India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాడికొండ నియోజకవర్గంలో మాజీ హోంమంత్రి సుచరిత, ప్రస్తుత ఇన్ఛార్జ్ డైమండ్ బాబు పోటాపోటీ పర్యటనలు చేస్తున్నారు. ఏడాదికి పైగా రాజకీయాలకు దూరంగా ఉన్న సుచరిత తాజాగా నియోజకవర్గంలో వరుస పర్యటనలతో తాడికొండ YCP రాజకీయం కాస్త ఆసక్తిగా మారి.. గ్రూపు రాజకీయాలు మరింత బలపడ్డాయి. క్షేత్రస్థాయి క్యాడర్ ఎటువైపు ఉండాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. చివరికి ఇద్దరూ కాకుండా వేరొక వ్యక్తి వస్తారనే టాక్ కూడా నడుస్తోంది.

ప్రేమ పేరుతో బాలికను వేధించిన కేసులో నిందితుడికి 2 ఏళ్ల జైలు, రూ. 2 వేల జరిమానా విధిస్తూ తెనాలి ఫోక్సో కోర్టు తీర్పునిచ్చింది. సుల్తానాబాద్లో 14 ఏళ్ల బాలికను 22 ఏళ్ల తమ్మిశెట్టి వినయ్ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయగా బాలిక తల్లి 2022 మే 2న త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం కేసు విచారించిన పోక్సో స్పెషల్ కోర్ట్ న్యాయమూర్తి సాక్షాదారాలను పరిశీలించి నిందితుడికి జైలు జరిమానా విధించారు.

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేకులు, స్వీట్ల విక్రయాలు భారీగా పెరిగాయి. బేకరీలు, స్వీట్ షాపులు రద్దీగా మారాయి. కేకులు, స్వీట్లు ధరలు సాధారణ రకం రూ. 200 నుంచి ప్రారంభమవుతుండగా, ప్రత్యేక డిజైన్ కేకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కుటుంబాలు, యువత కొత్త సంవత్సరాన్ని మధురంగా ఆహ్వానించేందుకు ముందస్తుగా ఆర్డర్లు ఇస్తుండటంతో వ్యాపారుల్లో ఉత్సాహం నెలకొంది.

జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంను నిర్దేశిత లక్ష్యాలకు మేరకు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆమె ఉల్లాస్ అక్షర ఆంధ్రపై వీసీ చేపట్టారు. మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సీఎంఎంలు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఏపీఓలు పాల్గొన్నారు.

గృహ నిర్మాణ లక్ష్యాలు మార్చి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. గృహ నిర్మాణంపై అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఆప్షన్ 3 గృహాలలో స్టేజ్ డివియేషన్ ఉన్నవాటిని గుర్తించి వాటిని సరిచేసి పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 5 లక్షల గృహాల నిర్మాణంలో గుంటూరు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో గృహాలు పూర్తిచేసి ఆదర్శంగా నిలవాలన్నారు.

రాజధాని ముఖద్వారంగా విరాజిల్లుతున్న మంగళగిరి న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబవుతోంది. మంగళగిరి హాయిలాండ్, తాడేపల్లిలోని విజయవాడ క్లబ్లో ఈవెంట్ ఆర్గనైజర్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ గాయనీగాయకులతో లైవ్ షోలు, మ్యూజికల్ నైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వేడుకల టికెట్లు ‘బుక్ మై షో’లో అందుబాటులో ఉండగా, వీటి ధర రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు ఉన్నాయి.

ఈ ఏడాది సైబర్ నేరాల నియంత్రణలో గుంటూరు పోలీసు గణనీయమైన పురోగతి సాధించింది. మొత్తం 102 సైబర్ కేసులు నమోదు కాగా, ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితులు నష్టపోయిన రూ.1,47,65,239ను సంబంధిత బ్యాంకులు, అధికారులతో సమన్వయం చేసి తిరిగి బాధితులకు అందించారు. గత ఏడాదితో పోలిస్తే కేసులు 10% తగ్గడం గమనార్హం. సత్వర చర్యలతో ప్రజలకు న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారన్నారు.

సారస్ (సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) మస్కట్ను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు నల్లపాడు రోడ్డులో సారస్ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు. గుంటూరు మిరపకు ప్రసిద్ధి చెందడంతో “మిరప కాయ” నే మస్కట్గా ఎంపిక చేసి రూపొందించారని తెలిపారు.

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై నియంత్రణకు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. 2025 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది 322 మంది మృతి చెందగా, 2024లో 429 మంది మరణించారు. దీంతో 25 శాతం మేర తగ్గుదల నమోదైంది. అలాగే ఈ సంవత్సరం 76 అత్యాచారం కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది తో పోలిస్తే 6% తగ్గాయి. ఈ కేసులలో ఎక్కువ శాతం ప్రేమ వ్యవహారంతో కూడినవిగా ఉన్నవి.

2025లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,090 చోరీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి సారించిన పోలీసులు పలు ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా రూ.11,88,55,702 విలువైన ఆస్థిని రికవరీ చేసినట్లు తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన 176 కేసుల్లోనూ రికవరీ పూర్తి చేసి బాధితులకు ఆస్తులు అప్పగించారు. నేరాల నియంత్రణలో పోలీసుల సమర్థత ప్రశంసనీయం.
Sorry, no posts matched your criteria.