Guntur

News March 13, 2025

తుళ్లూరు: మైక్రోసాఫ్ట్‌తో లోకేశ్ కీలక ఒప్పందం

image

రాష్ట్రంలోని యువతకు ఎఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్‌తో ఎపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో గురువారం మంత్రి లోకేశ్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏడాది వ్యవధిలో 2లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇస్తుందని లోకేశ్ తెలిపారు.

News March 13, 2025

GNT: టీడీపీ ఎమ్మెల్యేపై కేసు కొట్టివేత

image

గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఊరట దక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ఓబులాపురం మైనింగ్‌పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును గురువారం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు.

News March 13, 2025

గుంటూరులో ఫైనాన్స్ కంపెనీ భారీ మోసం

image

ఐదున్నర కిలోల బంగారం తాకట్టు పెడితే కేవలం వెయ్యి గ్రాములే అని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు పత్రాలు సృష్టించి ఓ వైద్యురాలిని మోసం చేశారు. పోలీసుల కథనం మేరకు.. ముత్యాలరెడ్డి నగర్‌కి చెందిన ఓ వైద్యురాలు అరండల్‌పేటలోని ఓ ప్రయివేట్ ఫైనాన్స్‌ కంపెనీలో ఐదున్నర కిలోల బంగారాన్ని తాకట్టు పెట్టారు. సంస్థలో పనిచేసే ఐదుగురు సిండికేట్‌గా ఏర్పడి నాలుగున్నర కేజీల బంగారాన్ని తప్పుడు పత్రాలతో కాజేశారు.

News March 13, 2025

గుంటూరు కమిషనర్ ఆదేశాలు

image

GMCకి ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదార్లు గృహాల, వ్యాపార సంస్థల ట్యాప్ కనెక్షన్‌లు తొలగించుట, ఆస్తులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం సీజ్ చేయాలన్నారు. బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆస్తి పన్ను వసూళ్ళ పై రెవిన్యూ విభాగం, విభాగాధిపతులతో సమీక్షా సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ.. గుంటూరులో 3 ఏళ్ల కు పైగా ఆస్తి పన్ను బకాయి ఉన్న వారి నివాసాలకు సీజు చేయమని ఆదేశించారు.

News March 12, 2025

గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

గుంటూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని కొత్తపేట పోలీసులు తెలిపారు. జీజీహెచ్ ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద వ్యక్తి చనిపోయాడని సెక్యూరిటీ గార్డు కొత్తపేట పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మార్చురీకి తరలించారు. ఈ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే పోలీసుల్ని సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 12, 2025

గుంటూరు జిల్లాకు ప్రత్యేక అధికారి

image

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు కె.కన్నబాబు గుంటూరుకు, వాకాటి కరుణను పల్నాడుకు, కృతిక శుక్లాను బాపట్ల జిల్లాకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 12, 2025

గుంటూరు మిర్చి ఘాటున్నా.. రేటు లేదు !

image

ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డులో మిర్చి ఘాటైతే ఎక్కువగా ఉంది కానీ రేటు మాత్రం లేదు. రైతులు ఆరుగాలం శ్రమించినా సరైన గిట్టుబాటుధర లభించక ఇబ్బందులు పడుతున్నారు. గత సీజన్‌లో రూ.25.వేలు పలికిన క్వింటా ఈ ఏడాది రూ.11వేలకు కూడా పలకనంటొంది. కేంద్రం రూ.11,781 చెల్లిస్తామని మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా చెప్పినప్పటికీ రైతులు ఏ మాత్రం సంతృప్తి చెందడం లేదు. రైతులు క్వింటాకి రూ.20వేలు ఆశిస్తున్నారు.

News March 12, 2025

గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ సూచనలు

image

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్చరించారు. సచివాలయాలకు వచ్చే ప్రజలను గౌరవించి మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, సచివాలయంలో ఇచ్చే అప్లికేషన్లో ఎటువంటి రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, గుర్తులు ఉన్నవి వాడటానికి వీలులేదని స్పష్టం చేశారు.

News March 11, 2025

సీఆర్డీఏ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు

image

వెలగపూడిలోని అసెంబ్లీలోని ఛాంబర్‌లో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు విషయాలపై మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పొంగూరు నారాయణ, కేశవ్ పయ్యావుల, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News March 11, 2025

GNT : లాడ్జిలో కిడ్నాప్, హత్యాయత్నం .. కారణమిదే.!

image

గుంటూరులోని లాడ్జిలో వ్యక్తిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు వివాహేతర సంబంధంమే కారణమని తెలుస్తోంది. మప్పాళ్లలోని చాగంటివారిపాలెం వాసి రామలింగేశ్వరరావు అదే ప్రాంత మహిళతో సంబంధం ఉంది. సోమవారం అతను మహిళతో లాడ్జిలో ఉండగా .. గమనించిన బంధువులు ఫాలో చేసి పట్టుకుని కొట్టి తీసుకెళ్లారు. లాలాపేట పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేశారు.