Guntur

News June 28, 2024

పిన్నెల్లి అరెస్టుతో పల్నాడు ప్రశాంతంగా ఉంది: MLA భాష్యం

image

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుతో పల్నాడులో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని పెదకూరపాడు శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ చెప్పారు. శుక్రవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో దాడులు, దౌర్జన్యాలకు పల్నాడు జిల్లా కేరాఫ్‌గా మారిందన్నారు. చట్టం నుంచి నేరస్తులు తప్పించుకోలేరని పిన్నెల్లి విషయంలో రుజువైందన్నారు. 14 కేసులలో పిన్నెల్లి దోషిగా ఉన్నారన్నారు.

News June 28, 2024

హిందూపురం ఎంపీని కలిసిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే

image

హిందూపురం ఎంపీ బి.కే పార్థసారథిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం గుంటూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఆమె ఎంపీతో చర్చించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంపీ గల్లా మాధవికి సూచించారు. ఈ కార్యక్రమంలో గల్లా రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

News June 28, 2024

వైసీపీకి డాక్టర్ టీవీ రావు రాజీనామా

image

వ్యాపారవేత్త, దాక్షిణ్య సంస్థ వ్యవస్థాపకుడు, వైసీపీ నేత డాక్టర్ టీవీ రావు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ఏపీ స్టేట్ గ్రూప్ వన్ అధికారిగా పని చేసిన ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున 2004 గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆపై వైసీపీలో చేరి, తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.

News June 28, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాకు పొంచి ఉన్న తుపాను ముప్పు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాకు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది.

News June 28, 2024

పిన్నెల్లి అరెస్ట్.. సోదరుడి జాడపై చర్చ

image

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి నెల్లూరు జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా, అతని తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఎక్కడనే అంశంపై పల్నాడులో చర్చ జరుగుతోంది. మాచర్ల రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వెంకట్రామిరెడ్డి మే 22 నుంచి పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడితో పాటు పిన్నెల్లి అనుచరుడు కిశోర్ జాడ కూడా కొద్ది రోజులుగా తెలియలేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

News June 28, 2024

ప్రత్తిపాడు: సమాచార హక్కు కార్యకర్తపై కత్తులతో దాడి

image

ఇళ్ల కూల్చివేత విషయంలో సమాచార హక్కు కార్యకర్త, టీడీపీకి చెందిన కమ్మ శివప్రసాద్‌పై ఇద్దరు కలిసి కత్తులతో దాడి చేసిన ఘటన ప్రత్తిపాడులో గురువారం చోటుచేసుకుంది. తాగునీటి చెరువు ఆక్రమణకు గురైందంటూ పదేళ్ల క్రితం శివప్రసాద్ గొట్టిపాడుకు చెందిన ఓ వ్యక్తిపై లోకయుక్తలో ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలోని ఇళ్ల కూల్చివేతకు ఆదేశాలు రావడంతో దీనికి కారణం శివప్రసాద్ అంటూ కత్తులతో దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 28, 2024

ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష

image

మహిళ ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించిందని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అప్పు విషయంలో మహిళతో దుర్భాషలాడి ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన శివ నాగమణి, శ్రీనివాసరెడ్డిలకు కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.8వేల జరిమానా విధించిందని తెలిపారు. 

News June 28, 2024

పింఛన్ దారులు ఇంటి వద్ద అందుబాటులో ఉండండి: కీర్తి చేకూరి

image

జులై 1వ తేదీన నగరంలో ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించనున్నట్లు జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. జులై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి వార్డు సచివాలయాల వారిగా పింఛన్లు పంపిణీ జరుగుతుందన్నారు. పింఛనుదారులు తమ ఇంటి వద్దకు పింఛను అందించడానికి వచ్చే సచివాలయ కార్యదర్శులకు అందుబాటులో ఉండి సహకరించాలని కమిషనర్ కోరారు.

News June 28, 2024

జులై 1న పెన్షన్‌ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ నాగలక్ష్మి

image

జులై 1న పెన్షనర్ల ఇంటి వద్దే సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ తెలిపారు. గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి పింఛన్ల పంపిణీపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెంచిన పెన్షన్, 3 నెలల ఎరియర్స్‌తో కలిపి పంపిణీ చేయాలని చెప్పారు. జిల్లాలో పెన్షన్‌ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు.

News June 27, 2024

గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

నగరంలో లాలాపేట పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈనెల 16న పల్నాడు బస్టాండ్ కెనరా బ్యాంక్ పక్కన సుమారు (40) సంవత్సరాల వయసు కలిగిన మగ వ్యక్తి పడిపోయి ఉండగా 108లో గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ.. మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసినవారు స్టేషన్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.