Guntur

News September 23, 2025

గుంటూరు మిర్చీ యార్డులో 50%కు పడిపోయిన అమ్మకాలు

image

గుంటూరు మిర్చీ యార్డులో 50% కు అమ్మకాలు పడిపోయాయి. దసరా ఉత్సవాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో లారీల రాకపోకలపై నిషేధం విధించారు. దీంతో గుంటూరు మిర్చి యార్డు నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. మిర్చి ధర కూడా క్వింటాకు రూ. 800 వరకు తగ్గుదల అయ్యింది. రానున్న 10 రోజుల్లో రోజుకి 25 వేల టిక్కీల వరకు విక్రయం కూడా కష్టమే అనే మిర్చి ట్రేడర్లు చెబుతున్నారు.

News September 23, 2025

బస్సులో ప్రయాణించి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

DSC నియామక పత్రాల జారీ కార్యక్రమ సభకు వచ్చే వాహనాల రాకపోకల మార్గాలను కలెక్టర్ తమీమ్ అన్సారీయా ఇతర జిల్లా ఉన్నతాధికారులతో కలసి స్వయంగా బస్సులో ప్రయాణించి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండే విధంగా అవసరమైన చోట రహదారులను వెడల్పు చేయించడం, మరమ్మతులు చేయించడం వంటి పలు అంశాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఇతర అధికారులు ఉన్నారు.

News September 22, 2025

ANU: దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య 2025-26 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలను వర్సిటీ VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ లు సోమవారం విడుదల చేశారు. ఎంబీఏ 600 మందికి 435మంది, ఎంసీఏ 128 మందికి 80మంది అర్హత సాధించారన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ www.anucde.info. నుండి ఫలితాలు పొందవచ్చు అన్నారు.

News September 22, 2025

దసరా సెలవులు ప్రకటించినా… కొన్ని పాఠశాలలు కొనసాగింపు

image

రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్ 22 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని మంత్రి లోకేశ్ ప్రకటించారు. అయితే గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పరీక్షల పేరుతో, మరికొందరు సిలబస్ పేరుతో సెలవులు ఇవ్వకుండా స్కూల్ తరగతులు కొనసాగిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.

News September 22, 2025

తెలుగు సినిమాకు సంగీతం అందించిన దర్శక శిఖరం

image

బొడ్డు గోపాలం (1927-2004) ఒక ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు. ఆయన గుంటూరు జిల్లా తుళ్లూరులో జన్మించారు. ప్రజా నాట్య మండలిలో చేరి “చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా” వంటి దేశభక్తి గీతాలకు స్వరకల్పన చేసి ప్రసిద్ధి పొందారు. తర్వాత ఘంటసాల దగ్గర సహాయకుడిగా పనిచేసి, “నలదమయంతి” చిత్రంతో స్వతంత్ర సంగీత దర్శకుడిగా మారారు. “రంగులరాట్నం”, “కరుణామయుడు” వంటి చిత్రాలకు ఆయన సంగీతం అందించారు.

News September 22, 2025

GNT: దర్శనం టికెట్ల కౌంటర్ కోసం QR కోడ్

image

విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో దసరా మహోత్సవం సందర్భంగా భక్తుల సౌలభ్యం కోసం కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. టికెట్ కౌంటర్లకు సులభంగా చేరుకునేందుకు ప్రత్యేకంగా QR కోడ్ స్కానర్లు ఏర్పాటు చేశారు. భక్తులు స్కాన్ చేస్తే లొకేషన్‌ల జాబితా మొబైల్‌లో ప్రత్యక్షమై, కావలసిన స్థలాన్ని ఎంచుకుని గూగుల్ మ్యాప్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. భక్తులు ఈ సౌకర్యాన్ని వాడుకొని సులభంగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు.

News September 21, 2025

డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే: కలెక్టర్

image

అతిసార లక్షణాలున్న ప్రాంతాల్లో 33 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ నెల 16 నుంచి ఇప్పటివరకు 80 కేసులు నమోదయ్యాయని చెప్పారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిలో 13 మందిని సాధారణ వార్డులకు తరలించామని, 11 మంది డిశ్చార్జ్ అయ్యారని వివరించారు.

News September 21, 2025

కళాతపస్వి కె. విశ్వనాథ్ మన గుంటూరు వాసే

image

ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన కళాతపస్వి కె. విశ్వనాథ్ ఉమ్మడి గుంటూరు జిల్లా పెదపులివర్రులో జన్మించారు. ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధామైనవి. 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 2022లో ఏపీ ప్రభుత్వం ద్వారా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.

News September 21, 2025

గంజాయి జోలికెళితే కఠిన చర్యలు: GNT ఎస్పీ

image

గుంటూరు జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే తమ లక్ష్యమని ఎస్పీ వకూల్ జిందాల్ తెలిపారు. గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడిచిన 2 రోజుల్లో 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, 22 మందిని అరెస్టు చేశామన్నారు. ఈగల్ టీమ్‌తో సమన్వయం చేసుకుంటూ గంజాయి దందాకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ఇకపై కార్డెన్ సెర్చ్, వాహనాల తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు.

News September 20, 2025

అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు: DEO

image

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు DEO సి.వి. రేణుక తెలిపారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు సమాచారాన్ని అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు తెలియజేయాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.