India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాల్గో శనివారం సందర్భంగా ఈ నెల 28న జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, అపార్ట్మెంట్లలో స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మచిలీపట్నంలోని తన చాంబర్ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఒక్కరు పరిశరాల శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

జిల్లాలోని ప్రతి పాఠశాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాల విద్యతో పాటు మెరుగైన వాతావరణం కల్పించేందుకు సమన్వయంతో పని చేయాలని
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల చేరికలు, ప్రత్యేక విద్యా కార్యక్రమాల అమలుపై కలెక్టర్ తన ఛాంబర్లో అధికారులతో సమీక్షించారు. అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పెట్రోలు, డీజిల్ కొరతపై సంబంధిత శాఖాధికారులు స్పష్టత ఇచ్చారు. కృష్ణా జిల్లాలో మొత్తం 170 పెట్రోలు బంక్లు ఉండగా ఎటువంటి పెట్రోలు, డీజిల్ కొరత లేదని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ తెలిపారు. పెట్రోలు, డీజిల్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అవాస్తవాలను నమ్మి అదనంగా పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తుండటంతో తాత్కాలిక కొరత ఏర్పడి కొన్నిచోట్ల ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయన్నారు.

మెళకువలు తెలుసుకుని విధి నిర్వహణలో రాణించాలని కలెక్టర్ డీకే బాలాజీ గ్రూప్-2లో ఎంపికై సీసీఎల్ఎ కార్యాలయం నుంచి జిల్లాకు శిక్షణ నిమిత్తం వచ్చిన జూనియర్ అసిస్టెంట్లకు సూచించారు. జిల్లాకు శిక్షణ నిమిత్తం వచ్చిన 11 మంది జూనియర్ అసిస్టెంట్లు గురువారం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రీ-సర్వేను పూర్తిగా అవగాహన చేసుకోవాలని వారికి సూచించారు.

చల్లపల్లిలోని ఓ వడ్రంగి దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మేకల డొంక వద్ద ఉన్న ఉడ్ వర్క్ టింబర్ డిపోలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయింది. ఈ ఘటనలో దుకాణ యజమాని అద్దంకి సత్యనారాయణకు రూ.10లక్షల మేర నష్టం వాటిల్లింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీస్, ఫైర్ సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. డిజైన్ యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితుడు వాపోయాడు.

యుద్ధ భయంతో కృష్ణా జిల్లాలో ఒక్కసారిగా గ్యాస్ బుకింగ్లు పెరిగాయి. గతంలో రోజుకు 9 వేలున్న బుకింగ్లు, ప్రస్తుతం 30 వేలకు చేరాయి. జిల్లాలోని 42 ఏజెన్సీలు రోజుకు 12 వేల సిలిండర్లు మాత్రమే సరఫరా చేయగలుగుతుండటంతో.. ఇంకా లక్షకు పైగా కనెక్షన్లకు నిరీక్షణ తప్పడం లేదు. వారం రోజుల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం గడువు విధించినా, వాస్తవానికి 10 రోజులకు పైగా సమయం పడుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

PDS బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రౌడీషీటర్కు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. పామర్రుకు చెందిన గొట్టపు రమేష్ పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న PDS బియ్యాన్ని అక్రమంగా సేకరించి బయట మార్కెట్లలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అతనిపై పలు జిల్లాల్లో 21 కేసులు నమోదవ్వడంతోపాటు రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని నేరప్రవృత్తి మారకపోవటంతో PD యాక్ట్ నమోదు చేశారు.

PDS బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రౌడీషీటర్కు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. పామర్రుకు చెందిన గొట్టపు రమేష్ పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న PDS బియ్యాన్ని అక్రమంగా సేకరించి బయట మార్కెట్లలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అతనిపై పలు జిల్లాల్లో 21 కేసులు నమోదవ్వడంతోపాటు రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని నేరప్రవృత్తి మారకపోవటంతో PD యాక్ట్ నమోదు చేశారు.

PDS బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రౌడీషీటర్కు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. పామర్రుకు చెందిన గొట్టపు రమేష్ పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న PDS బియ్యాన్ని అక్రమంగా సేకరించి బయట మార్కెట్లలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అతనిపై పలు జిల్లాల్లో 21 కేసులు నమోదవ్వడంతోపాటు రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని నేరప్రవృత్తి మారకపోవటంతో PD యాక్ట్ నమోదు చేశారు.

శ్రీరామ నవమి సందర్భంగా మచిలీపట్నం, ఉయ్యూరు, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం ఆర్టీసీ డిపోల నుంచి భద్రాచలం వెళ్లేందుకు ఈ నెల 26, 27న ప్రత్యేక RTC బస్సులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ప్రత్యేక సర్వీసులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా టికెట్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.