Guntur

News May 7, 2025

మంగళగిరి: స్వాతంత్య్రానికి ముందు ఉన్న స్కూల్‌కి ఏమవుతోంది.? 

image

భారతదేశానికి బ్రిటిషర్‌ల నుంచి స్వాతంత్య్రం రావడానికి ముందే 1944 మంగళగిరిలో చింతక్రింది కనకయ్య పేరుతో పాఠశాల ఏర్పాటు చేశారు. ఇది ఎయిడెడ్ స్కూల్ అయినప్పటికీ పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల పేర్లు ఒకప్పుడు ఇక్కడి నుంచే వినిపించేవి. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య, పాస్ పర్సంటేజ్ దారుణంగా పడిపోవడం ప్రజలలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ పాఠశాలను మళ్లీ ముందు వరుసలో నిలబెట్టాలని ప్రజల కోరిక.

News May 7, 2025

గుంటూరు: పదో తరగతి ఫలితాల్లో మెరుగుదల 

image

గుంటూరు జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో స్థిరమైన పురోగతి సాధిస్తోంది. కరోనా కాలమైన 2020, 2021ల్లో ప్రభుత్వం అందరినీ పాస్ చేసింది. 2022లో జిల్లాలో ఉత్తీర్ణత శాతం 68.20గా నమోదై రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. 2023లో అది 77.40కి పెరిగి 6వ స్థానంలో నిలువగా, 2024లో 88.14 శాతంతో 16వ స్థానానికి చేరింది. అయితే 2025లో మళ్లీ పరుగులు పెడుతూ 88.53 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. 

News May 7, 2025

గుంటూరు: నాలుగేళ్లలో 3,456 అగ్నిప్రమాదాలు  

image

గుంటూరు జిల్లాలో 2021 నుంచి ఫిబ్రవరి 2025 వరకు జరిగిన అగ్ని ప్రమాదాల్లో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. అగ్నిమాపక సిబ్బంది తెగువతో 72 మందిని కాపాడారు. 2019-25 మధ్య మొత్తం 3,456 ప్రమాదాలు నమోదు కాగా, రూ.212 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగింది. అదే సమయంలో రూ.276.22కోట్ల ఆస్తిని కాపాడగలిగారు. 2023-24లోనే అత్యధికంగా రూ.102.4కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. 

News May 7, 2025

సుప్రీం కోర్టులో బోరుగడ్డకు చుక్కెదురు 

image

గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌కు సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ అంశాన్ని హైకోర్టులోనే విచారించాలని స్పష్టం చేస్తూ బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. దీంతో బోరుగడ్డ అనిల్‌కు చట్టపరంగా భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 

News April 25, 2025

సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

సత్తెనపల్లి (M) రెంటపాళ్లలో గురువారం ప్రమాదం జరిగింది. ఘటనలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మృతుడు మహేశ్ ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పుట్టిన రోజు కావడంతో విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తుండగా DDపాలెం రోడ్డులో ఎదురుగా వచ్చిన పాల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో మహేశ్ స్పాట్‌లోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 25, 2025

GNT: ట్రిపుల్ ఐటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారని పొన్నూరు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 20వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థుల నుంచి రూ.300, రిజర్వు గ్రూపుల నుంచి రూ.200 చెల్లించాలన్నారు.

News April 25, 2025

మేయర్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం: అంబటి

image

గుంటూరు మేయర్ ఎన్నికపై వైసీపీ అనూహ్య మలుపు తిరిగింది. పోటీలో వైసీపీ పోటీ చేయదని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే అంబటి రాంబాబు అభ్యర్థిని ప్రకటిస్తామని గురువారం తెలిపారు. ఈ నెల 28న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు బృందావన్ గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

News April 25, 2025

దేవతల నగరంగా అమరావతి ప్రసిద్ధి

image

నవ్యాంధ్ర రాజధాని అమరావతి చరిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల రాజధానిగా పేరు పొందింది. దేవతల నగరంగా ఖ్యాతి గాంచింది. బౌద్ధ మతం ఇక్కడ విలసిల్లింది. గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణా నది పక్కనే ఉన్న అమరావతి ఎన్నో విశిష్టతలు కలిగి ఉంది. బౌద్ధ స్తూపం, మ్యూజియం, ధ్యాన బుద్ధ విగ్రహం ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. ఇక్కడి అమరలింగేశ్వర దేవాలయం దేశంలోని పంచారామ క్షేత్రాలలో ఒకటిగా పేరుంది.

News April 25, 2025

GNT: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కమిషనర్

image

గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి.సాయి కల్యాణ్ చక్రవర్తిని గురువారం గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి వెళ్లి కమిషనర్ మొక్కను బహుకరించారు. నగరపాలక సంస్థ పరిధిలోని అభివృద్ధి పనుల్లో భాగంగా స్థలసేకరణలో ఇళ్లు కోల్పోయి కోర్టులో దాఖలైన కేసుల‌పై ఈ సందర్భంగా వారు చర్చించారు.

News April 25, 2025

GNT: ‘పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి’

image

గుంటూరు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డా.విజయలక్ష్మి అధ్యక్షతన DMHO చాంబర్‌లో జిల్లా ఆరోగ్య అధికారులతో సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు. డా.విజయలక్ష్మి మాట్లాడుతూ..మలేరియా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 25న జరగబోయే ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు.