాపురంలో భూమి కొన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఉప్పాడ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థలం ఎక్కడ..? ధరెంత..? ఎవరి వద్ద కొన్నారనే ఆసక్తి నెలకొంది. పిఠాపురం-గొల్లప్రోలు టోల్ప్లాజా పక్కన 3.52 ఎకరాల వ్యవసాయ భూమిని పవన్ కొన్నారు. దీని మార్కెట్ విలువ రూ.50,05,000. కాకినాడలోని శాంతినగర్కు చెందిన కోన శ్రీనందు వద్ద కొనుగోలు చేసిన ఆ భూమిలో ఇంటితో పాటు పార్టీ ఆఫీస్ నిర్మించనున్నారు.
ఉపముఖ్యమంత్రి, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం వారాహి ఏకాదశ దినదీక్షలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదిత్యయంత్రం ఎదుట ఆశీనులై వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ సూర్యారాధన చేశారు.
అమలాపురం రూరల్ మండలం కామనగురువు పంచాయతీ పరిధిలోని కిమ్స్ ఆసుపత్రి సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సు ఢీకొన్న ఘటనలో బట్నవిల్లి గ్రామానికి చెందిన తొత్తరమూడి బుల్లి సత్యనారాయణ (53) అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కియా ఆధ్వర్యంలో డిప్లమా, బీ.టెక్ చదివిన వారికి ట్రైనీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తూ.గో. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండలరావు గురువారం తెలిపారు. 2019- 2024లో ఉత్తీర్ణత సాధించి, 18-25 సంవత్సరాలలోపు వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. https://forms.gle/7EzcxnL6Z2CqcbpC6 వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ(62) అక్కడికక్కడే మృతి చెందింది. కత్తిపూడి నుంచి రావికంపాడు వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే అథారిటీ గాయాలైన భర్తను అంబులెన్సులో తుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.