Guntur

News December 8, 2024

జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ సేవలు: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. 

News December 8, 2024

LLB ప్రవేశాలకు 9న స్పాట్ అడ్మిషన్లు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విభాగానికి సంబంధించి ఈ నెల 9న సోమవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. వివరాలను యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ పి.బ్రహ్మజీరావు తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన వారు నేరుగా అడ్మిషన్ కార్యాలయానికి వచ్చి ప్రవేశాలు పొందవచ్చు అన్నారు. లా సెట్ రాయని వారికి కూడా ఈ ప్రవేశాల్లో అర్హులన్నారు.

News December 8, 2024

గుంటూరు: నర్సింగ్ విద్యార్థినులకు జర్మనీలో ఉద్యోగాలు

image

నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. G.N.M, B.S.C నర్సింగ్ విద్యార్హత కలిగిన 35 ఏళ్ల లోపు వారు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో శిక్షణ అనంతరం జర్మనీలో ఉద్యోగం కల్పిస్తున్నట్లు తెలిపారు. https://forms.gle/K3He7nxcKE5HTacu8 లింకులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనివివరించారు

News December 8, 2024

తాడేపల్లి: మద్యం మత్తులో తన ఇంటినే తగలబెట్టుకున్న వ్యక్తి

image

మద్యం మత్తులో ఓ వ్యక్తి తన ఇంటినే తగులబెట్టుకున్న ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నులకపేట రామయ్య కాలనీకి చెందిన బడేబాబు తన భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం భార్యా పిల్లల్ని బయటకు నెట్టేసి తన ఇంటికి నిప్పు పెట్టుకున్నాడు. స్థానికులు బడేబాబును బలవంతంగా బయటకు తెచ్చి ప్రాణాలు కాపాడారు. కాగా ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతయింది.

News December 8, 2024

యాక్సిడెంట్.. ఇద్దరు మిత్రులు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని షేట్‌బషీరాబాద్‌లో జరిగింది. పల్నాడు జిల్లా రాజులపాలెం గ్రామానికి చెందిన అనీల్(25), HYDలో ఉంటున్న కార్తీక్ రెడ్డి(26) స్నేహితులు. అయ్యప్ప మాలలో ఉన్న వీరు శుక్రవారం శబరిమల వెళ్లి తిరిగొచ్చారు. అదే రోజు రాత్రి బైక్‌పై వస్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. కార్తీక్ అక్కడికక్కడే చనిపోగా అనీల్ ఆస్పత్రిలో మృతి చెందాడు.

News December 7, 2024

అమరావతిలో నిర్మాణాల పునః ప్రారంభంపై ప్రభుత్వం కీలక నిర్ణయం 

image

అమరావతి ప్రాంతంలో పనుల పునః ప్రారంభంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి బిల్డింగ్ యాక్టివిటీని ప్రారంభించననుంది. ఎంపిక చేసిన పలు కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు వివిధ ప్రాజెక్టు పనులు అప్పజెప్పనున్నట్లు తెలుస్తోంది. కాగా కూటమి అధికారంలోకి రాగానే అమరావతిలో పర్యటించడంతో పాటు.. భవనాల పటిష్ఠతపై నిపుణులు క్షేత్రస్థాయిలో పర్యటించిన విషయం తెలిసిందే. 

News December 7, 2024

సాయుధ దళాల పతాక దినోత్సవంలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

image

సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా మనం అందించే సహాయం దేశ రక్షణలో అశువులు బాసిన వీర జవాన్ల కుటుంబ సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ నాగలక్ష్మీ పేర్కొన్నారు. శనివారం కలక్టరేట్‌లో ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించిన సాయుధ దళాల పతాక దినోత్సవ విరాళాల కార్యక్రమాన్ని కలెక్టర్ మొదటి విరాళాన్ని ఇచ్చి ప్రారంభించారు. డీఆర్ఓ షేక్ ఖాజావలి, ఆర్డీఓ కే. శ్రీనివాస రావు కూడా విరాళాలు అందించారు. 

News December 7, 2024

గుంటూరులో థాయ్‌లాండ్ అమ్మాయిలతో వ్యభిచారం.!

image

గుంటూరు లక్ష్మీపురంలోని స్పా సెంటర్‌లో జరుగుతున్న వ్యభిచార గుట్టు పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందడంతో ఒకే సారి 17 సెంటర్లపై ఏఎస్పీ సుప్రజ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో థాయ్ లాండ్‌కి చెందిన నలుగురు, నార్త్ ఇండియాకి చెందిన ముగ్గురు, మరో స్పా సెంటర్‌లో ఏడుగురు యువతులు, ముగ్గురు విటులు, ఆయా సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

News December 7, 2024

కేంద్రీయ విద్యాలయాల ఆమోదం పట్ల ఎంపీ లావు హర్షం 

image

దేశ వ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 8 కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం లభించిందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. ఇందులో పల్నాటి వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్న రొంపిచర్ల, మాచర్ల మండలంలోని తాళ్లపల్లిలో కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం లభించి, ప్రారంభానికి లైన్ క్లియర్ అయిందన్నారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు.  

News December 7, 2024

గుంటూరు: కలెక్టర్ల సమావేశానికి ఏర్పాట్లు పరిశీలన

image

ఈనెల 10,11 తేదీలలో వెలగపూడి సచివాలయం వద్ద జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ నాగలక్ష్మీ పరిశీలించారు. సీటింగ్ ఏర్పాట్లు, అకామడేషన్ ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. వెహికల్ పార్కింగ్, సెక్యూరిటీ, భోజన ఏర్పాట్ల గురించి ఆమె స్థానిక అధికారులతో మాట్లాడారు. డ్యూటీలు కేటాయించిన అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు.