Guntur

News July 6, 2024

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి: బాపట్ల కలెక్టర్

image

బాపట్ల జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో నూతన ఇసుక విధానంపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అక్రమంగా ఇసుక తరలించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

News July 6, 2024

తాడేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

తాడేపల్లి డీజీపీ ఆఫీసు సమీపంలో వడ్డేశ్వరం బైపాస్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీకొంది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతుడు ఆత్మహత్య చేసుకోవడానికే లారీ కింద పడ్డాడని పలువురు తెలిపారు. మరోవైపు లారీని ఎంత కంట్రోల్ చేసినా ఆగలేదని డ్రైవర్ చెప్పారు. పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు వడ్డేశ్వరం వాసిగా భావిస్తున్నారు.

News July 6, 2024

YS జగన్‌కు సవాల్ విసిరిన MLA జూలకంటి

image

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని ఆస్తులు దోపిడీ చేశాడో ఎంత గ్రానైట్‌ తరలించాడో చర్చిద్దామా అని MLA జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ CM జగన్‌కు సవాల్‌ విసిరారు. శుక్రవారం మాచర్లలోని TDP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ నెల్లూరు జైలులో పిన్నెల్లిని కలిసి, అనంతరం చేసిన ఆరోపణలపై స్పందించారు. పిన్నెల్లి అరాచకాలకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. అందుకే దమ్ముంటే తన సవాల్‌ని స్వీకరించాలని సూచించారు.

News July 6, 2024

గుంటూరు: ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు

image

ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఆగస్టు 5 నుంచి 12వ తేదీ వరకు మాచర్ల-విజయవాడ (07782), వచ్చే నెల 5 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ- గుంటూరు(07464), గుంటూరు-సికింద్రాబాద్ (17201), ఆగస్టు 4 నుంచి 10వ తేదీ వరకు నర్సాపూర్-గుంటూరు (07281), వచ్చే నెల 5 నుంచి 11వ తేదీ వరకు గుంటూరు- రేపల్లె (07784), రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News July 6, 2024

బాపట్ల: స్వగ్రామానికి చేరుకున్న జవాన్ భౌతికకాయం

image

బాపట్ల పట్టణం భావపురి కాలనీకి చెందిన షేక్ రజ్జుబాషా అనే ఆర్మీ ఉద్యోగి విధి నిర్వహణలో<<13561701>> ఈనెల 4న గుండెపోటుతో మృతి చెందాడు.<<>> శనివారం తెల్లవారుజామున బాపట్ల పట్టణంలోని భావపూరి కాలనీలోని స్వగృహానికి విర జవాన్ భౌతికయాన్ని తీసుకువచ్చారు. పట్టణానికి చెందిన పలువురు మాజీ సైనికులు, నాయకులు, అధికారులు అక్కడికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. అధికార లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

News July 6, 2024

పుష్పగుచ్ఛాలు వద్దు.. పుస్తకాలు తీసుకురండి: నారా లోకేశ్

image

తనను కలిసేందుకు వస్తున్న వారంతా పుష్పగుచ్ఛాలు, శాలువాలను తీసుకురావొద్దని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. వాటికి బదులుగా నోటుపుస్తకాలు, డిక్షనరీలు, లైబ్రరీ పుస్తకాలు ఇస్తే ఎంతో సంతోషిస్తానని తెలిపారు. తన దగ్గరకు వచ్చేవారు ఏమీ తేవద్దని.. తేవాలని భావిస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పనికొచ్చే పై వస్తువులను తీసుకురావాలని ఆయన కోరారు.

News July 6, 2024

గుంటూరు: అక్రమార్కులపై కలెక్టర్ చర్యలు

image

గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు సహా పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పంట రుణాల కుంభకోణంపై జిల్లా యంత్రాంగం స్పందించింది. అవినీతి, అక్రమాలు వాస్తవమేనని జిల్లా అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు బాధ్యులపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకున్నామన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి జిల్లా సహకార అధికారి వీరాచారిని ఆదేశించారు.

News July 6, 2024

గుంటూరు: ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు

image

ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఆగస్టు 5 నుంచి 12వ తేదీ వరకు మాచర్ల-విజయవాడ (07782), వచ్చే నెల 5 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ- గుంటూరు(07464), గుంటూరు-సికింద్రాబాద్ (17201), ఆగస్టు 4 నుంచి 10వ తేదీ వరకు నర్సాపూర్-గుంటూరు (07281), వచ్చే నెల 5 నుంచి 11వ తేదీ వరకు గుంటూరు- రేపల్లె (07784), రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News July 6, 2024

సీఎంల భేటీకి మంత్రి అనగాని సత్య ప్రసాద్

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు హాజరు కానున్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్ సమావేశానికి హాజరవుతున్నట్లు సమాచారం. వీరితో పాటు ఏపీ సీఎస్‌, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు భేటీకి వెళ్లనున్నారు. చర్చలకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు ఇప్పటికే 10 అంశాలను సిద్ధం చేసుకున్నాయి.

News July 5, 2024

జగన్‌పై లోకేశ్ మరోసారి విమర్శలు

image

మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేశ్ విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం తాజాగా.. సీఎంగా చంద్రబాబు తొలి పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారన్నారు. అదే విధంగా జగన్ తొలి పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా జైలుకు వెళ్లారంటూ వ్యంగ్యంగా పలు ఫొటోలతో ‘నాయకుడు- ప్రతినాయకుడు’ అని రాసి Xలో పోస్ట్ చేశారు.