India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 12న ఉదయం 11.27గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రుతుపవనాలు ప్రవేశించిన సమయం కావడంతో భారీ వర్షాలు పడినా ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం అల్యూమినియంతో కూడిన పటిష్ఠమైన షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5ఎకరాల్లో ప్రధాన వేదిక, VIP గ్యాలరీ, మిగిలిన 11.5ఎకరాల్లో నేతలు, ప్రజలకు 4 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల మఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరుకానుండడంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో ప్రాంగాణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
బాపట్లలో అదనపు కట్నం కోసం భర్త, అత్త మామలు వేధిస్తున్నారని వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై బాపట్ల గ్రామీణ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. అవినాష్ రతన్తో వాసంతికి 2022లో వివాహమైంది. వివాహ సమయంలో రూ. 22 లక్షల నగదు, బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. కొంత కాలానికి అదనంగా కట్నం తీసుకురావాలని తనను భర్త అవినాష్ రతన్, అత్త, మామ వేధిస్తున్నారని వివాహిత ఫిర్యాదు చేసింది.
గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తామన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు ఒంగోలు, రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం- లోసరి బ్రిడ్జి- నరసాపురం- అమలాపురం- కత్తిపూడి విశాఖపట్నం వైపు మళ్లిస్తామన్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD” సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. కాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ సినిమా ట్రైలర్ ప్రదర్శించే థియేటర్ల వివరాలను చిత్ర బృందం ఈ మేరకు ట్విట్టర్లో వెల్లడించింది. గుంటూరు- భాస్కర్, తెనాలి- సంగమేశ్వర, నరసరావుపేట- రవికళా మందిర్, మాచర్ల- శ్రీనివాస, సత్తెనపల్లి- లక్ష్మీ, ఒంగోలు- గోరంట్ల కాంప్లెక్స్, చిలకలూరిపేట- సాయికార్తీక్
గుంటూరు MPగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం దిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రంలో ఏర్పాటు కానున్న NDA ప్రభుత్వంలో TDP, జనసేన కూడా భాగస్వామ్యం కావాలని తీసుకున్న నిర్ణయంతో పెమ్మసానికి తొలి జాబితాలో స్థానం దక్కింది. పోటీ చేసిన తొలిసారే భారీ మెజార్టీతో గెలిచి, కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. కాగా పెమ్మసాని గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పలువురు నేతలు పెమ్మసానిని అభినందించారు.
* తెనాలి మం. బుర్రిపాలెంలో 1976 మార్చి 7న జననం
* తల్లిదండ్రులు: సాంబశివరావు, సువర్ణ
* భార్య: శ్రీరత్న, సంతానం: అభినవ్, సహస్త్ర
* 1993-94లో MBBS ఎంట్రన్స్లో 27వ ర్యాంకు
* HYD ఉస్మానియా To 2000లో PG కోసం అమెరికా
* USలో మెడికల్ స్టూడెంట్స్ కోసం శిక్షణ సంస్థ ప్రారంభం
* అనతి కాలంలోనే రూ.వేల కోట్లు ఆర్జన
* 2019లో నరసరావుపేట MP టికెట్ కోసం ప్రయత్నం
* 2024లో గుంటూరు MPగా 3,44,695 ఓట్ల మెజారిటీతో గెలుపు
గుంటూరు నగరం బృందావన్ గార్డెన్స్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలోని జిమ్కు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ పేరు పెట్టారు. టీడీపీ హయాంలో భవనం నిర్మించి జిమ్ ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దానికి వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఇవాళ టీడీపీ శ్రేణులు భవనం వద్ద శిలాఫలకం, వైఎస్ఆర్ పేరును తొలిగించి ఎన్టీఆర్ అక్షరాలను ఏర్పాటు చేశారు.
గుంటూరు MPగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం దిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. కేంద్రంలో ఏర్పాటు కానున్న NDA ప్రభుత్వంలో TDP, జనసేన కూడా భాగస్వామ్యం కావాలని తీసుకున్న నిర్ణయంతో పెమ్మసానికి తొలి జాబితా లో స్థానం దక్కినట్లు సమాచారం. పోటీ చేసిన తొలిసారే భారీ మెజార్టీతో గెలిచి, కేంద్ర మంత్రివర్గంలో పదవి దక్కించుకోవడం గ్రేట్ అని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
Sorry, no posts matched your criteria.