India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాచర్ల మండలం అలుగురాజుపల్లిలోని న్యూటన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా డోన్ కు చెందిన విద్యార్థిని జక్కి రేణుక ఎల్లమ్మ మాచర్లలోని హాస్టల్ రూమ్లో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రూమ్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జనసేన పార్టీ తలపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో లక్ష సభ్యత్వాలు పూర్తి చేసుకున్నట్లు జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు చెప్పారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో లక్ష సభ్యత్వాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐటి టీంకు స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలలో జనసేన పార్టీ నానాటికి ఆదరణ పెరుగుతుందని తెలిపారు.
✎ పిడుగురాళ్లలో పురుగుల మందు తాగి ఆత్మహత్య
✎ షరతులకు కట్టుబడి ఉంటా బెయిలివ్వండి: హైకోర్టులో పిన్నెల్లి
✎ ప్రభుత్వ ITIలో మూడో విడత ప్రవేశాలు
✎ బాపట్ల: పాత గొడవల నేపథ్యంలో హత్య
✎ గుంటూరులో నర్సుపై ఉన్మాది బ్లేడుతో దాడి
✎ 100 రోజుల్లో అన్నీ సెట్ చేస్తాం: సీఎం చంద్రబాబు
✎ నరసరావుపేట: రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య
✎ రొంపిచర్ల: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం
✎ పల్నాడు కలెక్టర్ సీసీపై SC, ST కేసు నమోదు
దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా BSNL 4G సేవలు విస్తరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం తాడికొండలో 4G టవర్ను స్థానిక MLA శ్రవణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బేస్ బ్యాండ్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. పెమ్మసాని మాట్లాడుతూ.. సెప్టెంబర్ కల్లా 70%, మార్చి లోపు 100% 4G సేవలను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామన్నారు.
రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో స్నేహితుల దినోత్సవం రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రోహిత్ హైదరాబాదులో ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శనివారం వీకెండ్ కావడంతో అదే గ్రామానికి చెందిన బాల అనే స్నేహితుడితో బైకుపై హైదరాబాదుకు వెళ్లాడు. కేబుల్ బ్రిడ్జిపై నుంచి వస్తున్న క్రమంలో రాత్రి సమయంలో బ్రిడ్జి పైన డివైడర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు.
వడ్డేశ్వరంలోని వసతి గృహం వద్ద యువతిపై ఓ ఉన్మాది బ్లేడుతో దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తాడేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో యువతి నర్సుగా పనిచేస్తూ వడ్డేశ్వరంలోని వసతి గృహంలో ఉంటుంది. పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో దాడి చేసినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన నిందితుడు క్రాంతిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల్లో మూడో విడత ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లాస్థాయి పారిశ్రామిక శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ సాయి వరప్రసాద్ తెలిపారు. టెన్త్ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ, టీసీ, విద్యార్థితో పాటు తల్లిదండ్రులు ఆధార్ జిరాక్స్ తీసుకువెళ్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
అమరావతి నిర్మాణానికి పలువురు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి విరాళం అందించారు. కంకిపాడుకు చెందిన రైతు ప్రభాకర్ రావు రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన మాణిక్యమ్మ గాజులు విరాళంగా చంద్రబాబుకు అందజేశారు. పలువురు అన్న క్యాంటీన్లకు సైతం విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా దాతలందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
గురజాల మండలం దైద గ్రామంలో వేట కొడవళ్లు కలకలం రేపాయి. స్థానికుల కథనం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి ఫ్లెక్సీలో వేట కొడవళ్లు తీసుకెళ్తున్న సమయంలో గ్రామస్థులకు కనబడటంతో కొడవళ్లు గడ్డివాములో విసిరేసి పరారయ్యాడన్నారు. ఎవర, ఎక్కడికి తీసుకెళ్తున్నారనే సమాచారం తెలియాల్సి ఉంది. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మీ సేవ సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతూ శనివారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీసేవ నిర్వాహకుల సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తెచ్చి మీ సేవను రోడ్డున పడవేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మీ సేవపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.