Guntur

News August 20, 2024

మంగళగిరి: దొంగిలించిన ఫోన్ నుంచి రూ.లక్ష చోరీ

image

ఫోన్ దొంగిలించి, రూ.లక్ష కాజేసిన ఘటన మంగళగిరిలో జరిగింది. శ్రీనగర్ కాలనీకి చెందిన రమేశ్ సోమవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చాడు. గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తి అతని ఫోను దొంగలించారు. నగదు కోసం బ్యాంకుకు వెళ్లి అకౌంట్ చూడగా ఫోన్ పే ద్వారా రూ. లక్ష పలువురికి బదిలీ అయినట్లు గుర్తించి, మంగళగిరి పోలీసులను ఆశ్రయించాడు. ముగ్గురు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

News August 20, 2024

పిట్టలవానిపాలెం: రాఖీ పండుగ వేళ తీవ్ర విషాదం

image

చీరాల-వేటపాలెం బైపాస్‌లో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగి ఓ బాలిక మృతిచెందింది. పోలీసుల వివరాల మేరకు.. పిట్టలవానిపాలెంకు చెందిన వెంకటేశ్వరరెడ్డి తన భార్య లలిత, కుమార్తెలు నందిని, రేణుకాదేవితో వాడరేవు సమీపంలో ఉన్న పచ్చమొగలి గ్రామానికి వెళ్లారు. అక్కడ లలిత తన సోదరుడికి రాఖీ కట్టగా.. నలుగురు బైకుపై నివాసం ఉంటున్న చినగంజాం తిరుగుపయనమయ్యారు. వీరి బైకును కారు ఢీకొట్టగా నందిని అక్కడికక్కడే చనిపోయింది.

News August 19, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

* గుంటూరు: 21న జిల్లా అథ్లెటిక్ జట్ల ఎంపిక
* తోడబుట్టిన తమ్ముడిలా అభిమానించారు: లోకేశ్
* పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
* గుంటూరు: కెమెరామేన్‌ అవతారమెత్తిన సీఎం
* పల్నాడు: TDP కార్యాలయంలో కత్తులతో దాడి
* YS జగన్‌కు రాఖీ కట్టిన విడదల రజనీ
* గుంటూరు: అన్న క్యాంటీన్‌కు రూ.కోటి విరాళం

News August 19, 2024

పొన్నూరులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

పొన్నూరు మండలం మామిళ్లపల్లి అడ్డరోడ్డు వంతెన ప్రక్కన సోమవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికుల సమాచారంతో పొన్నూరు రూరల్ పోలీసులు కనుగొన్నారు. ఎత్తు సుమారు 4.5, నల్ల జాకెట్టు, మెడలో పసుపు తాడు, పసుపు లంగా ధరించి మృతదేహం సగభాగం కుళ్లిపోయిందని రూరల్ పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీఐ కోటేశ్వరరావు తెలిపారు. మృతికి గల కారణం తెలియాల్సి ఉంది. 

News August 19, 2024

అన్న క్యాంటీన్‌కు రూ.కోటి విరాళం

image

రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.కోటి విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో సోమవారం మంత్రి లోకేశ్‌కు ఈ మేరకు రూ.కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోహిత్‌ను అభినందించారు. 

News August 19, 2024

నరసరావుపేట: ‘గడువులోగా సమస్యలను పరిష్కరించాలి’

image

ఫిర్యాదు దారుని సమస్యల పట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

News August 19, 2024

బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 36 ఫిర్యాదులు

image

బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి 36 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

News August 19, 2024

ప్రతి రూపాయి బాధ్యతతో ఖర్చు పెట్టాలి: పవన్ కళ్యాణ్

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ పథకం ద్వారా రూ.వేల కోట్లు నిధులు వెచ్చిస్తున్నామని, ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చు చేయాలన్నారు.

News August 19, 2024

ఫొటోగ్రఫీ డే.. కెమెరామేన్‌ అవతారమెత్తిన సీఎం

image

వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సీఎం చంద్రబాబు ఫొటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫొటో జర్నలిస్టులు సీఎంను కలిశారు. అనంతరం చంద్రబాబు వారి చేతిలో కెమెరా తీసుకుని ఫొటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఉంటూ వివిధ కార్యక్రమాల ఫొటోలను తీయడం చాలా కష్టతరమని సీఎం వ్యాఖ్యానించారు.

News August 19, 2024

గుంటూరు: 21న జిల్లా అథ్లెటిక్ జట్ల ఎంపిక

image

అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో అండర్ -14, 16 బాలబాలికలు, అండర్-18, 20 యువతీ, యువకుల జిల్లా స్థాయి అథ్లెట్ల ఎంపిక నిర్వహిస్తామని ప్రధాన కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ పోటీలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 21న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారిని సెప్టెంబరు 14 నుంచి 16వ తేదీ వరకు ఏఎన్ యూలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.