Guntur

News May 7, 2025

గుంటూరు: నిరాశపరిచిన CSK ఓపెనర్ రషీద్ 

image

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ బ్యాట్స్ మెన్, గుంటూరు మిర్చి షేక్.రషీద్ (0) నేటి మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. ఎంఏ చిదంబరం స్టేడియం (చెన్నై) వేదికగా శుక్రవారం CSK-SRH జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో ఓపెనర్ బరిలో దిగిన రషీద్ మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే క్యాచ్ ఇచ్చి ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో అభిమానులు తీవ్రనిరాశకు గురయ్యారు. 

News May 7, 2025

గుంటూరు: ప్రధాని మోదీ పర్యటనకు సుందర శోభ 

image

మే 2న ప్రధాని మోదీ అమరావతికి రానున్న నేపథ్యంలో, గన్నవరం విమానాశ్రయం నుంచి వీఐపీ మార్గాలపై ఆకర్షణీయంగా తబలా ఆకారంలో పూల కుండీలను అమరావతి అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసింది. ఏడీసీ ఛైర్‌పర్సన్ డి. లక్ష్మీపార్థసారథి ఆదేశాలతో గ్రీనరీ విభాగం అధికారుల నేతృత్వంలో ఈ పనులు పూర్తయ్యాయి. పూల కుండీలు మార్గాన్ని మరింత అందంగా మార్చుతూ, మోదీ పర్యటనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. 

News May 7, 2025

గుంటూరు: పదో తరగతి ఫలితాలపై పానుగంటి విమర్శలు 

image

పదో తరగతి ఫలితాలు దిగజారడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని వైసీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఓ ప్రకటనలో ఆరోపించారు. అమ్మ ఒడి రద్దు, ప్రభుత్వ పాఠశాలలపై నిర్లక్ష్యం, ఇంగ్లిష్ మీడియంపై కక్ష, ఉపాధ్యాయుల తొలగింపు వంటి నిర్ణయాలే ఫలితాలు తగ్గడానికి కారణమని ఆయన విమర్శించారు. జగన్ హయాంలో విద్యా సంస్కరణలు, అమ్మ ఒడి వంటి పథకాలతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. 

News May 7, 2025

గుంటూరు: కాపు అభ్యర్థులకు ఉచిత DSC శిక్షణ  

image

ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా DSC 2025 ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్‌ల కోసం కాపు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాల అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ అందించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 28గా ప్రకటించారు. ఆసక్తి కలిగిన వారు https://mdfc.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

News May 7, 2025

మంగళగిరి: స్వాతంత్య్రానికి ముందు ఉన్న స్కూల్‌కి ఏమవుతోంది.? 

image

భారతదేశానికి బ్రిటిషర్‌ల నుంచి స్వాతంత్య్రం రావడానికి ముందే 1944 మంగళగిరిలో చింతక్రింది కనకయ్య పేరుతో పాఠశాల ఏర్పాటు చేశారు. ఇది ఎయిడెడ్ స్కూల్ అయినప్పటికీ పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల పేర్లు ఒకప్పుడు ఇక్కడి నుంచే వినిపించేవి. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య, పాస్ పర్సంటేజ్ దారుణంగా పడిపోవడం ప్రజలలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ పాఠశాలను మళ్లీ ముందు వరుసలో నిలబెట్టాలని ప్రజల కోరిక.

News May 7, 2025

గుంటూరు: పదో తరగతి ఫలితాల్లో మెరుగుదల 

image

గుంటూరు జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో స్థిరమైన పురోగతి సాధిస్తోంది. కరోనా కాలమైన 2020, 2021ల్లో ప్రభుత్వం అందరినీ పాస్ చేసింది. 2022లో జిల్లాలో ఉత్తీర్ణత శాతం 68.20గా నమోదై రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. 2023లో అది 77.40కి పెరిగి 6వ స్థానంలో నిలువగా, 2024లో 88.14 శాతంతో 16వ స్థానానికి చేరింది. అయితే 2025లో మళ్లీ పరుగులు పెడుతూ 88.53 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. 

News May 7, 2025

గుంటూరు: నాలుగేళ్లలో 3,456 అగ్నిప్రమాదాలు  

image

గుంటూరు జిల్లాలో 2021 నుంచి ఫిబ్రవరి 2025 వరకు జరిగిన అగ్ని ప్రమాదాల్లో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. అగ్నిమాపక సిబ్బంది తెగువతో 72 మందిని కాపాడారు. 2019-25 మధ్య మొత్తం 3,456 ప్రమాదాలు నమోదు కాగా, రూ.212 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగింది. అదే సమయంలో రూ.276.22కోట్ల ఆస్తిని కాపాడగలిగారు. 2023-24లోనే అత్యధికంగా రూ.102.4కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. 

News May 7, 2025

సుప్రీం కోర్టులో బోరుగడ్డకు చుక్కెదురు 

image

గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌కు సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ అంశాన్ని హైకోర్టులోనే విచారించాలని స్పష్టం చేస్తూ బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. దీంతో బోరుగడ్డ అనిల్‌కు చట్టపరంగా భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 

News April 25, 2025

సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

సత్తెనపల్లి (M) రెంటపాళ్లలో గురువారం ప్రమాదం జరిగింది. ఘటనలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మృతుడు మహేశ్ ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పుట్టిన రోజు కావడంతో విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తుండగా DDపాలెం రోడ్డులో ఎదురుగా వచ్చిన పాల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో మహేశ్ స్పాట్‌లోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 25, 2025

GNT: ట్రిపుల్ ఐటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారని పొన్నూరు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 20వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థుల నుంచి రూ.300, రిజర్వు గ్రూపుల నుంచి రూ.200 చెల్లించాలన్నారు.