Guntur

News April 25, 2024

పెరిగిన అనిల్ కుమార్ ఆస్తులు

image

నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్వోకి అందజేసిన అఫిడవిట్‌లో పలు విషయాలను ప్రస్తావించారు. 2019లో స్థిరాస్తులు రూ.30 లక్షలు చూపగా, ఈసారి రూ.1.83 కోట్లుగా పేర్కొన్నారు. చరాస్తులు కూడా రూ.2.79 కోట్ల నుంచి రూ.4.53కోట్లకు పెరిగాయి. అప్పు రూ.1.59కోట్లు ఉంది. ఈయన పేరు మీద 2 కార్లు ఉన్నాయి. అనిల్ మీద ఒక పోలీస్ కేసు నమోదైంది.

News April 25, 2024

నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ ఎలక్షన్ కో ఆర్డినేటర్‌గా జంగా

image

నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ ఎలక్షన్ కో ఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. రెండుసార్లు గురజాల ఎమ్మెల్యేగా జంగా ఎన్నికయ్యారు. వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌గా పని చేశారు. వైసీపీతో విభేదించి టీడీపీలో చేరారు. నరసరావుపేట పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచి చంద్రబాబుకు గిఫ్టుగా ఇస్తామని జంగా చెప్పారు.

News April 25, 2024

బాపట్ల: ‘26 లోపు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోండి’

image

ఎన్నికల విధులకు నియమించబడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించినట్లు బాపట్ల అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సర్వీసులు కింద పని చేస్తున్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం-12డీలను ఏప్రిల్ 26 లోగా రిటర్నింగ్ అధికారికి అందజేయాలని తెలిపారు.

News April 25, 2024

గుంటూరు: జిల్లాలో ఎన్నికల పరిశీలకుల పర్యటన 

image

ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన పరిమళ సింగ్, కాజాన్ సింగ్ బుధవారం బాపట్ల జిల్లాలో పర్యటించారు. జిల్లాకు విచ్చేసిన వారికి కలెక్టర్ రంజిత్ భాష, ఎస్పీ వకుల్ జిందాల్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ముందస్తు చర్యలపై కలెక్టర్, ఎస్పీతో చర్చించారు. ఎన్నికల ప్రశాంతంగా జరగడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి ఆరా తీశారు. 

News April 25, 2024

నరసరావుపేటలో ఆరవ రోజు 64 నామినేషన్లు

image

జిల్లాలో ఆరవ రోజు బుధవారం మొత్తం 64 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. అత్యధికంగా నరసరావుపేట పార్లమెంటుకు 10, అసెంబ్లీ స్థానానికి 11, నామినేషన్లు వేశారని చెప్పారు. పెదకూరపాడు అసెంబ్లీకి 7, చిలకలూరిపేట అసెంబ్లీకి 7 సత్తెనపల్లి అసెంబ్లీకి 9 వినుకొండ అసెంబ్లీకి 6, గురజాల అసెంబ్లీకి 7, మాచర్ల అసెంబ్లీకి 7 ,నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. 

News April 25, 2024

గుంటూరు వ్యక్తి హైదరాబాద్‌లో సూసైడ్

image

గుంటూరుకు చెందిన యానిమేషన్ సినిమా కథ రచయిత ప్రశాంత్ (45) ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ మణికొండలో నివాసం ఉండే ఇతనికి మంగళవారం బంధువులు ఫోన్ చేశారు. ఎంత సేపటికీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెళ్లి చూడగా ఉరేసుకొని కనిపించాడు. తన ఆరోగ్యం బాలేదని, వైద్యానికి చేసిన అప్పులు తీర్చలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 25, 2024

నరేంద్ర వర్మ ఆస్తులు ఎంతంటే.?

image

బాపట్ల కూటమి అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో దంపతుల ఉమ్మడి ఆస్తి రూ.109.47 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వర్మ పేరిట చరాస్తులు రూ.73.72 కోట్లు, స్థిరాస్తులు రూ.22.59 కోట్లు.. అప్పు రూ.25.91 కోట్లు ఉంది. భార్య హరికుమారికి రూ.11.29 కోట్ల చరాస్తులు, రూ.1.87 కోట్ల స్థిరాస్తులున్నాయి. ఈయనకు సొంత కారు లేదు. 9 పోలీసులు కేసులున్నాయి.

News April 25, 2024

ప్రత్తిపాటి పుల్లారావుపై 13 కేసులు

image

పల్నాడు జిల్లా చిలకలూరిపేట కూటమి అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అందజేసిన అఫిడవిట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ఐదేళ్ల కాలంలో ఆయనపై 13 కేసులు నమోదయ్యాయి. పుల్లారావు పేరుతో చరాస్తులు రూ.55.70 కోట్లు, స్థిరాస్తులు రూ.15.51 కోట్లు, అప్పులు రూ.35.90 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు.

News April 25, 2024

నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నామినేషన్లు వేసేది వీళ్లే..

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బలసాని కిరణ్, ప్రత్తిపాడు కాంగ్రెస్ అభ్యర్థిగా కొరివి వినయ్ కుమార్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, అన్నాబత్తుని శివకుమార్, మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మారెడ్డి, వినుకొండ టీడీపీ అభ్యర్థిగా జీవీ ఆంజనేయులు, గురజాల వైసీపీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. 

News April 25, 2024

గుంటూరు: నిన్న నామినేషన్ వేయలేకపోయిన అంబటి మురళీ

image

పొన్నూరు YCP అభ్యర్థి అంబటి మురళీ కృష్ణ మంగళవారం నామినేషన్ వేయలేకపోయారు. నిన్న ఉదయం ఆయన పెదకాకాని మండలం నంబూరు నుంచి వైసీపీ శ్రేణులతో ర్యాలీగా బయల్దేరారు. కాగా, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో నామినేషన్ సమయం దాటిపోయింది. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 3 వరకే నామినేషన్ వేయాల్సి ఉంటుంది. కానీ, ఆయన పొన్నూరు మున్సిపల్ కార్యాలయానికి కాస్త ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో మురళీ బుధవారం నామినేషన్ వేయనున్నారు.