Guntur

News March 13, 2026

కలెక్టర్ల సదస్సులో గుంటూరు కలెక్టర్, ఎస్పీ

image

అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో CM చంద్రబాబు జిల్లాల కలెక్టర్, SPలకు కీలక సూచనలు చేశారు. ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైనది ఏదీ లేదని పేర్కొంటూ రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ పాటించాలని స్పష్టం చేశారు.

News March 12, 2026

GOOD NEWS గుంటూరు: రేపే నగదు జమ

image

అన్నదాత సుఖీభవ-PM కిసాన్ పథకం మూడో విడత నిధులు శుక్రవారం గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. జిల్లాలోని 1,06,329 మంది రైతులకు రూ.59.28 కోట్ల నిధులు ఖాతాల్లో జమ చేసేందుకు గురువారం అధికారులు చర్యలు తీసుకున్నారు. వీటిలో రూ.42.53 కోట్లు అన్నదాత సుఖీభవ కాగా, రూ.16.75 కోట్లు PM కిసాన్ నిధులుగా చెప్పారు. ఈ విడతలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,000ల చొప్పున జమ అవుతాయన్నారు.

News March 12, 2026

గుంటూరులో LPG సిలిండర్ల స్వాధీనం

image

విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం గుంటూరులో దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్న గృహ వినియోగ LPG సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వీట్ షాపులు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు చేసి మొత్తం 26 సిలిండర్లు సీజ్ చేశారు. ఈ ఘటనపై ఎస్సెంటీల కమోడిటీస్ యాక్ట్, 1955 సెక్షన్ 6-A కింద 6 కేసులు నమోదు చేసి సంబంధిత అధికారులకు నివేదిక అందించారు.

News March 12, 2026

‘జిల్లాలో శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి’

image

జిల్లాలో శనగల కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్‌లో గురువారం జేసీ అశుతోష్ శ్రీవాత్సవకు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం శనగ పంటకు క్వింటాకు రూ.5,875 ఉన్నా మార్కెట్లో రూ4,500 మాత్రమే ధర లభిస్తుందని జేసీకి వివరించారు. కొనుగోళ్ల కేంద్రాలను పెంచి సమస్యను పరిష్కరించాలన్నారు. వినతి ఇచ్చినవారిలో తిరుపతిరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

News March 12, 2026

అమరావతి: ‘నాణ్యతతో హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలి’

image

అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను AGICL ఎండీ SVR శ్రీనివాస్ గురువారం పర్యవేక్షించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) ఇన్‌ఫ్రా, హైకోర్టు సైట్‌లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. గుత్తేదారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు భవన సముదాయాన్ని లక్ష్యానికి అనుగుణంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

News March 12, 2026

అమరావతి: ‘నాణ్యతతో హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలి’

image

అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను AGICL ఎండీ SVR శ్రీనివాస్ గురువారం పర్యవేక్షించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) ఇన్‌ఫ్రా, హైకోర్టు సైట్‌లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. గుత్తేదారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు భవన సముదాయాన్ని లక్ష్యానికి అనుగుణంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

News March 12, 2026

గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు: జేసీ

image

గృహావసర ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆగుతుందనే సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. అవసరం లేకుండా రీఫిల్ బుకింగ్ చేయవద్దన్నారు. గుంటూరులో తనిఖీల్లో వ్యాపార సంస్థల్లో వాడుతున్న 66 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 14 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

News March 12, 2026

గుంటూరు: పోలీసుల స్పెషల్ డ్రైవ్.. 133 మంది కేసులు

image

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించిన ఈ డ్రైవ్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 133 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 58 ఎఫ్‌ఐఆర్‌లు, 60 పెట్టి కేసులు ఉన్నాయి. బహిరంగ మద్యపాన రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ ఈ సందర్భంగా కోరారు.

News March 12, 2026

గుంటూరులో విషాదం

image

గుంటూరు కాకుమానువారితోటకు చెందిన 9వ తరగతి విద్యార్థి రాఘవ (14) మామిడికాయలు కోస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. మృతుని తండ్రి రాము ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవ తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళి అరండల్ పేట 8/4 లో మామిడి కాయలు కోస్తుండగా బావిలో పడ్డాడు. ఈ క్రమంలో ఊపిరాడక రాఘవ మృతిచెందాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News March 11, 2026

వైసీపీ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధం

image

వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పార్టీ అధ్యక్షుడు YS జగన్మోహన్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ క్రమంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారని నాయకులు చెబుతున్నారు.