Guntur

News August 27, 2024

వెలుగులోకి వచ్చిన అమరావతి శాశ్వత సచివాలయ శిలాఫలకం

image

రాజధాని అమరావతిలో చేపట్టిన జంగిల్‌ క్లియరెన్స్‌లో సోమవారం శాశ్వత సచివాలయం శిలాఫలకం కనిపించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన శిలాఫలకం పిచ్చికంప, చెట్లు తొలగించడంతో వెలుగులోకి వచ్చింది. దానిని రాజధాని రైతులు సందర్శించారు.

News August 27, 2024

గుంటూరు: రేషన్‌కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్

image

సెప్టెంబరు నుంచి రేషను కార్డుదారులకు బియ్యంతో పాటు చక్కెర, పట్టణాల్లో రాగులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లాలో మొత్తం 5,99,511 రేషనుకార్డులున్నాయి. సెప్టెంబరులో గుంటూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలలో పంపిణీ చేసేందుకు 96 టన్నుల రాగులు గోదాముకు చేరాయి. నిలిపివేసిన చక్కెరను కూడా ఇవ్వనున్నట్లు డీఎస్వో కోమలి వర్మ తెలిపారు.

News August 27, 2024

తాడికొండ: నిద్రిస్తున్న బాలికపై ఇద్దరు అత్యాచారయత్నం

image

నిద్రిస్తున్న బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారయత్నం చేసిన ఘటన తాడికొండలో వెలుగులోకొచ్చింది. సీఐ కె. వాసు వివరాల మేరకు 9వ తరగతి చదువుతున్న బాలిక ఈనెల 21న ఇంట్లో ఉంది. గమనించిన ఇద్దరు బాలురు ఒకరు నోరు మూసి, మరొకరు అత్యాచారానికి యత్నించారు. ఆ సమయంలో వేరే యువతి రావడంతో పారిపోయారు.బాలిక పోలీసులను ఆశ్రయించి వారిలో ఒకరు ప్రేమపేరుతో వేధిస్తున్నాడని, తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది.

News August 27, 2024

గుంటూరులో ఆ టైంలో వాటికి నో ఎంట్రీ

image

గుంటూరులో నో ఎంట్రీ టైంను పక్కాగా అమలు చేస్తామని ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నో ఎంట్రీ టైం అమల్లో ఉంటుందని చెప్పారు. ఆ సమయంలో నగరంలోకి ట్రాక్టర్లు, లారీల ఎంట్రీకి అనుమతి లేదని చెప్పారు. చుట్టుగుంట నుంచి, SVN Colony నుంచి, JKC కాలేజ్, శ్యామల నగర్ నుంచి గుంటూరులోకి వస్తే చర్యలు ఉంటాయన్నారు.

News August 27, 2024

‘మంత్రి మనోహర్ రేషన్ మాఫియాకు వణుకు పుట్టించారు’

image

పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రేషన్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. తెనాలి జనసేన కార్యాలయంలో సోమవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కాకినాడ పోర్టు సాక్షిగా మంత్రి మాఫియాకి వణుకు పుట్టించారు అని అన్నారు.

News August 26, 2024

వినాయక చవితికి అనుమతులు తప్పనిసరి: GNT ఎస్పీ

image

వినాయక చవితికి పందిళ్లు ఏర్పాటు చేసుకోదలచిన వారు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని SP సతీశ్ కుమార్ తెలిపారు. మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి 5 లేదా అంతకంటే ఎక్కువ మంది కమిటీగా ఏర్పడి వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్లలో తెలిపి, వారి గుర్తింపు కార్డు నకలు కాపీలు జత చేయాలని చెప్పారు. ప్రైవేట్ లేదా పంచాయతీ, మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలలో విగ్రహాన్ని ఏర్పాటు చేయదలచిన స్థలాల వివరాలు చెప్పాలన్నారు.

News August 26, 2024

‘గుంటూరు జిల్లా ప్రజలకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు’

image

గుంటూరు జిల్లాలోని ప్రజలకు ఎస్పీ సతీశ్ కుమార్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కష్టసుఖాలు, గెలుపోటములు సమస్థితిలో చూడటమే శ్రీకృష్ణ తత్వమని అన్నారు. ఇది అందరికీ స్ఫూర్తిదాయకం, ఆచరణీయమన్నారు. జిల్లా ప్రజలు ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో పర్వదినాన్ని జరుపుకోవాలని చెప్పారు. 

News August 26, 2024

కృష్ణా ష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

image

శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాని అన్నారు. గీతాసారంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమే అన్నారు. 

News August 26, 2024

తెనాలిలో యువతీ ఫోటోలు మార్ఫింగ్

image

గుంటూరు (D) తెనాలికి చెందిన ఓ యువతి వైద్యరంగంలో స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఆమె ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేసి వాటిని కొరియర్ ద్వారా ఆమెకు పంపి బెదిరించారు. బాధితురాలు తెనాలి 2టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశం (D) కంభం గ్రామానికి చెందిన అబ్దుల్ సత్తార్, మార్కాపురానికి చెందిన కరుణాకర్‌, గోరంట్లకు చెందిన భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

News August 26, 2024

గుంటూరు: ‘వాలంటీర్లకు వేతనాలను చెల్లించాలి’

image

పెండింగ్ లో ఉన్న వాలంటీర్ల గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను రాష్ట్ర వాలంటీర్ల అధ్యక్షుడు భాష కోరారు. ఆదివారం వాలంటీర్ల సంఘం నాయకులతో కలిసి ఆయన మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా ఎన్నికల హామీల్లో భాగంగా వేతనాలు పెంపు చేయాలని కోరారు. రాజీనామాలు చేసిన వాలంటీర్లను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలన్నారు.