Guntur

News July 13, 2024

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు

image

రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ GOMS నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం (WJHS) పొడిగింపునకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు.

News July 13, 2024

యువతకు శిక్షణా, ఉపాధి కల్పించాలి: బాపట్ల కలెక్టర్

image

జిల్లాలోని స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ డీఆర్డీఏ, మెప్మా అధికారులను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ నాగలక్ష్మీ పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి నిరుద్యోగ యువతకు శిక్షణా, ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఇందుకు అవసరమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్‌లో స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

News July 12, 2024

గుంటూరు: TODAY HEADLINES

image

* గుంటూరు: జగన్‌, సునీల్ కుమార్‌లపై కేసు.!
*చేబ్రోలులో ‘డార్లింగ్‌’ సినిమా యూనిట్‌ సందడి
*పిడుగురాళ్లలో కలవరపెడుతున్న డయేరియా.!
*గుంటూరులో తప్పిపోయిన బాలుడు సేఫ్
*బాపట్లలో కండక్టర్‌పై మహిళ దాడి
*నరసరావుపేట ఎంపీ లావుకు కీలక బాధ్యతలు
*సత్తెనపల్లి: సినీ ఫక్కీలో సెల్ ఫోన్ దొంగతనం
*తాడేపల్లి: ‘మాట నిలబెట్టుకున్న చంద్రబాబు’
*మరోసారి పిడుగురాళ్లకు మంత్రి నారాయణ

News July 12, 2024

పల్నాడు ప్రథమ కలెక్టర్ జిల్లాకు రాక

image

పల్నాడు జిల్లా ప్రథమ కలెక్టర్‌గా పని చేసిన లోతేటి శివశంకర్ ఈనెల 13న నరసరావుపేట రానున్నారు. పల్నాడు జిల్లా ఏర్పడ్డాక ఆయనను ప్రభుత్వం ప్రథమ కలెక్టర్‌గా నియమించింది. ఈ సందర్భంగా ఆయన జిల్లాకు చేసిన సేవలకు గుర్తింపుగా “లోతేటి శివశంకర్ ఐఏఎస్”అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు తెలిపారు.

News July 12, 2024

ANU: డిగ్రీ 7వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీఎస్సీ కెమిస్ట్రీ కోర్స్ చదువుతున్న విద్యార్థులు, రాయాల్సిన 7వ సెమిస్టర్ (Y20 బ్యాచ్) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 1, 2, 3, 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News July 12, 2024

చంద్రబాబు పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు

image

ఈనెల 13వ తేదీన తాడేపల్లి మండలం కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. దీంతో అక్కడ పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఎస్పీ తుషార్, సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్‌లతో కలిసి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. గట్టి భద్రత ఏర్పాట్లతోపాటు వాహనాల పార్కింగ్, బారికేట్లు ఏర్పాటు చేయాలన్నారు.

News July 12, 2024

మంగళగిరిలోని కొలనుకొండకు వెళ్లనున్న చంద్రబాబు

image

మంగళగిరిలోని కొలనుకొండకు సీఎం చంద్రబాబు శనివారం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహిస్తారని వివరించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మంగళగిరి చేరుకోనున్నారు. దీంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.

News July 12, 2024

మంగళగిరిలోని కొలనుకొండకు వెళ్లనున్న చంద్రబాబు

image

మంగళగిరిలోని కొలనుకొండకు సీఎం చంద్రబాబు శనివారం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహిస్తారని వివరించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మంగళగిరి చేరుకోనున్నారు. దీంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.

News July 12, 2024

అనంత్ అంబానీ పెళ్లికి మంత్రి నారా లోకేశ్

image

ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధిక వివాహ వేడుకకు మంత్రి నారా లోకేశ్ హాజరు కానున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ పెళ్లి వేడుకకు పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.

News July 12, 2024

పిడుగురాళ్ల: పెరుగుతున్న అతిసార బాధితులు

image

పిడుగురాళ్లలోని లెనిన్‌నగర్, మారుతీనగర్‌ ప్రజలు అతిసార లక్షణాలతో 10రోజులుగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తొలిరోజు 25మంది ఆస్పత్రుల్లో చేరగా..బాధితుల సంఖ్య పెరుగుతోంది. కాగా, దీనికి మూలకారణమేంటో తెలియరాలేదు. గురువారం పట్టణంలో పర్యటించిన మంత్రి నారాయణకూ అధికారులు కారణాలు చెప్పలేకపోయారని తెలుస్తోంది. కుళాయి నీరు కలుషితం అయిందని, నీటిని పరీక్ష కోసం విజయవాడకు పంపినట్లు అధికారులు చెబుతున్నారు.