Guntur

News July 4, 2024

వెల్దుర్తి: టీడీపీ కార్యకర్త దారుణ హత్య

image

వెల్దుర్తి మండల పరిధిలోని మిట్టమీద‌పల్లె గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త హనిమిరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందినక కార్యకర్త గురువారం గ్రామ శివారులో చనిపోయి ఉండటం గమనించిన గ్రామస్థులు వెల్దుర్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హనిమిరెడ్డి మెడపై కొట్టి చంపినట్లు తెలుస్తోంది.

News July 4, 2024

అల్లూరి సీతారామరాజుకు పల్నాడు ఎస్పీ నివాళులు

image

పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలలో జిల్లా మలికా గర్గ్ పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు దేశానికి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రాఘవేంద్ర, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News July 4, 2024

దాచేపల్లి వద్ద స్కూల్ ప్రిన్సిపల్ మృతదేహం కలకలం

image

దాచేపల్లి పిడుగురాళ్ల హైవేపై వాసవి గ్రీన్ సిటీ‌లో స్థానిక ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థల ప్రిన్సిపల్ నాగిరెడ్డి మృతదేహంగా కనిపించడం గురువారం కలకలం రేపింది. ఈనెల ఒకటో తారీకు నుంచి నాగిరెడ్డి కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తించలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు నాగిరెడ్డిగా గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు. మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

News July 4, 2024

బాపట్ల: విధి నిర్వహణలో సైనికుడు గుండెపోటుతో మృతి

image

బాపట్ల పట్టణం భావపురి కాలనీకి చెందిన షేక్ రజ్జుబాషా అనే ఆర్మీ ఉద్యోగి విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందినట్లు, మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో వీధి నిర్వహణలో ఉన్న రజ్జుబాషా అకాల మరణం బాధాకరమన్నారు. నేటి సాయంత్రానికి ఆయన మృతదేహం స్వస్థలానికి చేరుకుంటుందని తెలిపారు. వారి కుటుంబానికి మాజీ సైనిక సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు.

News July 4, 2024

గుంటూరు: YCP నాయకుల గుండెల్లో రైళ్లు?

image

మంగళగిరి TDP రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో YCP నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను అరెస్టు చేయగా.. దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ YCP నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. 2021 అక్టోబర్ 19న TDP కార్యాలయంపై YCP నాయకులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై CC కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ప్రాథమికంగా నిందితుల జాబితా తయారు చేశారు.

News July 4, 2024

గుంటూరు: నేడు విద్యాసంస్థల బంద్‌కు SFI పిలుపు

image

గుంటూరు నగరంలోని విద్యాసంస్థలను గురువారం మూసివేయాలని బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ బుధవారం తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌లో భాగంగా.. ఈ బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ కోరుతూ.. ఈ బంద్‌ చేపట్టినట్లు SFI నాయకులు తెలిపారు.

News July 4, 2024

పల్నాడు జిల్లాలో క్షుద్రపూజల కలకలం

image

నరసరావుపేట మండలంలోని చిన్నతురకపాలెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి చెట్లకు ఇనుప మేకులు కొట్టి, రోడ్డు కూడలిలో నిమ్మకాయలు వేసి, పసుపు, కుంకుమ పెట్టి వెళ్తున్నారు. దాంతో ఇనుప మేకులు కొట్టిన చెట్లను గ్రామస్థులు నరికివేస్తున్నారు. కొత్త వ్యక్తులు గ్రామంలోకి రాకుండా రాత్రులు కాపలా కాస్తున్నారు. అయితే క్షుద్రపూజల భయంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

News July 4, 2024

గుంటూరు రైలు ఔరంగాబాద్ వరకు పొడిగింపు

image

గుంటూరు- సికింద్రాబాద్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు (17253)ను, ఈ నెల ఒకటి నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఔరంగాబాద్- గుంటూరు రైలు (17254) తిరుగు ప్రయాణంలో ఇదే మార్గంలో నడుస్తుందని వివరించారు.

News July 4, 2024

నరసరావుపేట: క్షుద్రపూజల కలకలం

image

మండలంలోని చిన్నతురకపాలెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి చెట్లకు ఇనుప మేకులు కొట్టి, రోడ్డు కూడలిలో నిమ్మకాయలు వేసి, పసుపు, కుంకుమ పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్తున్నారు. దాంతో ఇనుప మేకులు కొట్టిన చెట్లను గ్రామస్థులు నరికివేస్తున్నారు. కొత్త వ్యక్తులు గ్రామంలోకి రాకుండా రాత్రులు కాపలా కాస్తున్నారు. అయితే క్షుద్రపూజల భయంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

News July 4, 2024

నేడు మాజీ CM జగన్ నెల్లూరు పర్యటన వివరాలు.!

image

మాజీ సీఎం జగన్ నేడు నెల్లూరుకు వెళ్లనున్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ.11.15 గంటలకు కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కనుపర్తిపాడుకు చేరుకొని హెలికాప్టర్ ద్వారా తాడేపల్లికి బయలుదేరుతారు.