Guntur

News March 14, 2026

గుంటూరు: రెవెన్యూ అధికారుల సస్పెండ్

image

భూమి మ్యుటేషన్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన తాడికొండ MRO పి.మెహర్ కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎన్. హనుమంతరావు, VROలు టి.బ్రహ్మయ్య, జి.రాంబాబును కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో లోపాలు బయటపడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 14, 2026

గుంటూరు: రెవెన్యూ అధికారుల సస్పెండ్

image

భూమి మ్యుటేషన్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన తాడికొండ MRO పి.మెహర్ కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎన్. హనుమంతరావు, VROలు టి.బ్రహ్మయ్య, జి.రాంబాబును కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో లోపాలు బయటపడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 13, 2026

గ్యాస్ బుక్ చేసే వారికి ఎస్పీ సూచనలు

image

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు SP వకుల్ జిందాల్ సూచించారు. వంటగ్యాస్ సిలెండర్ల కొరత ఉందనే అపోహలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మల్చుకొని ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. అదనపు సిలెండర్లు కేటాయిస్తామని బురిడీ కొట్టిస్తున్నారని వివరించారు. అనుమానస్పద లింకులు ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చెయ్యొద్దని సూచించారు.

News March 13, 2026

తెనాలిలో రన్నింగ్ బస్సు కిందకి దూసుకెళ్లిన టెన్త్ విద్యార్థి

image

తెనాలి మారీసుపేటలోని హైస్కూల్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి లీలాసాయి మణికంఠ ఒక్కసారిగా బస్సు కిందకి దూసుకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కొత్త వంతెన వద్ద డివైడర్‌పై నడిచి వెళుతున్న అతను అదే సమయంలో నగరం నుంచి తెనాలి వస్తున్న RTC బస్సు కిందకు దూసుకు వెళ్లాడు. డ్రైవర్ గమనించి బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. స్పృహ కోల్పోయిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 13, 2026

గుంటూరు: రేపు జాతీయ లోక్ అదాలత్

image

జాతీయ లోక్ అదాలత్‌ను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. 14న ఉదయం 10 గంటల నుంచి జిల్లా న్యాయస్థానం ఆవరణలో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, కాంపౌండబుల్, క్రిమినల్ కేసులు, కుటుంబ, వివాహ సమస్యలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు.

News March 13, 2026

GNT: గ్యాస్ వినియోగదారులకు హెల్ప్ లైన్ నెంబర్

image

గుంటూరు జిల్లాలో LPG కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. గ్యాస్ నిల్వలు తగ్గుతాయనే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ 8309160972, 6309520569 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవసరాలకు తగిన విధంగా సిలిండర్ల సరఫరా కొనసాగుతుందని తెలిపారు.

News March 13, 2026

ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు: గుంటూరు DEO

image

వేసవి తీవ్రత దృష్ట్యా ఈ నెల 16 నుంచి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఒంటి పూట నిర్వహించాలని DEOసలీం భాష సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 8 నుంచి 12.30ని.ల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలను మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని అన్నారు.

News March 13, 2026

అమరావతి అగ్నిప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం

image

అమరావతి ప్రాంతంలోని మందడం దగ్గర జరిగిన భారీ మంటల ఘటనపై CM చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సమావేశంలోని టీ సమయంలో ఉన్నతాధికారులతో ఈ అంశాన్ని చర్చించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పరిశీలించాలని సూచించారు. నిర్మాణ పనులకు ఉపయోగించే సామగ్రి నిల్వ ఉన్న ప్రదేశంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో జరిగిన నష్టం, పరిస్థితులపై పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు.

News March 13, 2026

గుంటూరు: ఈ నంబర్‌తో పోలీస్ సేవలు..!

image

గుంటూరు జిల్లా ప్రజలు మన మిత్ర – వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని సందేశం పంపితే FIR కాపీ, కేసు స్థితి, ఈ-చలానా వివరాలు వంటి పోలీస్ సేవలు మొబైల్‌లోనే పొందవచ్చన్నారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదులకు 1930, అత్యవసర పోలీస్ సహాయానికి 112 కు కాల్ చేయాలని సూచించారు.

News March 13, 2026

GMCలో అవినీతికి పాల్పడ్డ సెక్రటరీ సస్పెండ్

image

అవినీతికి పాల్పడిన గుంటూరు నగరపాలక సంస్థ సెక్రటరీ ఎ.పవన్ కుమార్ పై గురువారం సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేయాలని అధికారులను నగర కమిషనర్ కె. మయూర్ అశోక్‌ను కోరారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్ము (ఆస్తి పన్ను, LRS) సొంతానికి వాడుకోవడం, తక్కువ మొత్తానికి నకిలీ రశీదులు సృష్టించి ప్రభుత్వం, ప్రజలను మోసం చేయడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.