Guntur

News August 26, 2024

తెనాలిలో యువతీ ఫోటోలు మార్ఫింగ్

image

గుంటూరు (D) తెనాలికి చెందిన ఓ యువతి వైద్యరంగంలో స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఆమె ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేసి వాటిని కొరియర్ ద్వారా ఆమెకు పంపి బెదిరించారు. బాధితురాలు తెనాలి 2టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశం (D) కంభం గ్రామానికి చెందిన అబ్దుల్ సత్తార్, మార్కాపురానికి చెందిన కరుణాకర్‌, గోరంట్లకు చెందిన భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

News August 26, 2024

గుంటూరు: ‘వాలంటీర్లకు వేతనాలను చెల్లించాలి’

image

పెండింగ్ లో ఉన్న వాలంటీర్ల గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను రాష్ట్ర వాలంటీర్ల అధ్యక్షుడు భాష కోరారు. ఆదివారం వాలంటీర్ల సంఘం నాయకులతో కలిసి ఆయన మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా ఎన్నికల హామీల్లో భాగంగా వేతనాలు పెంపు చేయాలని కోరారు. రాజీనామాలు చేసిన వాలంటీర్లను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలన్నారు.

News August 25, 2024

బాపట్ల జిల్లా యువతికి ఐదు కంపెనీల్లో ఉద్యోగాలు

image

బాపట్ల జిల్లా బొమ్మనంపాడుకు చెందిన శ్రావణికి ఒకేసారి 5 కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. గుంటూరులో ఇంటర్ చదివి పెదకాకానిలోని ఓ కాలేజీలో CSEలో చేరింది. బీటెక్ చివరి ఏడాదిలో తొలిసారిగా ఓ కంపెనీలో రూ.4.5లక్షలు, 2వ కంపెనీలో రూ.5 లక్షలు, 3వ కంపెనీలో రూ.9లక్షలు, 4వ కంపెనీలో రూ.11లక్షలు, 5వ కంపెనీలో రూ.23లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొంది ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. 

News August 25, 2024

అమరావతి నిర్మాణ వ్యయం రూ.60వేల కోట్లు

image

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 20వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. శనివారం కృష్ణా జిల్లాలో జరిగిన ఓ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారని స్పష్టం చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి పూర్తిస్థాయిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి అన్నారు.

News August 25, 2024

నగర వనాల అభివృద్ధికి నిధులు మంజూరు: పవన్ కళ్యాణ్

image

రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగరవనాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగరవనాలు అభివృద్ధి నిమిత్తం తొలి విడతగా రూ.15.4కోట్లను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిధులను మంజూరు చేసిందన్నారు.

News August 25, 2024

అరబిక్ సర్టిఫికెట్ కోర్సులో దరఖాస్తుల ఆహ్వానం

image

గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోని అంతర్జాతీయ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్స్ ఇన్ అరబిక్ లాంగ్వెజ్ మూడు నెలల కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంచాలకురాలు పద్మావతి తెలపారు. ఈ కోర్సు తరగతులను గుంటూరులోని అభ్యుదయ మహిళా కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రోజూ సాయంత్రం రెండు గంటల పాటు ఈ కోర్సు నిర్వహిస్తున్నామన్నారు. 

News August 24, 2024

బాపట్ల ఘటనపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు

image

బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో జరిగిన ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో అస్వస్థతకు గురైన పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వ డాక్టర్స్‌ను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, వైద్య సదుపాయం అందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలియజేశారు.

News August 24, 2024

1న ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ ఖోఖో జట్ల ఎంపిక

image

నరసరావుపేట శంకరభారతీపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్ బాల బాలికల ఖోఖో జట్ల ఎంపికలు సెప్టెంబర్ 1న జరుగుతాయని ఆ సంఘం కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. ఆసక్తి గలవారు 01.10.2010 తర్వాత పుట్టిన వారై ఉండాలన్నారు. వయసు, ఎత్తు, బరువు కలిపి 215 పాయింట్లు మించి ఉండరాదన్నారు. ఒక పాఠశాల నుంచి ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఎంపికలకు హాజరు కావాలన్నారు. 

News August 24, 2024

ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఇద్దరు ఎంపిక

image

ఈ నెల 28వ తేదీ నుంచి మాల్తా దేశంలో జరిగే వరల్డ్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే భారతదేశ జట్టులో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా పవర్ లిఫ్ట్‌ర్లు ఎంపికైనట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ భాస్కరరావు శుక్రవారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు తెనాలి పట్టణానికి చెందిన షానూన్, మంగళగిరి పట్టణానికి చెందిన సాదియా అల్మాస్ పోటీ పడనున్నారు.

News August 24, 2024

పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు: కలెక్టర్ నాగలక్ష్మి

image

జిల్లాలోని పరిశ్రమలలో ప్రమాదాలను నివారించేందుకు యాజమాన్యాలు అవసరమైన అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో పరిశ్రమలలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలలో రక్షణ ఏర్పాట్లను ఫ్యాక్టరీస్, కార్మిక, విద్యుత్, అగ్నిమాపక తదితర శాఖలు తనిఖీలు నిర్వహించి నివేదిక అందించాలన్నారు.