India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో బుధవారం నిర్వహించిన పదో తరగతి భౌతికశాస్త్రం పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 21,718 మంది విద్యార్థులకు గాను 21,411 మంది హాజరయ్యారని, 305 మంది గైర్హాజరైనట్టు విద్యాశాఖాధికారులు తెలిపారు. 98.60% మేర హాజరు శాతం నమోదైందన్నారు. డీఈఓ 9 కేంద్రాలను పరిశీలించగా జిల్లా పరిశీలకులు 6 కేంద్రాలు, జిల్లా మోనటరింగ్ కో-ఆర్డినేటర్ 7, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 42 కేంద్రాలను సందర్శించారన్నారు.

కృష్ణా జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి యువీ సుబ్బారావు తెలిపారు. బుధవారం ఆయన జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పామర్రు, ఉయ్యూరు మండలాల్లో తొమ్మిది కేంద్రాలను ఆయన సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించి కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు.

కృష్ణా జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి యువీ సుబ్బారావు తెలిపారు. బుధవారం ఆయన జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పామర్రు, ఉయ్యూరు మండలాల్లో తొమ్మిది కేంద్రాలను ఆయన సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించి కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు.

కర్ణాటకలోని దావణగిరి యూనివర్సిటీలో ఈనెల 26 నుంచి 29 వరకు జరిగే దక్షిణ భారత విశ్వవిద్యాలయాల పురుషుల ఖోఖో పోటీలకు కృష్ణా యూనివర్సిటీ జట్టు బుధవారం బయలుదేరింది. జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విశ్వవిద్యాలయ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ప్రిన్సిపాల్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మేక రమేశ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ కృష్ణారెడ్డి, కోచ్ మనోహర్ పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

2 లక్షలపైచిలుకు జనాభాతో 6 మండలాలతో విస్తరించి ఉన్న అవనిగడ్డ నియోజకవర్గంపై పునర్విభజన ఎఫెక్ట్ పడనుంది. సమీప ప్రాంతాలతో కలిపి అవనిగడ్డను రెండు నియోజకవర్గాలుగా విభజించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాలతో కలిపి చల్లపల్లి నియోజకవర్గం ఏర్పడవచ్చని, నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాలతో ప్రస్తుత అవనిగడ్డ నియోజకవర్గం కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం పామర్రు ఒక్కటే SC నియోజకవర్గం. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.

జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్లో వస్తున్న అర్జీల పరిష్కార చర్యలపై కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. పెండింగ్లో ఉన్న 430 అర్జీలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 804 అర్జీలు అందగా 106 అర్జీలను పరిష్కరించినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. 207 అర్జీలను రిజక్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సమీక్షలో జేసీ నవీన్ ఉన్నారు.

ప్రాథమిక పాఠశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ విద్యా వాలంటీర్లను ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు ఆఫీస్ నుంచి విద్యాశాఖ అధికారులు, గ్రామాల్లో గుర్తించిన వాలంటీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో కొంతమంది విద్యార్థులు చదువులో వెనకబడుతున్నారన్న విషయం ఉపాధ్యాయులు సరిగ్గా గమనించడం లేదన్నారు.

బాలల సంక్షేమం, సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బాల్యవివాహాలు, పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పోక్సో, జువెనైల్ జస్టిస్ చట్టాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సమాచారం అందగానే అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఆధార్ లేని అనాధ పిల్లలకు తక్షణమే కార్డులు మంజూరు చేయాలని సూచించారు.

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ PGRS హాలులో ప్రభుత్వ వసతి గృహాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించాలన్నారు.
Sorry, no posts matched your criteria.