Guntur

News November 27, 2024

గుంటూరుకు నేడు ‘దేవకీనందన వాసుదేవ’ చిత్ర బృందం

image

గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా నటించిన  ‘దేవకీనందన వాసుదేవ’ చిత్రం విజయోత్సవ వేడుకలు బుధవారం గుంటూరులో జరగనున్నాయి. చిత్రబృందం కొరిటెపాడులోని హరిహరమహాల్‌కు సాయంత్రం 5.30గంటలకు విచ్చేస్తుందని అశోక్ సన్నిహితులు తెలిపారు. ఇందులో భాగంగా లక్ష్మీపురం మధర్ థెరిస్సా విగ్రహం వద్ద కేక్ కటింగ్ జరుగుతుందని, గల్లా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News November 27, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.40 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి సచివాలయానికి వెళ్తారు. అక్కడ 12.30 గంటలకు మారిటైం పాలసీపై సమీక్షిస్తారు. తిరిగి 04.0 గంటలకు ఎలక్ట్రానిక్ వెహికిల్ పాలసీపై అధికారులతో సమీక్ష చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వచ్చే రూట్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 

News November 27, 2024

వినుకొండ: టీడీపీ నేత కోడలి చీర మిస్సింగ్‌.. నోటీసులు జారీ 

image

ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కొడలు చీర కార్గో పార్శిల్‌లో మాయమైందని పలు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో వినుకొండ ఆర్టీసీ డీపో మేనేజర్‌ను వివరణ కోరగా, ఈ ఘటనపై డీఎం మాట్లాడుతూ.. ఒంగోలు నుంచి నెల్లూరుకు ఇచ్చిన పార్శిల్‌లో ఒక చీర మాయం అయినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై హైయర్ బస్సు ఓనర్‌, డ్రైవర్‌కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. త్వరలో వారు వచ్చి వివరణ ఇస్తారని తెలిపారు.  

News November 26, 2024

IPLలో గుంటూరు కుర్రాడికి నిరాశ

image

IPL వేలం పాటలోకి గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన క్రీడాకారుడు వృథ్వీ రాజ్ యార్రాకు నిరాశ ఎదురైంది. ఇతడు గతంలో కేకేఆర్‌ జట్టుకు ఆడాడు. క్రికెట్‌లో మంచిగా రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సారి వృథ్వీ రాజ్ యార్రా IPLలో రూ.30,00,000 బెస్ ప్రైజ్‌తో వేలంలో నిలిచాడు. అయితే అతడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు.

News November 26, 2024

రాజ్యాంగ హక్కులపై అవగాహన ఉండాలి: DEO

image

భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల కారణంగానే అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాతబస్టాండ్ పరీక్షా భవన్‌లో పలు అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సోమవారం డీఈవో బహుమతులు ప్రదానం చేశారు. ప్రతీ విద్యార్థి రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, ఉర్దూ డీఐ ఖాశీం పాల్గొన్నారు.

News November 26, 2024

పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: పవన్

image

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. సోమవారం మంగళగిరిలో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుపై ఆయన సమావేశం నిర్వహించారు. ఆలయాల పవిత్రత కాపాడేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పవన్ తెలిపారు.

News November 25, 2024

గుంటూరు జిల్లాలో PPP విధానంలో నిర్వహణ ఈ రోడ్లే

image

జాతీయ రహదారులు మాదిరిగా APలో కూడా పీపీపీ విధానంతో పలురోడ్లు గుత్తేదారులకు నిర్వహణ బాధ్యత అప్పజెప్పేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా గుంటూరు జిల్లాలో తొలి విడతకు గుంటూరు-పర్చూరు 41.44 కి.మీ, గుంటూరు-బాపట్ల 51 కి.మీ, మంగళగిరి-తెనాలి-నారాకోడూరు 40.25 కి.మీ, ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏటా ఆయా రోడ్లపై గుంతలు పడితే వాటిని పూడ్చేందుకు PPP విధానంతో సదరు గుత్తేదారు సంస్థ చూసుకోనుంది.  

News November 25, 2024

ఉపాధి కల్పనలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా 2వ స్థానం

image

ఎంఎస్ఎంఈ (మైక్రో,స్మాల్&మీడియం ఎంటర్ప్రైజెస్) ద్వారా గుంటూరు జిల్లాలో 16.085 యూనిట్లు రూ.477.56కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో 2వ స్థానం సాధించింది. ముందు వరుసలో విశాఖ, తర్వాత నెల్లూరు, కృష్ణా జిల్లాలు ఉన్నట్లు సామాజిక ఆర్థిక సర్వే-2024 వెల్లడించింది. ప్రభుత్వ పారిశ్రామిక పాలసీతో 2023-27ల్లో 19,86,658 మందికి ఉపాధి లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిపై మీ కామెంట్..

News November 25, 2024

సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!

image

సీఎం చంద్రబాబు సోమవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి వెలగపూడి సచివాలయానికి వెళతారు. అక్కడ సీఆర్డీఏపై రివ్యూ చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మున్సిపల్ శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల మరమ్మతులపై చంద్రబాబు రివ్యూ చేయనున్నట్లు తెలిపారు. 

News November 25, 2024

కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు: సవిత

image

అమరావతి: కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో తగిన స్థానం లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని, అందుకు నిదర్శనంగా మద్దిరాల గంగాధర్‌ని ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా నియమించడమే అని ఆమె అన్నారు. విద్యార్థి దశ నుండే రాజకీయాల బాటపట్టారన్నారు.