Guntur

News April 3, 2025

గుంటూరు జిల్లాలో 1.20 లక్షల నిరుపేదలు

image

జిల్లాలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన పి-4 సర్వే ప్రకారం 1.20లక్షల మంది నిరుపేదలున్నట్టు గుర్తించారు. సర్వే పూర్తైన అనంతరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. గత నెల 8నుంచి ఈ సర్వేను ప్రారంభించి, ఇంటింటికీ వెళ్లి అత్యంత నిరుపేదలుగా ఉన్న 20శాతం మందిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఈసర్వే గుంటూరు వెస్ట్, ఈస్ట్, మంగళగిరి, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి, తాడికొండ నియోజకవర్గాల్లో చేశారు.

News April 3, 2025

అంబటి ఫిర్యాదు నమోదు చేయండి: హైకోర్టు

image

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు వెంటనే నమోదు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తనతో పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తూ, సామాజిక మాధ్యమాలలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు అంబటి ఫిర్యాదు చేశారు. మొత్తం ఐదు ఫిర్యాదులు ఇవ్వగా నాలుగు మాత్రమే నమోదు చేయడంతో హైకోర్టును ఆయన ఆశ్రయించారు.

News April 3, 2025

ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుమార్తె ఫోన్ హ్యాక్

image

ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుమార్తె ప్రత్తిపాటి స్వాతి ఫోను బుధవారం హ్యాక్ అయ్యింది. ఈ మేరకు డబ్బులు కావాలంటూ చిలకలూరిపేటలోని పలువురు ప్రముఖులకు వాట్సప్ సందేశాలను సైబర్ నేరగాళ్లు పంపించారన్నారు. నేరగాళ్లు ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే స్పందించవద్దని టీడీపీ సోషల్ మీడియా గ్రూపులలో సిబ్బంది మెసేజ్‌ పెట్టింది.

News April 3, 2025

ఉదయం 8 తర్వాత హెవీ వెహికల్స్‌కు ప్రవేశం లేదు: ట్రాఫిక్ డీఎస్పీ

image

ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు హెవీ వెహికల్స్ గుంటూరులోకి ప్రవేశించడానికి అనుమతి లేదని ట్రాఫిక్ డీఎస్పీ రమేశ్ స్పష్టం చేశారు. బుధవారం డీఎస్పీ తన కార్యాలయంలో నగరంలోని హెవీ వెహికల్స్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాత్రి 10:00 నుంచి ఉదయం 8 గంటల లోపు మాత్రమే హెవీ వెహికల్స్ నగరంలోకి ప్రవేశం ఉందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సీఐ సింగయ్య పాల్గొన్నారు.

News April 3, 2025

వసతీ గృహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, వసతీ గృహాల్లో బాల, బాలికలు, మహిళల పై నేరాల నియంత్రణ కోసం ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని డీఆర్సీ మీటింగ్ హాలులో బుధవారం ఎస్పీ సతీశ్ కుమార్‌తో కలిసి నేరాల నియంత్రణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వసతీ గృహాల స్వాగత ద్వారంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News April 2, 2025

బస్సుల అనుమతులకు రిమార్కులు అందించండి- కలెక్టర్

image

రవాణా శాఖ అధికారులతో గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గుంటూరులో ప్రైవేటు సిటీ బస్సుల రూట్ల అనుమతులకు సంబంధించి సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్, ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. సిటీ బస్సుల అనుమతులకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ఏప్రిల్ 9 నాటికి రిమార్కులు అందించాలని ఆదేశించారు. అనంతరం అనుమతుల మంజూరుకు ఆర్‌టీ‌ఏ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు.

News April 2, 2025

తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక సమావేశం

image

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశానికి వివిధ జిల్లాల నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన వారిని అభినందించిన జగన్, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రజల్లో కొనసాగాలని నేతలకు సూచించారు.

News April 2, 2025

వెలగపూడిలో తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం సమీక్ష

image

తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం నారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హాజరయ్యారు. సమావేశంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆలయ భద్రత, దర్శన వ్యవస్థలో మార్పులు, భక్తుల వసతి ఏర్పాట్లు వంటి అంశాలపై సీఎం చర్చించారు.

News April 2, 2025

GNT: ఉద్యోగాల జాబితా విడుదల

image

గుంటూరు DMHO కార్యాలయం పరిధిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి తుది మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు DMHO విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. DEO, LGS, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల ఫైనల్ మెరిట్ లిస్టును guntur.ap.gov.in లో అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. ROR ప్రకారం లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు.

News April 2, 2025

GNT: రేపటి నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం

image

గుంటూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలు ముగియటంతో పట్టణంలోని స్టాల్ గర్ల్స్ హైస్కూల్లో జవాబు పత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు చేపట్టారు. ఏప్రిల్ 3 ప్రారంభించి 9వ తేదీలోగా మూల్యాంకనం పూర్తి చేయనున్నారు. జిల్లా 1.80 లక్షల జవాబు పత్రాలు వచ్చాయి. మూల్యాంకనం కోసం అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్స్ వంటి వివిధ రకాల విధుల కోసం 643మంది ఉపాధ్యాయులను నియమించినట్లు DEO రేణుక తెలిపారు.