India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇంద్రకీలాద్రిపై సా.6.30 గంటల నుంచి రాత్రి 7.30 వరకు గంట పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. నివేదన, పంచ హారతుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రోటోకాల్ మార్గంలో ఉదయం నుంచి పెద్ద ఎత్తున బయటి వ్యక్తులు వస్తుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రోటోకాల్ గేట్కి ఎండోమెంట్ కమిషనర్ తాళం వేయించారు. మీడియా వారిని సైతం లోపలికి అనుమతించలేదు.

తుళ్లూరు: భూ సమీకరణ పథకంలో భూములను ఏపీ సీఆర్డీఏకు అప్పగించిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం(ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామ రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తున్నట్టు సీఆర్డీఏ కమీషనర్ కన్నబాబు గురువారం తెలిపారు. ఈ నెల26వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ – లాటరీ జరుగుతుందన్నారు. 56 మంది రైతులకు 104 ప్లాట్లను పంపిణీ చేయనున్నారు.

భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ నెల 23వ తేదీ మంగళవారం సాయంత్ర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించడం జరిగిందని జల వనరుల విభాగ అధికారులు తెలియజేశారు. గురువారం మధ్యాహ్నం 1.30 వరకు బ్యారేజీ నీటి మట్టం 12 అడుగుల కంటే తక్కువగా ఉన్నట్లు చెప్పారు.

రాజధానిలో తొలి శాశ్వత భవనంగా CRDA ప్రధాన కార్యాలయం రికార్డు నెలకొల్పనుంది. కార్పొరేట్ ఆఫీసులకు దీటుగా అత్యాధునిక డిజైన్, ఇంటీరియర్తో రూపుదిద్దుకున్న ఈ జీ+7 భవనం విజయదశమి పండుగ సందర్భంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. రూ.240కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కార్యాలయం, రాయపూడి సమీపాన ఉంది. టెర్రస్పై ఫుడ్ కోర్ట్, జిమ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇది రాజధాని నిర్మాణంలో ఒక మైలురాయిగా నిలువనుంది.

గుంటూరులోని ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, రెడ్ల బజార్, సంగడిగుంట సహా 9 ప్రాంతాల్లో డయేరియా వ్యాప్తి చెందడంతో గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ అప్రమత్తమయ్యారు. కమిషనర్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యంపై జాగ్రత్తలు సూచించారు. వ్యాధి మరింత ప్రబలకుండా తక్షణ చర్యగా నగరంలో పానీపూరీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.

గుంటూరు జిల్లాలోని యువతకు కేంద్ర యువజన వ్యవహారాల శాఖ శుభవార్త అందించింది. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరగనున్న జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ క్విజ్ పోటీలు ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన సేవల సీఈఓ విజయలక్ష్మి తెలిపారు. అక్టోబరు 15లోపు mybharat.gov.in/quizలో నమోదు చేసుకోవాలి. విజేతలకు ప్రధానితో ఆలోచనలు పంచుకునే అవకాశం లభిస్తుంది.

గుంటూరులో ఇప్పటి వరకు 185 మంది అతిసారంతో జీజీహెచ్లో చేరారు. వీరిలో ప్రస్తుతం 104 మంది ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రగతినగర్, రామిరెడ్డినగర్ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. ఆర్వో ప్లాంట్ల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో కొన్నిట్లో బ్యాక్టీరియా ట్రేసెస్ గుర్తించారు. కలుషిత ఆహారం ఉన్న అనుమానిత ఆహారశాలలను మూసివేసి, పానీపూరీ బండ్లపై ఆంక్షలు విధించారు.

జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ నేతృత్వంలో ఈనెల 27న తెనాలిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు MPDO అత్తోట దీప్తి బుధవారం తెలిపారు. VSR & NVR కాలేజీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మేళా నిర్వహిస్తారన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటిఐ, డిగ్రీ చదివి, 18 నుంచి 35 సంవత్సరాల వయస్సున్న వారు అర్హులన్నారు. ఇంటర్వ్యూకు వచ్చే వారు సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ ఫొటోతో రావాలని సూచించారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జులై 2025లో నిర్వహించిన PG రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను బుధవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. M.SC ఎన్విరాన్మెంటల్ సైన్స్ 16/16 మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారన్నారు. జవాబు పత్రాల రీవాల్యుయేషన్ కోసం అక్టోబర్ 7లోపు ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.1860లు, జవాబు పత్రం నకలు కావాలనుకునేవారు రూ. 2190లు చెల్లించాలన్నారు.

పాతగుంటూరులో చోటుచేసుకున్న దొంగతనం ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారు ఇంట్లోని బీరువా పగులగొట్టి రూ.2.40 లక్షలు దొంగలించిన కేసులో CI వెంకట ప్రసాద్, SI అబ్దుల్ రెహమాన్ బృందం దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ఈస్ట్ డివిజన్ పరిధిలో వారిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి రూ.2.10 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపించారు.
Sorry, no posts matched your criteria.