India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

Way2Newsలో కామెంట్ పేకాట రాయుళ్లను పట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. 7వ తేదీన కోడిపందేలపై పోలీసులు రైడ్ చేసిన వార్త Way2Newsలో పబ్లిష్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఆ వార్తకు అనంతవరంలో రోజూ పేకాట ఆడుతున్నారని కామెంట్ చేశాడు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో రెక్కీ నిర్వహించారు. అనంతవరంలో పేకాట శిబిరంపై దాడి చేసి 14 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.90,500 స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరులోని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతం, వీణ, డోలు, వయోలిన్, మృదంగం, నాదస్వరం అంశాల్లో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాలకు అశోక్ నగర్లోని పాఠశాల కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రిన్సిపల్ కృష్ణవేణి కోరారు.

టీబీ శాఖలో NHM – NTEP ప్రాజెక్ట్ కింద ఖాళీగా ఉన్న ఐదు పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదలైంది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా తగిన ధ్రువ పత్రాలతో కలిపి ఆగస్టు 7 నుంచి 13వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు DM&HO కార్యాలయంలో సమర్పించవచ్చు. అనంతరం వచ్చిన అభ్యంతరాలు స్వీకరించబడవు. పూర్తి వివరాలు వెబ్సైట్లో https://guntur.ap.gov.in చూసుకోవచ్చని DMHO డా.విజయలక్ష్మి తెలిపారు.

మంగళగిరిలోని టీడీపీ స్టేట్ ఆఫీస్ వద్ద బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. జాతీయ రహదారి వెంబటి వాహనం ఒక్కసారిగా అగ్నికి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను నియంత్రణలోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

గుంటూరు పార్లమెంట్ పరిధిలో TDP పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గ్రామ పార్టీ అధ్యక్ష పదవులు పలుచోట్ల పూర్తికాగా కొన్నిచోట్ల ఎదురుచూస్తున్నారు. మండల అధ్యక్షుడి పదవితో పాటు, పార్టీ విభాగాలకు సంబంధించిన పదవుల కోసం కూడా పలువురు పోటీ పడుతున్నారు. మహానాడు అయ్యాక పదవులు కేటాయిస్తారని ఎదురు చూసిన వారికి నిరాశ ఎదురైంది. ఇప్పటికీ పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఎదురు చేస్తూనే ఉన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 7న మంగళగిరి ఆటోనగర్లో జరగనున్న జాతీయ చేనేత వస్త్ర దినోత్సవంలో పాల్గొననున్నారు. కలెక్టర్ నాగలక్ష్మీ అధికారులతో కలిసి మంగళగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన మార్గాలు, చేనేత కుటుంబాలతో సమావేశం, సభావేదిక వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జేసీ భార్గవ్ తేజ, ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న మంగళగిరి ఆటోనగర్ లోని వీవర్ శాల వద్ద జరిగే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మంగళవారం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ పర్యవేక్షణలో ముఖ్యమంత్రి కార్యక్రమాల కో ఆర్డినేటర్, శాసనమండలి సభ్యుడు పెందుర్తి వెంకటేశ్వరరావు, సీఎం పర్యటనకు సంబంధించి పనులను పరిశీలించారు. చేనేత కుటుంబాలతో సమావేశమయ్యే ప్రదేశంలో పలు సూచనలు చేశారు.

వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇంటికే డాక్యుమెంట్లు పంపిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం గుంటూరులో అర్బన్ ఆటో మ్యూటేషన్ విధానాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ల్యాండ్ డెవలప్మెంట్ ఫీజు రద్దు చేయడంతో కేవలం 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని చెప్పారు. గతంలో నిర్వహించిన ఎన్ఈవీఎస్ రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగాయన్నారు.

రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు చేపట్టాయని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఫసల్ భీమా అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రతీ గ్రామానికి బీజేపీ జెండా, కూటమి అజెండాను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు రాష్ట్రానికి వరాలు ఇస్తున్నారు. అమరావతి అనుసంధాన మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు.

గుంటూరు జిల్లాలో వానాకాలంలోనూ ఎండలు మండిపోతున్నాయి. రెండు మూడు రోజులుగా భానుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆగస్టులో కూడా ఉదయం 9 గంటల నుంచే 31 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలు మళ్లీ ముఖం చాటేయడంతో వాతావరణం పొడిగా మారింది.
Sorry, no posts matched your criteria.