Guntur

News September 28, 2025

మహానటి సావిత్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: జయసుధ

image

మహానటి సావిత్రి ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారని సినీ నటి జయసుధ అన్నారు. ఆదివారం గుంటూరు వచ్చిన సందర్భంగా కళా దర్బార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సావిత్రి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సావిత్రి నటన విశిష్టమైందని, ఆమె స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు. సావిత్రి విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.

News September 28, 2025

గుంటూరు జిల్లా వాసులకు కలెక్టర్ సూచన

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్సైట్ లోనూ నమోదు చేసుకోవచ్చన్నారు. సోమవారం జిల్లా కేంద్రంతో పాటూ మండల కార్యాలయాల్లో ప్రజా సమస్యలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News September 28, 2025

తెనాలిలో వింత…! స్మశాన వాటికలో డమ్మీ సమాధిపై ఫిర్యాదు

image

తెనాలి ఐతానగర్ స్మశాన వాటికలో ఎటువంటి మృతదేహం లేకుండా కొన్నేళ్లుగా డమ్మీ సమాధి నిర్మించారని ఇదే ప్రాంతానికి చెందిన గడ్డేటి ప్రకాష్ బాబు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం సీఐ రాములు నాయక్ ను కలిసి 2015లో డమ్మీ సమాధిని నిర్మించినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు. సమాధిని ముందుగానే నిర్మించి స్థలాన్ని కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంసమైంది.

News September 28, 2025

విజయవాడ: అమ్మవారి గుడి వైపు బైక్‌లకు నో ఎంట్రీ

image

సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా 29వ తేదీ రాత్రి 7.30 నుంచి 30న ఉదయం 10 వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. కుమ్మరిపాలెం, తాడేపల్లి చెక్‌పోస్ట్, గద్ద బొమ్మ సెంటర్ నుంచి బైక్‌లు, వాహనాలు అమ్మవారి గుడివైపు అనుమతించమన్నారు. నగరంలోకి ప్రవేశించే వాహనాలు పోలీసుల సూచనల మేరకు వారధి, వెస్ట్ బైపాస్, కనకదుర్గ ఫ్లైఓవర్, చిట్టినగర్ సొరంగం, BRTS రోడ్డు, CVR ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలన్నారు

News September 28, 2025

గుంటూరు: వరదల పరిస్థితిపై కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

image

వరదల పరిస్థితిపై సమాచారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం, అన్నవరంపాలెం లంక గ్రామాల కృష్ణా నది వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు, సిబ్బంది ఇచ్చే సూచనలు పాటించాలని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08963 2234014 ఫోన్ నంబరుకు సమాచారం అందించవచ్చని ఆమె చెప్పారు.

News September 28, 2025

GNT: అమ్మవారి గుడి వైపు బైక్‌లకు నో ఎంట్రీ

image

సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా 29వ తేదీ రాత్రి 7.30 నుంచి 30న ఉదయం 10 వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. కుమ్మరిపాలెం, తాడేపల్లి చెక్‌పోస్ట్, గద్ద బొమ్మ సెంటర్ నుంచి బైక్‌లు, వాహనాలు అమ్మవారి గుడివైపు అనుమతించమన్నారు. నగరంలోకి ప్రవేశించే వాహనాలు పోలీసుల సూచనల మేరకు వారధి, వెస్ట్ బైపాస్, కనకదుర్గ ఫ్లైఓవర్, చిట్టినగర్ సొరంగం, BRTS రోడ్డు, CVR ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలన్నారు.

News September 28, 2025

అతిసారం-కలరా నియంత్రణలో గుంటూరు ల్యాబ్ కీలకం

image

విజయవాడ, గుంటూరులో అతిసారం, కలరా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నీరు, ఆహార నమూనాల పరీక్షలకు ప్రధాన కేంద్రంగా గుంటూరు వైద్య కళాశాలలోని ప్రాంతీయ ల్యాబ్ పనిచేస్తోంది. సాధారణంగా నెలకు 400-500 నమూనాలు పరీక్షిస్తే, ఇటీవలి 10రోజుల్లోనే 1,300కి చేరాయి. గ్రామీణ నీటి సరఫరా నుంచి 423 నమూనాలు రాగా, 140 ఇప్పటికే పరిశీలించారు. నలుగురు టెక్నీషియన్లు, వైద్యులతో కూడిన బృందం రాత్రింబగళ్లు పరీక్షలు కొనసాగిస్తోంది.

News September 28, 2025

అమరావతిలో మంత్రి ఇంటి నిర్మాణానికి సన్నాహాలు

image

వెలగపూడి రెవెన్యూ పరిధిలో మంత్రి నారాయణ కొత్త ఇల్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నివాసానికి రెండు ప్లాట్ల దూరంలో 4,500 గజాల స్థలాన్ని స్థానిక రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసి, ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్, మట్టి పనులు పూర్తి చేశారు. విజయదశమి శుభదినాన్ని పురస్కరించుకుని అక్టోబరు 2న భూమి పూజ జరిపే అవకాశం ఉన్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

News September 28, 2025

గుంటూరులో అతిసారం నియంత్రణ ప్రయత్నాలు వేగం

image

గుంటూరులో అతిసారం కేసుల నియంత్రణ కోసం అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. శనివారం వరకు 221కేసులు నమోదయ్యగా, 141మంది డిశ్చార్జి కాగా, మరో 80మంది జీజీహెచ్ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజుల్లో 14కొత్త కేసులు వచ్చి, 13మంది కోలుకున్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యవేక్షణలో నోడల్ బృందాల చర్యలు కొనసాగుతుండగా, కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్షతో పరిస్థితి మెరుగుపడుతున్నట్టు తెలుస్తోంది.

News September 28, 2025

గుంటూరు: పొగాకు రైతులకు ఆశించిన లాభాలు రాక ఇబ్బందులు

image

గుంటూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్జీనియా పొగాకు కొనుగోళ్లు తుదిదశకు చేరుకున్నా, రైతులు ఆశించిన ధరలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు 176.06 మిలియన్ కిలోల పంట కొనుగోలు కాగా, గుంటూరు జిల్లాలోనూ పెద్దఎత్తున లోగ్రేడులు రావడం రైతుల నష్టాలకు దారి తీసింది. ఎకరాకు రూ.2 లక్షల వరకు ఖర్చు పెట్టినా, విక్రయం ద్వారా 1.50 లక్షలకే పరిమితమవుతుండటం కొత్త సీజన్ సాగుపై గుంటూరు రైతుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది.