Guntur

News January 18, 2025

BREAKING: బస్సులు ఢీ.. గుంటూరు వాసులు మృతి

image

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు గుంటూరు నుంచి HYD వెళ్తుండగా SV కళాశాల సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో క్లినర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా.. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. గుండెపోటుతో ప్రయాణికుడు మృతిచెందాడు. మృతిచెందిన వారు గుంటూరు వాసులు సాయి, రసూల్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 18, 2025

అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు: కలెక్టర్ 

image

పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని గుంటూరు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఆదేశించారు. శుక్రవారం, కలెక్టరేట్ నుంచి ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి నెల 3శనివారం ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని కలెక్టర్ చెప్పారు.

News January 17, 2025

ఎస్ఐపై చర్యలు తీసుకుంటాం: GNT ఎస్పీ

image

పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాశ్ రావు, ఎస్ఐ రాజ్ కుమార్ మధ్య జరిగిన వాగ్వాదంపై విచారణ జరుగుతోందని, న్యాయవాదులు గుర్తించి తమ శాఖకు సహకరించాలని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. ఘటన జరిగిన రోజు నుంచే రాజ్ కుమార్‌ని వీఆర్‌కు పంపించి డీఎస్పీతో విచారణ చేయిస్తున్నామన్నారు. ఎంక్వైరీ ఆధారంగా ఎస్ఐపై చర్యలు తీసుకుంటామన్నారు.

News January 17, 2025

గుంటూరు: రోడ్డు ప్రమాదంలో మేనేజర్ మృతి

image

గేదెను తప్పించబోయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నాదెండ్ల మండలంలో గురువారం చోటు చేసుకుంది. SI పుల్లారావు వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన SBI క్రెడిట్ కార్డు మేనేజర్ రాజేశ్, నవీన్ అనే సాటి ఉద్యోగితో బైకుపై నరసరావుపేట వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో సాతులూరు వద్ద గేదెను తప్పించబోయి వెనక వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రాజేశ్‌కు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డాడు.

News January 17, 2025

గుంటూరులో MLA తమ్ముడు మృతి

image

గుంటూరులో గురువారం విషాదం చోటు చేసుకుంది. వెంకటగిరి MLA కురుగొండ్ల రామకృష్ణ సోదరుడు కురుగొండ్ల శేఖర్ కన్నుమూశారు. డక్కిలి మండలం కమ్మవారిపల్లికి చెందిన శేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కొద్ది కాలం క్రితం గుంటూరులో స్థిరపడ్డారు. ఈక్రమంలో నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సమాచారం అందుకున్న MLA వెంటనే గుంటూరుకు బయల్దేరారు.

News January 17, 2025

అధికారులకు గుంటూరు కలెక్టర్ ఆదేశాలు జారీ

image

స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను అధికారులు సమన్వయంతో చేపట్టాలని గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అధికారులకు సూచించారు. గురువారం కలక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ప్రాధమిక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై శకటాలు రూపొందించి పరేడ్‌లో ప్రదర్శించాలన్నారు.

News January 16, 2025

మహిళా పోలీసులు ఒక వారధి: జిల్లా ఎస్పీ 

image

క్షేత్ర స్థాయిలో ప్రజలకు, పోలీస్ శాఖకు మధ్య మహిళా పోలీసులు ఒక వారధి లాంటి వారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ అన్నారు. గురువారం గుంటూరు జిల్లాకు చెందిన గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు (మహిళా పోలీసులకు) దైనందిన విధులకు సంబంధించి జాబు చార్టు యాప్ ను ఎస్పీ ఆవిష్కరించారు. జాబు చార్టు యాప్‌తో జవాబుదారితనం ఏర్పడి సమర్ధవంతంగా విధులు నిర్వర్తించే అవకాశం ఏర్పడిందన్నారు.

News January 16, 2025

గుంటూరు: పీఎం ఇంటర్న్‌షిప్‌ పోస్టర్ల ఆవిష్కరణ

image

యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పీఎం ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం ప్రారంభించిందని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. కలెక్టరేట్లో ఈ పథకం సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావుతో కలిసి ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులన్నారు. https://mca.gov.in/login/లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News January 16, 2025

గుంటూరు: పలు పోస్టులకు నోటిఫికేషన్‌

image

గుంటూరు DCCBలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌, స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఇందుకు సంబంధించి వివరాలను అధికార సైట్లో ఉంచారు. గుంటూరు DCCBలో 31 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు, 50 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఈనెల 22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహించే అవకాశముంది. 

News January 16, 2025

గుంటూరు: అత్తగారింట్లో 200 రకాల పిండి వంటలతో విందు

image

గుంటూరుకు చెందిన త్రిపురమల్లు వైష్ణవ్‌‌కు మొగల్తూరుకి చెందిన విష్ణు ప్రియతో గత ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. సంక్రాంతి సందర్భంగా తొలి పండుగకు అల్లుడితో పాటు కుటుంబ సభ్యులను విష్ణు ప్రియ తల్లిదండ్రులు ఫణి, ఝాన్సీలు ఆహ్వానించారు. దీంతో వారు బుధవారం మెుగల్తూరులో కొత్త అల్లుడు వైష్ణవ్‌కు 200 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేసి మర్యాద చేశారు.