India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మచిలీపట్నం మాంసం మార్కెట్లలో ఆదివారం ధరలు భగ్గుమన్నాయి. సెలవు దినం కావడంతో మార్కెట్లు రద్దీగా ఉన్నప్పటికీ, ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పట్టణంలో చికెన్ స్కిన్లెస్ రూ. 390 పలుకుతోంది. మటన్ కిలో రూ.1000కి చేరగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.800గా ఉంది. చేపల మార్కెట్లో బొచ్చె రూ. 200, సీలావతి రూ. 170కి విక్రయిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ శుక్రవారం హెచ్చరించారు. జిల్లాలో ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్నారు. ప్రజల్లో నెలకొన్న అలజడి కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (08672-252493) ఏర్పాటు చేశామన్నారు.

కృష్ణా జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయినట్లు జాయింట్ కలెక్టర్ నవీన్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 92,639 మంది రైతుల నుంచి మొత్తం 7.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. దీని విలువ రూ. 1,744.50 కోట్లుగా ఉంది. రైతు సేవా కేంద్రాల ద్వారా పారదర్శకంగా కొనుగోళ్లు జరిపామని, అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

పదో తరగతి హిందీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 21,312 మంది విద్యార్థులకు గాను 21,079 మంది పరీక్షకు హాజరయ్యారు. 233 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. DLO 4, DEO 7, ACGE 5, డిస్ట్రిక్ట్ మోనటరింగ్ కో-ఆర్డినేటర్స్ 5, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ 45 కేంద్రాలను తనిఖీ చేశాయి. ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి 598 మందికి 437 మంది హాజరయ్యారని తెలిపారు.

పామర్రు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయని కలెక్టర్ చెప్పారు.

ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ల సరఫరాలో నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి సమస్యలున్నా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08672-242493కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రతి రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని చెప్పారు.

తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఈ నెల 19వ తేదీన మచిలీపట్నంలోని బచ్చుపేట వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారన్నారు. ఈ వేడుకలకు ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తోపాటు మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర ప్రజాప్రతినిథులు పాల్గొంటారన్నారు.

పురపాలక సంఘాల్లో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన రానుంది. పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. జిల్లాలో మొత్తం ఒక కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉంది. గుడివాడ, తాడిగడప మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగకపోవడంతో అక్కడ ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. మచిలీపట్నం కార్పొరేషన్, పెడన మున్సిపాలిటీ, ఉయ్యూరు నగర పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన రానుంది.

ఈనెల 18 నుంచి నిర్వహించనున్న దివ్యాంగుల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుతుందని పేర్కొన్నారు.

ఈనెల 18 నుంచి నిర్వహించనున్న దివ్యాంగుల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుతుందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.