India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
GNT జిల్లా ట్రైనీ IPS అధికారి దీక్ష నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈమె వెస్ట్ ఢిల్లీకి చెందిన మహిళ. 2016లో UPSC రాసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో ఉద్యోగం సాధించి పీఎంఓలో పనిచేశారు. 2018లో UPSC CSCలో ఢిల్లీ పోలీసులో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. అక్కడితో ఆగకుండా 2020లో ఐపీఎస్ లో సెలెక్ట్ అయ్యి గుంటూరు జిల్లా పోస్టింగ్కు వచ్చారు. ఇటీవల మహిళా ఫిర్యాదుల విండో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గోగినేని భారతీదేవి గుంటూరు బాపట్ల తాలూకా మాచవరంలో 1908 ఆగస్టు 15న జన్మించింది. తండ్రి వెలగా సుబ్బయ్య. ఈమె స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని కారాగారవాసం అనుభవించింది. 1931లో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం సమయంలో తెనాలిలో 6నెలలు ఆందోళన చేసింది. సహాయ నిరాకరణోద్యమంలో పోరాడి రాయవెల్లూరు జైలులో ఏడాది ఉంది. జమీందారీ రైతుల ఆందోళనలో దెబ్బలు తింది. అనేక కులాంతర వివాహాలు నిర్వహించింది. 1958-64లో MLCగా పనిచేసింది.
వివాహం తర్వాత కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్నత చదువులు చదివి ఆదర్శంగా ఉండే వారు కొందరే ఉంటారు. అందులో మంగళగిరికి చెందిన తాయి లక్ష్మీ పద్మజ ఒకరు. వివాహ సమయానికి ఇంటర్ పూర్తి చేసిన ఆమె.. వివాహం తర్వాత హిందీ పండిత్, B.A, M.B.A, PGD HRM, L.L.B, PGD క్రిమినల్ జస్టిస్, PGD సైబర్ లా చదివారు. గత 12ఏళ్లుగా హైకోర్టులో లాయర్గా విధులు నిర్వహిస్తూ పలు ప్రభుత్వ శాఖలకి అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా పని చేశారు.
నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి. ఆమె 1959 ఏప్రిల్ 22న జన్మించారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం చెన్నైలోనే గడిచింది. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్తో పాటు ఫ్రెంచ్ భాషల్లో ఆమెకు ప్రావీణ్యం ఉంది. 2004లో బాపట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ గెలిచారు. 2006, 12లో కేంద్ర సహాయమంత్రిగా చేశారు. 2014లో బీజేపీలో చేరగా.. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులిగా ఉన్నారు.
గురిజాల రాధారాణి 29 జూన్ 1963లో తెనాలిలో జన్మించింది. ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా వర్సిటీలో లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అనంతరం ఎల్ఎల్ఎం, పీహెచ్డీ పూర్తి చేసింది. 1989లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించి హైదరాబాద్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికైంది. 2021 అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై పని చేస్తున్నారు.
పురుషులకంటే తానేమి తక్కువకాదంటూ నిరూపిస్తుంది ఉమ్మడి జిల్లాకి చెందిన ఫొటోగ్రాఫర్ హైమావతి. శ్రీనగర్ కాలనీకి చెందిన ఆమె 16 ఏళ్లుగా వృత్తిలో ఉన్నారు. భర్త చిరుద్యోగి కావడంతో ఆర్థిక పరిస్థితుల వల్ల ఆమె ఈ రంగాన్ని ఎంచుకున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా వెనుకంజ వేయకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి మరి సత్తాను చాటుకుంటున్నారు. 2012లో బాపట్లలో నిర్వహించిన పోటీల్లో హైమావతి 2వ బహుమతి సాధించారు.
తెనాలికి చెందిన బండ్ల శిరీష ఏపీ నుంచి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ఏకైక మహిళ. మురళీధర్, అనురాధ దంపతులకు 1987లో శిరీష జన్మించారు. 5 ఏళ్ల వయసులోనే అమెరికాకు వెళ్లి హ్యూస్టన్లో స్థిరపడ్డారు. 2021లో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష ప్రయాణంలో ఆమె పాల్గొన్నారు. దీంతో కల్పనా చావ్లా తర్వాత భారత్లో పుట్టి స్పేస్లో అడుగుపెట్టిన రెండో మహిళగానూ, ఏపీ నుంచి ఏకైక మహిళగా నిలిచారు.
మల్లాది సుబ్బమ్మ1924 ఆగస్టు 2న రేపల్లె తాలూకా పాతర్లంకలో జన్మించారు. ఉమ్మడి గుంటూరుకు చెందిన వెంకట రామమ్మూర్తిని వివాహం చేసుకున్నారు. మహిళల హక్కులు, వారి సంక్షేమం కోసం ఆమె అవిశ్రాంతంగా కృషిచేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధంపై ఉద్యమం చేశారు. ఉద్యమకారులకు పెద్దదిక్కుగా ఉండేవారు. ప్రఖ్యాతి గాంచిన పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా అనే పుస్తకం సహా 88 రచనలు చేశారు. 2003లో ఆత్మగౌరవ పురస్కారాన్ని అందుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి 04/3/25 మంగళవారం ముగియటంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పున ప్రారంభిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. 10/3/25 సోమవారం కలెక్టరేట్లో ఉదయం 10 గం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటన ద్వారా శుక్రవారం తెలియజేశారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించ వలసిందిగా కోరారు.
టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి సహకారం, కొత్త అవకాశాలను అన్వేషణకు ఏపీ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టాటా రెన్యువబుల్ ఎనర్జీ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.