Guntur

News August 22, 2024

చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్

image

మెగాస్టార్ చిరంజీవికి మంత్రి నారా లోకేశ్ X వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నటన తెలుగు ప్రేక్షకులకు ఓ వరం. మీ డాన్స్ అభిమానులకు కనుల విందు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రాణ దానం చేస్తున్న మీ సేవా స్ఫూర్తి మాకు ఆదర్శం. దేవుని ఆశీస్సులతో, తెలుగు ప్రజల ఆదరాభిమానాలతో, ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

News August 22, 2024

నరసరావుపేట: తల్లి పేరుతో మొక్కను నాటిన కలెక్టర్

image

తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా నరసరావుపేటలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబు తన తల్లి పేరుతో గురువారం మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ తల్లి పేరుతో మొక్కలు నాటాలన్నారు. తద్వారా పర్యావరణాన్ని పరిష్కరించుకోవచ్చని అన్నారు. సకాలంలో వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News August 22, 2024

గుంటూరు రేంజ్ పరిధిలో 13 మంది సీఐలు బదిలీ

image

గుంటూరు రేంజ్ పరిధిలో 13 మంది సీఐలను బదిలీ చేస్తూ ఐజీ త్రిపాఠి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల జిల్లా వేమూరు సీఐగా పీవీ ఆంజనేయులు, రేపల్లె రూరల్ సీఐగా సురేశ్ బాబులను నియమించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సీఐగా గన్నవరపు శ్రీనివాసరావు, మేడికొండూరు సీఐగా నాగూర్ మీరా, గుంటూరు దిశా-1 సీఐగా నారాయణ, పల్నాడు జిల్లా సత్తెనపల్లి సీఐగా బ్రహ్మయ్య, నరసరావుపేట టూ టౌన్ సీఐగా హైమారావును నియమించారు.

News August 22, 2024

మంగళగిరి: లారీ ఢీకొని కానిస్టేబుల్ స్పాట్‌డెడ్..UPDATE

image

విజయవాడలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి , మంగళగిరి 6వ బెటాలియన్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ తారక రామారావు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతని కుటుంబ పరిస్థితిని తెలుసుకుంటే కళ్లు చెమ్మగిల్లాల్సిందే. ఎనిమిదేళ్ల క్రితం ఆయన సోదరుడు కూడా ప్రమాదంలో మృతి చెందారు. వారి పిల్లలను కూడా రామారావు సాకుతున్నారు. ఇప్పుడు ఆయన కూడా మృతి చెందడంలో కుటుంబం దిక్కులేనిదయ్యిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

News August 22, 2024

మంగళగిరి: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 21 మంది అరెస్ట్

image

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును దర్యాప్తు పోలీసులు వేగవంతం చేస్తున్నామన్నారు. మొత్తం 106 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా 21 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. మిగతా 85 మందికి మంగళగిరి గ్రామీణ పోలీసులు ఈనెల 19 నోటీసులు జారీ చేశారు. ఇందులో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, అరవ సత్యం వంటి ముఖ్య నేతలతో పాటు ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ కూడా ఉన్నారని తెలిపారు.

News August 22, 2024

గుంటూరులో బాలికపై అత్యాచారం

image

బాలికపై అత్యాచారం జరిగినట్లు అరండల్ పేట పీఎస్ లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బొంగరాలబీడుకు చెందిన 16 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. మాయమాటలు చెప్పి ఆ బాలికకు దగ్గరై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తండ్రికి తెలియజేసింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 22, 2024

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించండి: నాగలక్ష్మి

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు అందిస్తుందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె తుళ్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News August 21, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

* పల్నాడు జిల్లాలో దారుణం.. మూగ బాలికపై అత్యాచారం
* గుంటూరు: భారత్ బంద్.. పరీక్షల తేదీల్లో మార్పులు
* గుంటూరు జిల్లాలో నిలిచిపోయిన బస్సులు
* గుంటూరు: ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో షాక్
* మంగళగిరి వైసీపీ కార్యాలయానికి నోటీసులు
* అంతరాష్ట్ర దొంగల్ని పట్టుకున్న గుంటూరు పోలీసులు
* గుంటూరులో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

News August 21, 2024

రష్యాలో ఎల్బ్రస్ పర్వతం అధిరోహించిన తెలుగు యువతి

image

రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని తెలుగు యువతి అధిరోహించింది. ఈ పర్వతం రష్యా, ఐరోపాలో ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 5,642మీ(18,510 అడుగులు) ఎత్తులో ఉన్న ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం. ఇది యురేషియా సూపర్ ఖండంలో ఎత్తైన స్ట్రాటోవోల్కానో, అలాగే ప్రపంచంలోని 10వ-అత్యంత ప్రముఖ శిఖరం. ఈ శిఖరాన్ని తాడేపల్లికి చెందిన యువతి అన్నపూర్ణ అలవోకగా అధిరోహించారు. ఆమె త్వరలో తాడేపల్లికి రానున్నారు. 

News August 21, 2024

అచ్యుతాపురంలో రియాక్టర్‌ పేలుడు ఘటనపై జగన్‌ దిగ్భ్రాంతి

image

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రియాక్టర్‌ పేలుడు ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.