Guntur

News June 18, 2024

నకరికల్లు: ఇద్దరు బాలికలపై వృద్ధుడి లైంగిక దాడి

image

8, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన నకరికల్లు మండలంలో సోమవారం వెలుగుచూసింది. నకరికల్లుకు చెందిన నాగమల్లేశ్వరరావు(62) ఇద్దరు బాలికలకు మాయ మాటలు చెప్పి, 6 నెలలుగా లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఓ బాలిక కడుపు నొప్పితో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. తల్లిదండ్రులు నకరికల్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 18, 2024

గుంటూరు: ఈనెల 22న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

image

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 22న శనివారం ఉదయం 10.30కి జగన్ క్యాంప్ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా ఆహ్వానించారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

News June 17, 2024

వట్టిచెరుకూరు: పొక్లెయిన్ ఆపరేటర్ ఆత్మహత్య

image

వట్టిచెరుకూరు మండలం తాళ్లపాడు గ్రామానికి చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ శివన్నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం మేరకు.. ఆవిరేణి కుంట తాండ గ్రామ సమీపంలో పొక్లెయిన్ విధులు నిర్వహిస్తున్న శివ నారాయణ కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆ వాహనానికే ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

News June 17, 2024

రేపు గుంటూరు జిల్లాకు వర్ష సూచన

image

గుంటూరు జిల్లాలో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉంది. జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. మరోవైపు, పొరుగున ఉన్న కృష్ణా జిల్లాలోనూ వర్షాలు పడతాయని APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News June 17, 2024

లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

image

టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావుతో పలు రాజకీయం అంశాలపై చర్చించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలని లోకేశ్ సూచించారు. యువతతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయన్నారు.

News June 17, 2024

రాజుపాలెం: నడిరోడ్డుపై లారీలో మంటలు

image

లోడ్‌తో వెళ్తున్న లారీలో మంటలు వ్యాపించిన ఘటన రాజుపాలెం సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. రాజుపాలెం- బెల్లంకొండ రహదారిపై ఒక్కసారిగా లారీకి మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవరు వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపారు. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News June 17, 2024

బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

image

ఐపీఎస్ అధికారి బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఘర్షణ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్న బిందుమాధవ్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

News June 17, 2024

బాపట్ల: ఆ రోడ్డులో రెండున్నరేళ్లలో 15 మంది మృతి

image

రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాత వంతెనలు, అధ్వాన రహదారులు, మలుపులు, అతివేగం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చందోలు, యాజలి, బుద్దాం, కర్లపాలెం వద్దగత రెండున్నరేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 15 మంది మృతి చెందారు. బాపట్ల మండలంలో వెదుళ్లపల్లి-పర్చూరు రహదారిలో పేరలి వంతెన రక్షణ గోడలు పూర్తిగా కూలగా.. 2022 నవంబర్‌లో ఈ మలుపు వద్ద ఐదుగురు అయ్యప్ప దీక్షదారులు మృత్యువాతపడ్డారు.

News June 17, 2024

ఉద్యోగాల పేరుతో సైబర్‌ మోసాలు: బాపట్ల SP

image

ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని బాపట్ల ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కొత్త తరహా సైబర్‌ మోసాలతో తక్కువ సమయంలో నగదు సంపాదించాలని నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. పార్ట్‌టైం ఉద్యోగాల పేరిట టెలిగ్రామ్‌‌లో లింక్ పంపి క్లిక్‌ చేయగానే రూ.లక్షల్లో నగదు వసూలు చేస్తున్నారన్నారు. హెల్ప్‌లైన్‌ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

News June 17, 2024

పల్నాడు: రైతు భరోసా కేంద్రంలో చోరీ

image

ఈపూరు మండలంలోని కొండ్రముట్ల రైతు భరోసా కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి  రైతు భరోసా కేంద్రం తాళాలు పగులగొట్టి, కంప్యూటర్, టీవీలను చోరీ చేశారు. ఆదివారం ఉదయం అటువైపు వెళుతున్న రైతు ఒకరు రైతు భరోసా కేంద్రం తెరిచి ఉండటం చూసి వ్యవసాయశాఖ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వ్యవసాయశాఖ ఏవో రామినేని రామారావు తెలిపారు.