India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రమాదవశాత్తు డాబాపై నుంచి వ్యక్తి కిందపడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాగారితోటలో నివాసం ఉండే కొమ్మూరు పకీర్ బుధవారం వీధి కుక్కలు ఇంట్లోకి రావడంతో తరిమే క్రమంలో డాబాపై నుంచి జారిపడ్డాడు. అతణ్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడమే బోరుగడ్డ పనిగా పెట్టుకున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. అతణ్ని మరికొంతకాలం జైల్లోనే ఉండనీయండని ఆదేశించింది. అలాంటి వారిపై కనికరం చూపించడానికి వీల్లేదంటూ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. కాగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల కేసులో బోరుగడ్డ అరెస్టైన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం మార్చి2025 టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 10లోగా ఫీజు చెల్లించాలని పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. ఏపీ ఆన్లైన్లో గాని నేరుగా గాని చెల్లించాలన్నారు. ఆలస్యం అయితే ఈనెల 8వ తేదీలోపు రూ.25లు, 9వ తేదీలోపు రూ.50లు, 10వ తేదీలోపు తత్కాల్ రుసుంతో ఫీజు చెల్లించాలన్నారు .
గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో శుక్రవారం నుంచి మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్లో ఏర్పాట్లను గురువారం ఎస్పీ పరిశీలించారు. 3వ తేదీన 530 మంది అభ్యర్థులకు, 4వ తేదీన 535 మంది, 6న 536 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనునట్లు తెలిపారు. 7న పురుషులకు దేహదారుఢ్య పరీక్షలు పునః ప్రారంభిస్తామన్నారు.
పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో పరుగు పోటీలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన పోటీలలో 246 మంది అభ్యర్థులు హాజరవగా దేహదారుఢ్య, పరుగు పోటీలలో 166 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. పోటీల నిర్వహణ తీరును జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. ఏఎస్పీలు సుప్రజ, హనుమంతరావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే కరకట్టపై ఉన్న అక్రమ నివాసం సక్రమం అయిపోయిందా అని YCP తన ‘X’లో పోస్ట్ చేసింది. లింగమనేని రమేష్ నుంచి ఆ ఇంటిని అక్రమ మార్గాల్లో చంద్రబాబు తీసుకున్నారని.. కానీ అద్దె చెల్లిస్తున్నట్లు మొన్నటి వరకు ఆయన కుటుంబం బుకాయించిందని రాసుకొచ్చారు. కరకట్టపై ఆ ఇల్లు అక్రమ నిర్మాణమని గతంలో టీడీపీ నేత దేవినేని ఉమా ప్రకటించారని గుర్తు చేశారు.
నగరం ఆక్స్ ఫర్డ్ స్కూల్ సమీపంలో సుమారు 60 ఏళ్ల వయసుగల పురుషుడు మృతదేహం లభ్యమైంది. సైడు కాలువ మట్టిలో కూరుకుపోవడం వల్ల మృతదేహం పురుగులు పట్టి ఉంది. మృతదేహం ఎవరన్నది గుర్తించాల్సి ఉంది. 4రోజుల క్రితం ఎవరో వ్యక్తిని చంపి ఇక్కడ పాతి పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన దశలో ఉందని, ఇది హత్యా లేక మరేదైనా కోణమా అని విచారణ చేస్తున్నామని ఎస్ఐ భార్గవ్ తెలిపారు.
నగరం మండలం చిన్నమట్లపూడి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యకు అక్రమ సంబంధమే కారణమని తెలుస్తుంది. గ్రామానికి చెందిన ఒక మహిళతో నాగరాజు అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఆ కారణంంతోనే మహిళ భర్త నాగరాజును హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భర్త నాగరాజు హత్యకు సాంబయ్య కారణమంటూ నాగరాజు భార్య శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేపల్లె రూరల్ సీఐ సురేశ్ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాపట్ల జిల్లా నగరం మండలం చిన్నమట్లపూడిలో బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన లుక్క నాగరాజు (43)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నాగరాజు భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రేపల్లె గ్రామీణ సీఐ సురేశ్ బాబు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పెదకాకాని(M) నంబూరికి చెందిన మల్లిక హత్య కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మల్లిక ఓ వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. రెహమాన్తో వివాహేతర సంబంధం, మరొకరితో సహజీవనం చేసేది. దీంతో మల్లికను దక్కించుకోవాలనే ఉద్దేశంతో రెహమాన్ వశీకరణ చేయాలనుకున్నాడు. ఈ మేరకు డిల్లీకి చెందిన వ్యక్తితో రూ.3 లక్షలకు మాట్లాడుకొని దుస్తులు, జుట్టు, ఇతర వస్తువులు తెచ్చిచేశాడు. ఫలితం లేకపోవడంతో హత్య చేయించాడు.
Sorry, no posts matched your criteria.