Guntur

News October 17, 2024

ఆ మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో మాతృమరణాలు సంభవించకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. గుంటూరు కలెక్టరేట్లో బుధవారం జిల్లా స్థాయి మాతృ మరణాల సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. హై రిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి సమీపంలోని జిల్లా ఆసుపత్రికి ట్యాగ్ చేయాలన్నారు. ప్రసవానికి ముందుగానే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. 

News October 17, 2024

నేటి నుంచి సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 35వ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఏపీఏఏ కార్యదర్శి ఎ. గౌతమ్ కిరణ్ తెలిపారు. అండర్-14,16,18,20 బాలుర, బాలికల కేటగిరీలో పలు క్రీడలు ఉంటాయని చెప్పారు. ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి జూనియర్ అథ్లెట్లు పాల్గొంటారని చెప్పారు. 

News October 17, 2024

గుంటూరు: నవంబరు 16న శబరిమలకు ప్రత్యేక రైలు

image

శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం నవంబరు 16న సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు గుంటూరు మీదుగా వెళ్లనుందని అధికారులు తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్లో 8.00 గంటలకు బయలుదేరి గుంటూరు 14.45కి వచ్చి మరుసటిరోజు చెంగనూరు 19.00 గంటలకు చేరనుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఎర్నాకులంలో 12.00 గంటలకు ప్రారంభమై.. మరుసటిరోజు గుంటూరు 14.40, సికింద్రాబాద్ 21.45 గంటలకు చేరనుంది.

News October 17, 2024

‘నాటి ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే కోసం మా ఇళ్లు కూల్చేశారు’

image

ప్రభుత్వ స్థలంలో రుణం తీసుకొని ఇళ్లు నిర్మించుకుంటే అప్పటి వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హపీజ్ ఖాన్ ఆదేశాల మేరకు అధికారులు మా ఇంటిని కూల్చేశారని కర్నూలు రాహుల్ గాంధీ నగర్ కు చెందిన టి.కుమారి కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు జనవాణిలో ఫిర్యాదు చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

News October 17, 2024

నల్లపాడు పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్.?

image

జగన్ అభిమాని అని చెప్పుకుంటూ గత ప్రభుత్వ హయాంలో టీడీపీపై విమర్శలు చేసిన బోరుగడ్డ అనిల్‌ని నల్లపాడు పోలీసులు బుధవారం అదుపులో ఉన్నట్లు సమాచారం. ఆయనపై పలు అంశాల్లో గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నల్లపాడు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్లపాడు స్టేషన్ కంటే ముందు పట్టాభిపురం స్టేషన్‌లో అనిల్‌ను విచారించినట్లు సమాచారం.

News October 16, 2024

నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య పరీక్షలు వాయిదా

image

ఈ నెల 17 నుంచి జరగాల్సిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం 1, 3వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అసౌకర్యాలు కలగకుండా పరీక్షలను వాయిదా వేసినట్లు దూరవిద్య కేంద్ర పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రామచంద్రన్ తెలిపారు. 2, 4వ సెమిస్టర్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. వాయిదా పడ్డ పరీక్షలు నవంబర్ 17నుంచి నిర్వహిస్తామన్నారు. SHARE IT.

News October 16, 2024

నిజాంపట్నం: ‘18 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు’

image

భారీ వర్షాల నేపథ్యంలో బాపట్ల జిల్లాలో మత్స్యకారులు ఈ నెల 18 వరకు వేటకు వెళ్లరాదని నిజాంపట్నం మత్స్య శాఖ సహాయ డైరెక్టర్ సైదా నాయక్ తెలిపారు. తీరంలో అలలు, గాలుల ఉద్ధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో వేట చేయటం నిషేధించినట్లు చెప్పారు. కావున మత్స్యకారులు మత్స్య శాఖ ఆదేశాలను పాటించి బోటులను, సురక్షిత ప్రాంతాలలో భద్రపరుచుకోవాలని సూచించారు.

News October 16, 2024

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు

image

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

News October 16, 2024

బాపట్ల: గ్రేట్.. చనిపోతూ 60మంది ప్రాణాలు కాపాడాడు.!

image

బాపట్ల డిపోకు చెందిన RTC బస్సు <<14369078>>డ్రైవర్<<>> సాంబశివరావు బుధవారం ఉదయం గుండెపోటులో మృతిచెందిన విషయం తెలిసిందే. బస్సు నడుపుతున్న సమయంలో తాను అస్వస్థతకు గురైనట్లు గమనించిన వెంటనే 60మంది ఉన్న బస్సును ఓ పక్కకు నిలిపేసి, అందులోనే మృతిచెందాడు. బస్సులోని ప్రయాణికులను కాపాడాలనే ఉద్దేశంతో, డ్రైవర్ చూపిన సమయస్ఫూర్తిని అందరూ ప్రశంసిస్తున్నారు. డ్రైవరన్న నీకు జోహార్లు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

News October 16, 2024

బాపట్ల: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

image

బాపట్ల డిపోకు చెందిన RTC బస్సు బుధవారం రేపల్లె నుంచి చీరాల వెళుతున్న క్రమంలో కర్లపాలెంలోని ఓ టీ స్టాల్ దాటిన తరువాత బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో డ్రైవర్ వెంటనే బస్సును పక్కనే ఉన్న పొలాలలోకి సురక్షితంగా నిలిపాడు. అనంతరం RTC డ్రైవర్ సాంబశివరావు గుండెపోటుతో బస్సులోనే మృతిచెందాడు. ఈ బస్సులో 60 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.