Guntur

News September 27, 2025

అతిసార వ్యాధి నియంత్రణలో ఉంది: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో అతిసార వ్యాధి నియంత్రణలో ఉందని కలెక్టర్ ఎం. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. జిల్లాలో మొత్తం 177 కేసులు నమోదయ్యాయని, వాటిలో 152 కేసులు గుంటూరు పట్టణం నుంచి, 25 కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాయని ఆమె వివరించారు. ఈ వ్యాధిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు.

News September 27, 2025

అమరావతిలో IIULER ఏర్పాటుకు AP అసెంబ్లీ ఆమోదం

image

అమరావతిలో IIULER ఏర్పాటుకు AP అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభానికి రంగం సిద్ధం చేయనున్నారు. క్యాంపస్ కోసం నామమాత్రపు లీజుకు (₹1/చ.మీ) 55 ఎకరాలు కేటాయించారు. AP విద్యార్థులకు 20% సీట్లు రిజర్వు చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ నిబంధనలు ఉంటాయని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ కింద నడుస్తుంది. అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టారు.

News September 26, 2025

ANU: పీజీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. జులై నెలలో జరిగిన డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఏ డాన్స్, ఎంఏ డాన్స్ కూచిపూడి పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీ లోపు రూ.1,860 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ సంప్రదించాలన్నారు.

News September 26, 2025

అధికారులకు గుంటూరు కలెక్టర్ సూచనలు

image

జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా కొల్లిపర మండలంలో పర్యటించారు. కృష్ణా నదికి భారీగా వరద రావడంతో పాటు లంక గ్రామాలకు ఎఫెక్ట్ ఉండడంతో పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులను గమనించారు. బొమ్మువానిపాలెంలో గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతూ, ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనిస్తూ ఉండాలని సబ్ కలెక్టర్ సంజన సింహకు సూచించారు.

News September 26, 2025

గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్ పొడిగింపు

image

రైలు సంఖ్య 17261/17262 గుంటూరు-తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్ను తాత్కాలికంగా పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు (తిరుగు ప్రయాణంలో మరుసటి రోజు) ఈ రైలు సేవలు ధర్మవరం వరకు అందుబాటులో ఉంటాయి. ఈ పొడిగింపు ద్వారా రైలు పాకాల-మదనపల్లె రోడ్-కదిరి మీదుగా ధర్మవరం వరకు ప్రయాణిస్తుంది. ఈ తాత్కాలిక సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

News September 26, 2025

OG సినిమాపై అంబటి కౌంటర్

image

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ సినిమాపై గురువారం వ్యంగ్యంగా స్పందించారు. సినిమా విడుదలైన నేపథ్యంలో, ‘ప్రత్యర్థి అయినా పవన్ సినిమా ఆడాలని నా ఆరాటమే కానీ, ఫలితం మాత్రం శూన్యం. దానయ్య.. దండగ పడ్డావయ్యా!’ అని ఆయన ట్వీట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బలంగా నిలవలేకపోయిందని ఎత్తిచూపుతూ రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

News September 26, 2025

గుంటూరులో అతిసార కేసులపై స్పష్టత కరువు

image

గుంటూరులో అతిసారం ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య, డిశ్చార్జి అవుతున్న కేసులపై అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం రాకపోవడంతో ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రత్యేక వార్డులో సుమారు 80 మంది చికిత్స పొందుతున్నారని, ఇప్పటివరకు 100 మందికి పైగా డిశ్చార్జి అయ్యారని తెలుస్తోంది. అయితే లెక్కల్లో పొంతన లేకపోవడంతో నిజ స్థితి ఏంటన్నది ప్రశ్నగా మారింది.

News September 26, 2025

రూ.3.57 కోట్లతో అనెక్స్ భవనం ప్రారంభం

image

AP అసెంబ్లీ ప్రాంగణంలో అనెక్స్ భవనాన్ని గురువారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రులు పయ్యావుల, నారాయణలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియా పాయింట్లో స్పీకర్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన భవనాన్ని అన్ని హంగులతో పునరుద్ధరించేందుకు రూ.3కోట్ల 57 లక్షలతో నిర్మించడం జరిగిందని తెలిపారు. భవనం గ్రౌండ్ ప్లోర్లో మీడియా సమావేశాలకు వీలుగా సుమారు 100 మంది మీడియా ప్రతినిధులు కూర్చోవచ్చన్నారు.

News September 26, 2025

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 25, 26, 27 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని గుంటూరు కలెక్టర్ తమిమ్ అన్సారియా గురువారం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పిల్లలు, పశువులను నీటి ప్రవాహాల వద్దకు పంపకూడదని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని పేర్కొన్నారు. మండల, డివిజినల్ అధికారులు స్థానిక స్థాయిలో అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్ నం. 0863-2234014 కి సమాచారమివ్వాలని తెలిపారు.

News September 25, 2025

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 25, 26, 27 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని గుంటూరు కలెక్టర్ తమిమ్ అన్సారియా గురువారం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పిల్లలు, పశువులను నీటి ప్రవాహాల వద్దకు పంపకూడదని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని పేర్కొన్నారు. మండల, డివిజినల్ అధికారులు స్థానిక స్థాయిలో అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్ నం. 0863-2234014 కి సమాచారమివ్వాలని తెలిపారు.