India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరులో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.180, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ.160గా విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఈ ధరలు కొన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో చికెన్కి ఉన్న డిమాండ్ని బట్టి రూ. 20 నుంచి రూ. 30 వ్యత్యాసం ఉంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. దీని కోసం ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను మాత్రమే పూజించాలని ఆమె సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె విడుదల చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఖాజావలి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
☞ గుంటూరులో అబ్బురపరుస్తున్న 99 అడుగుల మట్టి గణపతి.
☞ వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: SP.
☞ హత్యకు గురైన ఈ తీర్పు మా బిడ్డకు ఘనమైన నివాళి.
☞ మొదటి ఐదు ర్యాంకుల్లో జిల్లా మంత్రులు.
☞ తెనాలి: నిందితుడిని పట్టించిన సీసీ కెమెరా.
☞ రాష్ట్ర స్థాయి పోటీలకు మందడం విద్యార్థి.
☞ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పెమ్మసాని.
దివ్యాంగులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు అందిస్తుందని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులు ఈ నెల 31 లోపు, ఇంటర్ ఆ పైన చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు www.depwd.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె వెల్లడించారు.
గవిని వెంకట కృష్ణరావు గుంటూరు జిల్లా కూచిపూడిలో 1914లో జన్మించారు. హేతువాది, ప్రముఖ రచయిత, దార్శనికులుగా, నవలా రచయితగా, కథా రచయితగా, వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా, సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా రాణించారు. ఆంధ్రప్రభలో సబ్ఎడిటర్గా, రాడికల్ డెమోక్రాట్, విహారి, దేశాభిమాని, విజయప్రభ పత్రికలలో ఎడిటర్గా పనిచేశారు. స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయంలో పీహెచ్డీ పొందారు. 1978 ఆగష్టు 23న మరణించారు.
ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి (1872 ఆగష్టు 23 – 1957 మే 20) గుంటూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరిలో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తిలో ఉండేది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా నదిపై ప్రకాశం బారేజి నిర్మాణం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన,2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రముఖమైనవి.
రెవెన్యూ, సర్వే, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సూచించారు. స్వామిత్వ రీ సర్వే పురోగతి పై శుక్రవారం జేసీ సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. డిప్యూటీ ఎంపీడీవోలు మండల స్థాయిలో మానిటరింగ్ చేస్తూ నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
☞ భార్యను రైలు కిందకు తోసేసిన భర్త
☞ గణేశ్ మండపాలు ఏర్పాటుకు అనుమతులు ఇలా తీసుకోండి: SP
☞ GNT: ప్రైవేట్ ఆసుపత్రులకు డీఎంహెచ్వో నోటీసులు
☞ గుంటూరు జిల్లాకు 5.85 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు
☞ తెనాలి: వృద్ధుని హత్య కేసులో నిందితుడి అరెస్ట్
☞ ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగులు కీలకం: RTC MD
☞ మంగళగిరి: భక్తులతో కిక్కిరిసిపోయిన మంగళగిరి క్షేత్రం
☞ తాడేపల్లిలో ఆటో డ్రైవర్ల ఆందోళన
కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న స్మార్ట్ రేషన్ కార్డులు అర్హులైన లబ్దిదారులకు అందించడానికి గుంటూరు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 5,85,615 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందబోతున్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రముని తెలిపారు.
గుంటూరు జిల్లాలో ఇటీవల వర్షాలకు పొలాలు చెరువులను తలపించాయి. జిల్లాలోనే 70 వేల ఎకరాల్లో వరి పైర్లు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. నాట్లు వేసేందుకు సమయం లేదని, అవకాశం ఉంటే మళ్లీ వెదపద్ధతిలో సాగు చేయాల్సి ఉంటుందని లేదా వేరే సాగు చేయాల్సి ఉంటుందని, ఇప్పటికే ఎకరాకు రూ.10 వేలు ఖర్చు చేశామని రైతులు వాపోతున్నారు. జిల్లాలో వర్షాల వల్ల సుమారు రూ.70 కోట్ల వరకు పంట నష్టం జరిగినట్లు ఒక అంచనా.
Sorry, no posts matched your criteria.