Guntur

News June 14, 2024

గత అనుభవంతో సమర్థవంతంగా పని చేస్తా: నారా లోకేశ్

image

గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్థవంతంగా పని చేస్తానని నారా లోకేశ్ తెలిపారు. హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

News June 14, 2024

అమరావతిలో పరుగుల పెట్టనున్న ఐటీ రంగం

image

నారా లోకేశ్ మరోసారి ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. చంద్రబాబు మానసపుత్రికైన అమరావతిలో ఐటీ రంగానికి పెద్దపీట వేయనున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కంపెనీలు తీసుకొచ్చి, ఐటీ రంగాన్ని లోకేశ్ పరుగులు పెట్టిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఐటీ మంత్రిగా చేసిన అనుభవం లోకేశ్‌కు పని కొస్తుందని వివరిస్తున్నారు.

News June 14, 2024

గుంటూరు జిల్లాకు కీలక శాఖలు..

image

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లాకు జలవనరులశాఖ(అంబటి రాంబాబు), వైద్యారోగ్య శాఖ(విడదల రజిని)లు దక్కాయి. మంత్రులుగా చేసిన విషయం తెలిసిందే. తాజా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండగా.. ఐటీ, మానవ వనరుల శాఖ(లోకేశ్).. ఆహార, పౌర సరఫరాల శాఖ(ఎన్.మనోహర్).. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్(అనగాని సత్యప్రసాద్) శాఖలు దక్కాయి.

News June 14, 2024

నారా లోకేశ్‌కు ఐటీ శాఖ

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. దీంతో రెండ్రోజుల ఉత్కంఠకు తెరపడింది. జిల్లాకు సంబంధించి మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన నారా లోకేశ్‌కు ఐటీ, మానవ వనరుల శాఖ.. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ.. అనగాని సత్యప్రసాద్‌కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

News June 14, 2024

గుంటూరు: అప్పుల బాధలు తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధలు కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చిర్రావూరు గ్రామానికి చెందిన ప్రకాశ్ రావు (54) అప్పుల బాధలు గురువారం సాయంత్రం గడ్డి మందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి మరణించారు. అనంతరం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 14, 2024

పొన్నూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యాపారి మృతిచెందిన సంఘటన జీబీసీ రహదారిలో గురువారం రాత్రి జరిగింది. పొన్నూరు పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలో 28వ వార్డుకు చెందిన ఆదినారాయణ (70)పచారీ దుకాణం నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. జీబీసీ రహదారిలో టీ తాగేందుకు వెళ్లి తిరిగి దుకాణం వద్దకు వస్తున్న సమయంలో గుంటూరు నుంచి బాపట్ల వెళ్తున్న ఓ లారీ అయన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

News June 14, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1080 డీఎస్సీ పోస్టులు

image

మెగా డీఎస్సీ పేరుతో నూతన సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేస్తానని చేసిన వాగ్దానం మేరకు గురువారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో రాష్ట్రం మొత్తం 16,347 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీలను అధికారికంగా ప్రకటించకపోయినా విశ్వసనీయ సమాచారం మేరకు ఉమ్మడి జిల్లాలో దాదాపు 1080 ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

News June 14, 2024

గుంటూరులో మహిళ మృతదేహం లభ్యం

image

చేబ్రోలు మండలంలోని వడ్లమూడి నక్కల గుంత సమీపంలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎస్సై మహేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నక్కలగుంత సమీపంలో మహిళ మృతదేహం ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహం గుర్తించలేని విధంగా ఉంది. కాషాయం రంగు ఆకులు ఉన్న తెల్ల చీర, ఆరెంజ్ రంగు జాకెట్టు ధరించి ఉందన్నారు. హత్యా? లేదా ఆత్మహత్యా? అనే కోణంలో విచారిస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

News June 14, 2024

గుంటూరు: జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా

image

గుజ్జనగుండ్ల సర్కిల్లో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రఘు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, నర్సింగ్ విద్యార్హతలు గల 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయోడేటా, రెజ్యూమ్‌లతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావాలని సూచించారు.  

News June 14, 2024

గుంటూరు: ఉరి వేసుకొని జేసీబీ ఆపరేటర్ ఆత్మహత్య

image

మేడికొండూరులో జేసీబీ ఆపరేటర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై వాసు తెలిపిన వివరాలు ప్రకారం.. కాకినాడకు చెందిన వెంకన్న(48) పేరేచర్లలో జేసీబీ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. గురువారం ఆయన నివసిస్తున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగా వెంకన్న ఉరి వేసుకున్నట్లు కనిపించిందని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై చెప్పారు.