India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పొన్నూరు(M) వెల్లలూరు ఒకనాడు ఫ్యాక్షనిజంతో అట్టుడికేది. అలాంటి గ్రామం నేడు మహనీయుడు విశ్రాంత న్యాయమూర్తి అంబటి లక్ష్మణరావు ఆశయాలకు అనుగుణంగా మద్యానికి దూరంగా ఉంటూ గ్రామస్వరాజ్యం వైపు అడుగులు వేస్తోంది. 15ఏళ్ల క్రితం వరకు గ్రామంలో స్వల్ప కారణాలతో చంపుకునే వరకు వెళ్లేవారు. ఇది చూసి చలించిన లక్ష్మణరావు గ్రామ ప్రజలతో సమావేశమై మద్యపాన నిషేధానికి నాంది పలికారు. ఆనాటి నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు లేవు.
మంగళగిరి పరిధి యర్రబాలెంకు చెందిన వివాహిత తన భర్తను చంపేందుకు తన ప్రియునితో కలిసి పథకం వేసినట్లు మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రూరల్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. వివాహిత కుక్క పిల్లలను అమ్ముతూ ఉంటుందని ఈ క్రమంలో విజయవాడకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, తన భర్తను చంపేందుకు ఓ రౌడీ షీటర్ సహాయం తీసుకున్నట్లు చెప్పారు. పక్కా సమాచారంతో వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపామన్నారు.
పొన్నూరు(M) వెల్లలూరు ఒకనాడు ఫ్యాక్షనిజంతో అట్టుడికేది. అలాంటి గ్రామం నేడు మహనీయుడు విశ్రాంత న్యాయమూర్తి అంబటి లక్ష్మణరావు ఆశయాలకు అనుగుణంగా మద్యానికి దూరంగా ఉంటూ గ్రామస్వరాజ్యం వైపు అడుగులు వేస్తోంది. 15ఏళ్ల క్రితం వరకు గ్రామంలో స్వల్ప కారణాలతో చంపుకునే వరకు వెళ్లేవారు. ఇది చూసి చలించిన లక్ష్మణరావు గ్రామ ప్రజలతో సమావేశమై మద్యపాన నిషేధానికి నాంది పలికారు. ఆనాటి నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు లేవు.
ఏపిలో దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాలు ఎంఓయు చేసుకున్నారు. ఇందులో భాగంగా సుజ్లాన్ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్, లైసెన్సింగ్ వంటి కీలక రంగాల్లో 12వేలమందికి శిక్షణ ఇస్తారు.
చైనాను ఒణికిస్తున్న hMPV వైరస్ కేసులు మన దేశంలో నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు DMHO డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించాలన్నారు. పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి మోసం చేశాడని చుండూరు (M) మున్నంగివారిపాలెంకు చెందిన శ్రీనివాసరావు వాపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయశాఖలో అటెండర్గా పనిచేసే ఎన్.సునీల్ తన బావమరిది ద్వారా పరిచయమయ్యాడన్నారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడన్నారు. ఉద్యోగం రాలేదని, డబ్బులడుగుతుంటే బెదిరిస్తున్నాడని సోమవారం గ్రీవెన్స్లో వాపోయాడు.
స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 17,96,356 మంది ఓటర్లు ఉన్నారని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరి రివిజన్పై అధికారులు, రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లకు కూడా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
వృద్దులు, మహిళలకు సంబంధించిన ఫిర్యాదుల పట్ల శ్రద్ధ వహించి, చట్ట పరిధిలో వారి ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ సూచించారు. సోమవారం, జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీలు జనార్ధనరావు, రమేశ్, మురళీ కృష్ణ, PGRS సీఐ శ్రీనివాసరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8న “రంగోత్సవ్” జిల్లాస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు డీఈవో సీవీ రేణుక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన జూనియర్ కళాశాలల విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్స్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. 8 అంశాల్లో పోటీలు జరుగుతాయని, dietboyapalemguntur@gmail.comలో సంప్రదించాలన్నారు.
కారుణ్య నియామకంలో భాగంగా వివిధ పోస్టులకు జిల్లాలో 11 మంది ఎంపికయ్యారు. సోమవారం కలెక్టరేట్లో ఎంపికైన అభ్యర్థులకు నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ నాగలక్ష్మీ అందించారు. ఇద్దరికి జైళ్ల శాఖ, ఇద్దరికి గ్రౌండ్ వాటర్, ఇద్దరికి పోలీస్ శాఖ, ఇరిగేషన్, మెడికల్ అండ్ హెల్త్, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్, రెవెన్యూ శాఖలలో జేఓఏలుగా నియమించారు. ఉద్యోగాలు పొందిన వారు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు.
Sorry, no posts matched your criteria.