Krishna

News March 16, 2026

GDV: ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖో-ఖో పోటీలకు రాజ్ కుమార్ ఎంపిక!

image

గుడివాడకి చెందిన క్రీడాకారుడు రాజ్ కుమార్ మరోసారి జాతీయస్థాయిలో మెరవనున్నారు. ఈనెల 19 నుంచి 22 వరకు మహారాష్ట్రలోని పూణే వేదికగా జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖో-ఖో టోర్నమెంట్‌కు ఆయన ఎంపికయ్యారు. AP జట్టు తరఫున రాజ్ కుమార్ ప్రాతినిధ్యం వహించడంపై AP ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ రాజ్ కుమార్ జాతీయ పోటీల్లో పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు తెచ్చారని ఆయన కొనియాడారు.

News March 16, 2026

కృష్ణా: పాలక వర్గం లేకపోవడమే.. అక్కడ శాపం

image

చారిత్రక నేపథ్యం ఉన్న యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయానికి పాలకవర్గం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తి ఆధిపత్యం కోసం కమిటీ ఏర్పాటును అడ్డుకుంటున్నారని, దీనిపై ఎమ్మెల్యే కూడా మౌనం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆలయంలో రూ. 10 లక్షల మాయంపై కేసు నమోదైనా, పోలీసులకు ఆధారాలు ఇవ్వకుండా దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News March 16, 2026

అమరజీవి త్యాగం తెలుగు జాతికి ఆదర్శం: అడిషనల్ ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ వి.వి. నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీరాములు గారు తెలుగు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు రవికిరణ్, రవి కుమార్ పాల్గొన్నారు.

News March 16, 2026

పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు: డీఈవో

image

మచిలీపట్నంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను డీఈవో యు.వి. సుబ్బారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిలకలపూడి సీపీఎం హైస్కూల్, నిర్మల, హైని, శ్రీ బాలాజీ, ఎంఈకే బాలాభాను తదితర పాఠశాలల్లో పరీక్షల సరళిని పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన వసతులను సమీక్షించిన ఆయన, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News March 16, 2026

కృష్ణా: టెన్త్ పరీక్షల కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..!

image

పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, సందేహాలు ఉన్నా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9491505378, 9441665999, 7702427788, 9849501067 ఫోన్ చేసి తెలియజేయాలని DEO UV సుబ్బారావు కోరారు. 24 గంటలూ ఫోన్ కాల్స్ స్వీకరిస్తామన్నారు.

News March 16, 2026

కృష్ణా: టెన్త్ పరీక్షల కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..!

image

పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, సందేహాలు ఉన్నా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9491505378, 9441665999, 7702427788, 9849501067 ఫోన్ చేసి తెలియజేయాలని DEO UV సుబ్బారావు కోరారు. 24 గంటలూ ఫోన్ కాల్స్ స్వీకరిస్తామన్నారు.

News March 16, 2026

కృష్ణా: మూడు కేటగిరీలుగా టెన్త్ పరీక్షా కేంద్రాలు

image

కృష్ణాజిల్లాలో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నారు. పరీక్షల నిర్వహణకుగాను 148 కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిని A, B, C కేటగిరీలుగా విభజించారు. 8KM లోపు పోలీస్ స్టేషన్, ట్రెజరీ ఆఫీస్ ఉన్న 55 కేంద్రాలను A కేటగిరీగా విభజించారు. పోలీస్ స్టేషన్ లేదా ట్రెజరీ ఆఫీస్ ఉన్న 43 కేంద్రాలను B కేటగిరీగా, పోలీస్ స్టేషన్, ట్రెజరీ ఆఫీస్ లేని 50 కేంద్రాలను C కేటగిరీగా విభజించారు.

News March 16, 2026

కృష్ణా: మూడు కేటగిరీలుగా టెన్త్ పరీక్షా కేంద్రాలు

image

కృష్ణాజిల్లాలో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నారు. పరీక్షల నిర్వహణకుగాను 148 కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిని A, B, C కేటగిరీలుగా విభజించారు. 8KM లోపు పోలీస్ స్టేషన్, ట్రెజరీ ఆఫీస్ ఉన్న 55 కేంద్రాలను A కేటగిరీగా విభజించారు. పోలీస్ స్టేషన్ లేదా ట్రెజరీ ఆఫీస్ ఉన్న 43 కేంద్రాలను B కేటగిరీగా, పోలీస్ స్టేషన్, ట్రెజరీ ఆఫీస్ లేని 50 కేంద్రాలను C కేటగిరీగా విభజించారు.

News March 16, 2026

కృష్ణా: మూడు కేటగిరీలుగా టెన్త్ పరీక్షా కేంద్రాలు

image

కృష్ణాజిల్లాలో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నారు. పరీక్షల నిర్వహణకుగాను 148 కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిని A, B, C కేటగిరీలుగా విభజించారు. 8KM లోపు పోలీస్ స్టేషన్, ట్రెజరీ ఆఫీస్ ఉన్న 55 కేంద్రాలను A కేటగిరీగా విభజించారు. పోలీస్ స్టేషన్ లేదా ట్రెజరీ ఆఫీస్ ఉన్న 43 కేంద్రాలను B కేటగిరీగా, పోలీస్ స్టేషన్, ట్రెజరీ ఆఫీస్ లేని 50 కేంద్రాలను C కేటగిరీగా విభజించారు.

News March 16, 2026

కృష్ణా: ‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం.. జిల్లాలో 148 కేంద్రాలు

image

నేటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 148 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా 22,232 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 148 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 148 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో పాటు 1500 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు 5 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.