Guntur

News August 11, 2024

NRIలు రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలి: పెమ్మసాని

image

అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు ఏపీకి వచ్చి రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐటీ ట్రైనింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సరైన గైడెన్స్ లేక అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.

News August 11, 2024

గుంటూరు: ఈ రైళ్లు ఆలస్యం

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున కొన్ని రైళ్లు ఆలస్యంగా, మరికొన్నింటిని మళ్లించినట్టు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో రేపల్లె-సికింద్రాబాద్ రైలు (17646) 240 నిమిషాలు, 12, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్- త్రివేండ్రం (17230) 75 నిమిషాలు, ఈనెల 12, 13 తేదీల్లో విశాఖపట్నం- లింగంపల్లి (12805) 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమవుతాయన్నారు.

News August 10, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

* నేను పార్టీ మారడం లేదు: MLC హనుమంతరావు
* గుంటూరు: భారీగా గంజాయి స్వాధీనం
* చిలకలూరిపేట: వాగులోకి దూసుకెళ్లిన కారు
* హామీలు ఇచ్చినప్పుడు తెలీదా?: నందిగం సురేశ్
* గుంటూరు జిల్లాలో పెరిగిపోతున్న అబార్షన్లు
* గుంటూరు: మహిళా హెడ్ కానిస్టేబుల్‌కు లైంగిక వేధింపులు
* బాపట్ల జిల్లాలో 18 మంది ఎస్ఐల బదిలీలు

News August 10, 2024

ఎస్పీ సతీశ్ కుమార్‌ను కలిసిన జేసీ భార్గవ్

image

ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమష్టిగా పని చేయాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. ఈ మేరకు ఇటీవల జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన భార్గవ్ తేజ ఎస్పీని శనివారం కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శాంతి భద్రతలపై సమష్టిగా పనిచేయాలని ఎస్పీ సూచించారు.

News August 10, 2024

బాపట్ల జిల్లాలో 18 మంది ఎస్ఐల బదిలీలు

image

బాపట్ల జిల్లాలో 18 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల పట్టణ ఎస్ఐలుగా విజయకుమార్, చంద్రావతి, వేమూరు- ఎస్సైగా రవికృష్ణ, కొల్లూరు- ఏడుకొండలు, నగరం- భార్గవ్, అమృతలూరు- అమరవర్ధన్, రేపల్లె- మోహన్, చందోలు- స్వామి శ్రీనివాస్‌లను నియమించడంతో పాటు పలువురుని బదిలీ చేశారు. 

News August 10, 2024

గుంటూరు జిల్లాలో పెరిగిపోతున్న అబార్షన్లు

image

రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అబార్షన్లు అధికంగా ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. 2024-25లో జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల మంది గర్భం దాల్చగా అందులో 1789 మందికి అబార్షన్లు అయినట్లు చెప్తున్నాయి. కాగా గుంటూరు, మంగళగిరి, తెనాలి, తాడేపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో వందలకొద్దీ ప్రాణాలు పిండ దశలోనే గాలిలోనే కలిసి పోతున్నాయి. పట్టణాల్లోనే ఇవి ఎక్కువ అవడం ఆందోళనకరం.

News August 10, 2024

మహిళా హెడ్ కానిస్టేబుల్‌కు ఇన్ స్పెక్టర్ లైంగిక వేధింపులు

image

తెనాలిలో ఓ ఇన్‌స్పెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఎస్ఐ వెంకటాద్రి వివరాల మేరకు.. తెనాలి రైల్వేస్టేషన్‌లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో హెడ్ కానిస్టేబుల్‌గా మహిళ పనిచేస్తున్నారు. తనతో ఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ అబ్ధుల్ ఖలీల్ అసభ్యంగా మాట్లాడటమే కాకుండా జులై 19న తనను పట్టుకుని రూంకు రావాలని వేధించినట్లు బాధితురాలు ఆర్పీఎఫ్ పోలీసులను ఆశ్రయించింది. ఈమేరకు శుక్రవారం కేసు నమోదైంది.

News August 10, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి: నాగలక్ష్మి

image

రోడ్డు ప్రమాదాలు జరిగితే సంబంధిత శాఖలు తనిఖీలు చేసి కారణాలు విశ్లేషించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు వెంటనే కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ జామ్‌లు జరగకుండా అవసరమైన ప్రాంతాల్లో రహదారులపై డివైడర్స్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి భద్రతపై ఆమె సమావేశం నిర్వహించారు.

News August 9, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

* తెనాలి అమ్మాయితో హీరో నాగచైతన్య నిశ్చితార్థం
* పల్నాడు జిల్లాలో మహిళ దారుణ హత్య
* గుంటూరులో జగన్, మహేశ్ బాబు ఫొటోలు వైరల్
* రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: అంబటి
* వినుకొండ: కిడ్నాప్‌ను చేదించిన పోలీసులు
* పులిచింతలకు భారీ వరద.. 11 గేట్లు ఎత్తివేత
* మంగళగిరి: వేధింపులతో ఉద్యోగిని సూసైడ్‌కు యత్నం

News August 9, 2024

ఎమ్మెల్సీ ఎంపిక విషయమై చంద్రబాబుతో విశాఖ నేతల చర్చ

image

చంద్రబాబు నివాసానికి విశాఖ టీడీపీ నేతలు శుక్రవారం చేరుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఖరారుపై వారు చంద్రబాబుతో చర్చిస్తున్నారు. వైసీపీ ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో తమ అభ్యర్థి ఎంపికపై చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ఏక అభిప్రాయం కుదిరితే ఇవాళ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు వ్యూహాలపై కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం.