Krishna

News September 25, 2025

మోపిదేవి: విషపురుగు కుట్టడంతో వ్యక్తి మృతి

image

మోపిదేవి మండలం ఉత్తర చిరువోలులంక గ్రామానికి చెందిన నడకదుటి నాగమల్లేశ్వరరావు(40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలు ప్రకారం.. మోపిదేవి దేవస్థానములో సేవ చేయడానికి వెళుతుండగా మార్గమధ్యలో ఏదో విషపురుగు కుట్టినట్లు తెలిపారు. కాలు వెంబడి రక్తం రావడంతో తోటి ఉద్యోగులు అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.

News September 25, 2025

మెగా డీఎస్సీ ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ సమావేశం

image

పామర్రులోని ప్రగతి కాలేజీలో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులతో జిల్లా కలెక్టర్ బాలాజీ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ప్రతి ఒక్కరూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన సూచించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News September 24, 2025

నిరుత్సాహపరుస్తున్న కృష్ణా వర్సిటీ అడ్మిషన్లు

image

కృష్ణా విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల అడ్మిషన్లు నిరుత్సాహకరంగా ఉన్నాయి. మొత్తం 322 సీట్లకు గాను కేవలం 158 మాత్రమే భర్తీ అయ్యాయి. కామర్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథ్స్ వంటి విభాగాల్లో విద్యార్థులు తక్కువగా చేరారు. హాస్టల్ వసతి లేకపోవడం, అధిక ఫీజులు అడ్మిషన్లు తగ్గడానికి కారణమని తెలుస్తోంది. తక్కువ సంఖ్యలో చేరికలు విశ్వవిద్యాలయ అధికారులను ఆందోళనలోకి నెట్టాయి.

News September 22, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ పెనమలూరు హెడ్ కానిస్టేబుల్‌కు ప్రశంసలు
☞ కృష్ణా: పల్లెకు కదిలిన పట్టణ వాసులు
☞ కానూరు: వైన్ షాపులో గొడవ.. ఒకరి మృతి
☞ కృష్ణా : డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల  
☞ దుర్గ గుడికి తక్కువ సామానుతో రండి: NTR కలెక్టర్
☞ దుర్గగుడిలో భక్తులకు క్యూఆర్ సేవలు: NTR కలెక్టర్

News September 21, 2025

మచిలీపట్నంలో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

image

మచిలీపట్నంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. పట్టణంలో చికెన్ విత్ స్కిన్ కిలో రూ.220, స్కిన్‌లెస్ కిలో రూ. 240కు విక్రయాలు జరుగుతున్నాయి. అదే ధరలు గ్రామాల్లో ఎక్కువగా ఉండి స్కిన్ ఉన్న చికెన్ కిలో రూ. 240, స్కిన్‌లెస్ రూ. 260కు అమ్ముతున్నారు. మటన్ ధర పట్టణంలో కిలో రూ.1000 ఉండగా, గ్రామాల్లో మాత్రం కిలో రూ.800కి విక్రయాలు జరుగుతున్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఏలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News September 20, 2025

YSR తాడిగడప మున్సిపాలిటీ పేరు మార్పు!

image

తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును మారుస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్ తాడిగడపకు బదులుగా తాడిగడప మున్సిపాలిటీగా చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

News September 20, 2025

స్వచ్ఛతాహి సేవపై కలెక్టర్ సమన్వయ సమావేశం

image

కలెక్టర్ డీ.కే. బాలాజి శుక్రవారం కలెక్టరేట్‌లోని “మీ-కోసం” సమావేశ హాల్‌లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలను సమన్వయంతో ముమ్మరంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కే. కన్నమ నాయుడు, జిల్లా పంచాయతీ అధికారి జే.అరుణ, తదితరులు పాల్గొన్నారు.

News September 19, 2025

కృష్ణా: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

image

కృష్ణా జిల్లా నూతన ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ న్యాయమూర్తికి మొక్కను అందజేశారు. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలు పరస్పర సహకారంతో ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. నేరస్తులకు త్వరితగతిన శిక్ష విధించేందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఎస్పీ తెలిపారు.

News September 18, 2025

కృష్ణా: ‘స్వచ్ఛతాహి సేవ’పై సమీక్ష

image

కలెక్టర్ డి.కె. బాలాజి గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై ‘స్వచ్ఛతాహి సేవ’ కార్యక్రమంపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, డ్వామా, రహదారులు-భవనాల శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం, ‘స్వచ్ఛతాహి సేవ’ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.

News September 18, 2025

నాగాయలంక: పూడ్చిన శవానికి పోస్ట్ మార్టం.. అసలేమైంది.!

image

నాగాయలంక (M) నాలి గ్రామానికి చెందిన నాయుడు డానియేల్ బాబు (19) గత నెల 28న అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, డానియేల్ తల్లి ఫిర్యాదు మేరకు అవనిగడ్డ DSP విద్యాశ్రీ, తహశీల్దార్, సీఐ సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.