India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పల్నాడు జిల్లా గ్రంథసిరి అచ్చంపేట మండలానికి చెందిన మిర్చి రైతులు మంగళవారం గుంటూరు మిర్చియార్డు వద్ద ధర్నాకు దిగారు. యార్డులోని విజయభాస్కర ట్రేడర్స్ యజమానులు శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ రెడ్డి భాగస్వాములుగా ఉండి గతేడాది తమ పంటపై వచ్చిన లాభాలతో పాటూ అదనంగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఐదుగురు రైతుల వద్ద రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని పార్టీ కార్యాలయ వర్గాలను పోలీసులు కోరారు. అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలతో మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి పీఎస్కు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల నిమిత్తం నామినేషన్ గడువు ముగిసేనాటికి 40 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కాగా సోమవారం నామినేషన్ సమర్పించే గడువు ముగియగా ఈ ఒక్క రోజే 22 మంది నామినేషన్లు వేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. ఈ ఎన్నికలలో NDA కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర, PDF అభ్యర్థిగా లక్ష్మణరావు బరిలో నిలువగా, వైసీపీ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. వట్టిచెరుకూరు(M) లేమల్లెపాడుకి చెందిన సంజయ్(18) జనవరి 14న ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స అందించి ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఈ నెల 5న మళ్లీ అనారోగ్యానికి గురి కాగా GGHకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. చెట్టంత కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పరిశీలకురాలిగా వి.కరుణ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం గుంటూరు కలెక్టరేట్ను ఆమె సందర్శించారు. కలెక్టర్ నాగలక్ష్మీ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, నామినేషన్లతో పాటూ ఇతర వివరాలను ఎన్నికల పరిశీలకురాలికి కలెక్టర్ వివరించారు.

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పరిశీలకురాలిగా వి.కరుణ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం గుంటూరు కలెక్టరేట్ను ఆమె సందర్శించారు. కలెక్టర్ నాగలక్ష్మీ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, నామినేషన్లతో పాటూ ఇతర వివరాలను ఎన్నికల పరిశీలకురాలికి కలెక్టర్ వివరించారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్- 2024లో నిర్వహించిన LLB 2వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. LLB కోర్సు పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.

కాకుమాను మండలంలో సోమవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న ట్రాక్టర్ని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో బైకుపై ఉన్న వ్యక్తి ఘటన స్థలంలో మృతి చెందాడు. మండలంలోని కొండపాటూరు గ్రామంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు క్రాంతి కుమార్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద మెగా కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆయన నివాసం వద్ద చెలరేగిన మంటలను దృష్టిలో ఉంచుకుని అక్కడ నిఘా పెంచారు. మొత్తం ఎనిమిది కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి నుంచి వచ్చే చిత్రాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మానిటర్ చేయనున్నారు.

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో 0863-2241029 తో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 గంటలూ కంట్రోల్ రూమ్ సేవలు అందిస్తుందని అన్నారు. ఎన్నికల పై ఫిర్యాదు చేయడంతో పాటూ ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Sorry, no posts matched your criteria.