Krishna

News April 3, 2025

VJA: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

image

భార్య మాట వినటంలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపేట పోలీసుల కథనం మేరకు.. జక్కంపూడికి చెందిన అనిల్ కుమార్ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య ఓ బైండింగ్ షాప్‌లో పనిచేస్తూ ఉంటుంది. భార్యను పనికి వెళ్లవద్దంటూ అనిల్ కుమార్ హెచ్చరిస్తూ ఉన్నాడు. అయినా ఆమె పనికి వెళ్లడంతో బుధవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 3, 2025

పెనమలూరులో వ్యాపారి కిడ్నాప్.. కాపాడిన పోలీసులు

image

పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం హైడ్రామ చోటుచేసుకుంది. పోరంకి నారాయణపురం కాలనికి చెందిన వెంకటేశ్వరరావును, వ్యాపార విభేదాల నేపథ్యంలో భాగస్వామి రాజు తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన ఆయన కుమార్తె పోలీసులకు సమాచారం అందించడంతో, వారు అప్రమత్తమై వెంటనే అతడిని కాపాడి కిడ్నాప్‌కు ముగింపు పలికారు.

News April 3, 2025

క‌ష్ణా జిల్లాలో పర్యటించిన కలెక్టర్ 

image

కృష్ణా జిల్లాలోని పలుమండలాలతో పాడు పెదపారుపూడి మండలం భూషనగుళ్ల, మహేశ్వరపురంలోని బాలురు, బాలికల పాఠశాలలను బుధవారం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

News April 2, 2025

మచిలీపట్నం: పారిశుద్ధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టండి – కలెక్టర్

image

మచిలీపట్నం నగరంలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్లో మున్సిపల్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ పారిశుద్ధ్య చర్యలపై చర్చించారు. నగరంలో మార్కెట్ యార్డు, లేడీయాంప్తిల్ కళాశాల, పద్మావతి మహిళా కళాశాల తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీ టీవీలు ఎలా పని చేస్తున్నాయో మొబైల్ ద్వారా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

News April 1, 2025

కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

image

☞కృష్ణా : ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు
☞జూన్‌లో విజయవాడ వెస్ట్ బైపాస్ ఓపెన్
☞ ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ హెచ్చరికలు
☞ కృష్ణా: చిన్నారి మృతి.. హృదయ విదారకం
☞ఉంగుటూరు: వారిని పట్టిస్తే రూ.10 వేలు
☞కృష్ణా: జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
☞కృష్ణా: Way2Newsతో మాట్లాడిన10th విద్యార్థులు
☞ గన్నవరం: వంశీకి షాక్.. రిమాండ్ పొడిగింపు

News April 1, 2025

కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

image

☞కృష్ణా : ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు ☞జూన్‌లో విజయవాడ వెస్ట్ బైపాస్ ఓపెన్ ☞ ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ హెచ్చరికలు ☞ కృష్ణా: చిన్నారి మృతి.. హృదయ విదారకం ☞ఉంగుటూరు: వారిని పట్టిస్తే రూ.10 వేలు ☞కృష్ణా: జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ☞కృష్ణా: Way2Newsతో మాట్లాడిన10th విద్యార్థులు ☞ గన్నవరం: వంశీకి షాక్.. రిమాండ్ పొడిగింపు

News April 1, 2025

కృష్ణా: ఏప్రిల్ ఫూల్ చేశారా ఎవరినైనా.?

image

ఏప్రిల్ 1 వచ్చిందంటే పిచ్చి పనుల పండగే. ఒకరిని ఒకరు వంచించి, లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పుకుంటూ నవ్వుల జల్లు కురిపించేవారు. 2010-12 వరకు ఏప్రిల్ ఫూల్ హంగామా రచ్చరచ్చగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లోనే మెసేజ్‌లతో సరిపెట్టుకుంటున్నారు. మీకు ఎప్పుడైనా షాకింగ్ ఏప్రిల్ ఫూల్ అనుభవం వచ్చిందా.? కామెంట్ చేయండి..

News April 1, 2025

ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ తీవ్ర హెచ్చరికలు 

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా SP గంగాధరరావు ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రవీణ్ పగడాల మృతి కేసును పోలీస్ శాఖ అత్యంత పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎవరైనా ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేసినా, ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. 

News April 1, 2025

కృష్ణా: చిన్నారి మృతి.. హృదయవిదారకం 

image

కృష్ణా (D) అవనిగడ్డ(M) పులిగడ్డలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి వాసులు నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో 2 నెలల శిశువు కూడా ఉంది. ఆ చిన్నారికి నామకరణం చేసేందుకు మోపిదేవి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్ని తరలిస్తుండగా కారు వెనుక సీటులో పసికందు పోలీసులకు కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా పాపను బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

News April 1, 2025

కృష్ణా: దైవ దర్శనానికి వెళుతూ అనంత లోకాలకు

image

కృష్ణా జిల్లా పులిగడ్డ వారిధి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. తెనాలి చెంచుపేటకు చెందిన రవీంద్ర మోహన బాబు కుటుంబంతో సహా కారులో మోపిదేవి ఆలయానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. 21 రోజుల పసికందుతో సహ రవీంద్ర, అతని భార్య అరుణ, మనుమరాలు(5) ప్రమాదంలో మృతిచెందారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.