India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ నుంచి చెన్నై వెళ్లే నేషనల్ హైవే సమీపంలో బుడంపాడు వద్ద రైల్వే ట్రాక్పై రైలు కిందపడి ఓ మహిళ తన బిడ్డతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతురాలు లైట్ గ్రీన్ కలర్ టాప్, వంకాయ రంగు ప్యాంటు గల పంజాబీ డ్రెస్ ధరించి ఉందని, పాప సిమెంటు రంగు టీ షర్టు ధరించి ఉన్నదని గుంటూరు GRP సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కడప బిస్మిల్లా నగర్కు చెందిన షేక్ మొహమ్మద్ అనీష్ అన్సారీ ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లి గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని తెప్పించేందుకు సాయం చేయాలని SM ద్వారా ఓ వ్యక్తి మంత్రి లోకేశ్కు విన్నవించుకున్నారు. స్పందించిన లోకేశ్ ‘జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లిన అన్సారీ మృతి చెందటం అత్యంత బాధాకరం. వారిని స్వదేశానికి రప్పించేందుకు సాధ్యమైన ఏర్పాట్లు చేస్తాం. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి అని’ అన్నారు.
బ్రాడీపేటలో ఆత్మహత్యకు పాల్పడింది CA చివరి సంవత్సరం చదువుతున్న కె.నాగప్రసాద్ (27) గా అరండల్ పేట పోలీసులు నిర్ధారించారు. గూడూరు పట్టణానికి చెందిన నాగప్రసాద్ ఆదివారం హాస్టల్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. ఈ ఘటనతో విజ్ఞాన కేంద్రానికి చిరునామాగా ఉన్న బ్రాడీపేటలో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నాగప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
పిట్టలవానిపాలెం మండలం భావనారాయణపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.
మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం అలాగే జాతీయ పార్టీ కార్యాలయం వద్ద శనివారం డ్రోన్ కలకలం రేపిన సంగతి విధితమే. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులు క్యాంపు కార్యాలయం వద్ద విచారణ చేపట్టారు. డ్రోన్ ఎవరు ఎగరవేశారు, ఎటువైపు నుంచి డ్రోన్ వచ్చింది అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. పవన్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షల్లో 312 మంది ఉత్తీర్ణత సాధించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న పరీక్షల్లో శనివారం 529 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పలు దశల్లో కొందరు అనర్హులుగా మిగిలారు. దీంతో మొత్తం 434 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో చివరికి 312 మంది అర్హత పొందారు. అదనపు ఎస్పీలు జీవీ రమణ మూర్తి, ఎ. హనుమంతు పరీక్షలను పరిశీలించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసు అయిన మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం సమయంలో కార్యాలయంపై ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దాదాపు 20నిమిషాలు పాటు డ్రోన్ ఎగిరినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. దీంతో ఉలిక్కిపడిన సిబ్బంది వెంటనే డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.
రాజకీయాల్లోకి వచ్చిన 9నెలల్లో ప్రభంజనం సృష్టించి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో తల్లి భువనేశ్వరితో కలిసి లోకేశ్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు తలెత్తుకు తిరిగేలా చేశారని కొనియాడారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
గుంటూరు వెస్ట్, సౌత్ డీఎస్పీలు జయరామ్ ప్రసాద్, మల్లికార్జునరావును ప్రభుత్వం బదిలీ చేసింది. గతేడాది బోరుగడ్డ అనిల్ కుమార్ అరండల్పేట స్టేషన్లో ఉన్నప్పుడు దిండు, దుప్పట్లు ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను కలిసి రాచమర్యాదలు చేశారనే దానిపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇదిలా ఉంటే బదిలీతో ఖాళీ అయిన స్థానాలను భానోదయ, అరవింద్తో ప్రభుత్వం భర్తీ చేసింది.
గుంటూరు బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాది హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు విధించారు. లక్ష చొప్పున జరిమానా, బాధితురాలి పరిహారం కింద రూ.1,50,000 విధిస్తూ గుంటూరు 5వ అదనపు జడ్జి తీర్పు వెలువరించారు. గుంటూరు బ్రాడీపేటకు చెందిన న్యాయవాది రాచబత్తుని సీతా మహాలక్ష్మిని 2014లో సుబ్బారావు, శ్రీవాణి, మేరీజ్యోతి అనే ముగ్గురు కలిసి హత్య చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు.
Sorry, no posts matched your criteria.