Guntur

News June 20, 2024

గుంటూరు: కౌలు ఒప్పందాన్ని పొడిగించాలంటున్న రైతులు

image

రాజధాని అమరావతిలో రైతులతో ప్రభుత్వం చేసుకున్న కౌలు ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని రైతులు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో సీఎం ఈ అంశంపై హామీ ఇచ్చే అవకాశం ఉందని రైతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

News June 20, 2024

సత్తెనపల్లి: బావిలో యువకుడి మృతదేహం

image

సత్తెనపల్లి మండల పరిధి కట్టమూరులోని దీపాలదిన్నెపాలెం రహదారి పక్కన ఓ వ్యవసాయ బావిలో దాసరి ఏసుబాబు(22) మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. విషయాన్ని వారు పోలీసులకు తెలిపారు. భట్లూరుకు చెందిన యువకుడు కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో బావిలో పడి చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

News June 20, 2024

గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన బాపట్ల SP

image

బాపట్ల పర్యటనకు విచ్చేసిన ఆంధ్రరాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో జరిగిన స్నాతకోత్సవ వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

News June 19, 2024

నరసరావుపేట సైబర్ నేరాలు.. లోన్ యాప్‌లపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

image

శాంతిభద్రతల స్థాపనలో సచివాలయ, మహిళా పోలీసులు భాగస్వామ్యులు కావాలని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పేర్కొన్నారు. మహిళా పోలీసులు వారి విధులు గురించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గర కావాలని సూచించారు. సైబర్ నేరాలు లోన్ యాప్‌లపై అవగాహన పెరగాలన్నారు. రౌడీషీటర్లపై అవగాహన కలిగి ఉండి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News June 19, 2024

మాజీ కలెక్టర్ శివశంకర్‌ని కలిసిన MLA చదలవాడ

image

పల్నాడు జిల్లా మాజీ కలెక్టర్ శివశంకర్ లోతేటిని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు బుధవారం కలెక్టర్ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు చేసిన కృషి అభినందనీయం అన్నారు. నియోజకవర్గాన్ని దేశంలోనే అభివృద్ధికి మోడల్‌గా నిలపాలని అనుకుంటున్నట్లు, ఐఏఎస్ అధికారి తగు సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.

News June 19, 2024

మాచర్లలో 28న ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్

image

మాచర్లలోని బంగ్లా గ్రౌండ్‌లో ఈనెల 28న ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఫస్ట్‌ప్రైజ్ రూ.1,33,318, సెకండ్ ప్రైజ్ రూ.93,318, మూడో ప్రైజ్ రూ.63,318గా ఉంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రూ.10వేలు, బెస్ట్ బ్యాట్స్‌మెన్, బెస్ట్‌ బౌలర్, ప్రతి మ్యాచ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News June 19, 2024

వినుకొండలో వృద్ధ మహిళ దారుణ హత్య

image

వినుకొండలోని కొత్తపేట గీతాంజలి స్కూల్ ఎదురు బజారులో వృద్ధ మహిళను గుర్తు తెలియని యువకుడు బుధవారం హత్య చేశాడు. సమాచారం అందుకున్న సీఐ సాంబశివరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై దొంగతనానికి వచ్చి, ఒక యువకుడు ఇంట్లోకి వెళ్లి మహిళ మెడలోని బంగారు ఆభరణాలు దొంగలించేందుకు ప్రయత్నించగా.. వృద్ద మహిళ పెనుగులాడటంతో హత్యచేసి పరారైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 19, 2024

తాడికొండ MLA పేరుతో నకిలీ FB అకౌంట్

image

తాడికొండ MLA తెనాలి శ్రావణ్ కుమార్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ తయారయింది. ఈ మేరకు శ్రావణ్ కుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు “Tenali Srawan Kumar” అనే పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించారని చెప్పారు. ఆ అకౌంట్ నుంచి మెసేజ్ చేసి డబ్బులు అడుగుతున్నారని, ఎవరూ స్పందించవద్దని అన్నారు. ఇలాంటివి గమనిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

News June 19, 2024

గుంటూరు: విద్యుత్ షాక్‌కి గురై మహిళ మృతి

image

విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందిన ఘటనపై అరండల్ పేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమీనగర్‌లో నివాసం ఉండే లూర్దు మేరి(47) నీటి మోటారుకు పైపు అమరుస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. గమనించి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 19, 2024

బాపట్లకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం బాపట్లలో పర్యటించారు. పట్టణంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల స్నాతకోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కళాశాల వద్ద ఆయనకు పోలీస్ అధికారులు, ఎన్సీసీ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.