Krishna

News September 15, 2024

విజయవాడ: అధికారులపై సస్పెన్షన్‌ వేటు

image

ముంబై సినీ నటి కాదంబరి కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్ఆర్‌ ఆంజనేయులు, అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణా, పోలీస్ అధికారి విశాల్‌గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ వర్గాల నుంచి ఉత్వర్వులు తాజాగా వెలువడ్డాయి. కాగా ఈ కేసులో ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇటీవల సస్పెండ్ చేశారు.

News September 15, 2024

తిరువూరులో చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి

image

తిరువూరులోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కూలీ పని నిమిత్తం చెట్టు ఎక్కి కొమ్మలను నరికే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడ్డాడు. ఈక్రమంలో గేటుకి ఉన్న స్తూపం దిగబడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మునకుళ్ల గ్రామానికి చెందిన శ్రీకాకుళపు నాగేశ్వరరావు (45)గా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2024

విస్సన్నపేట: బాలికపై హత్యాచారం

image

విస్సన్నపేటలో శనివారం పైశాచికత్వం బయటపడింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన శివయ్య (40) అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేసినట్లు బాలిక తండ్రి స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అతనిపై పోలీస్ స్టేషన్లో (సెక్షన్4)పోక్సో యాక్ట్ 64(1) BNS, కేసు నమోదు చేశామని తిరువూరు సీఐ కె. గిరిబాబు, విస్సన్నపేట ఎస్సై రామకృష్ణ తెలిపారు.

News September 15, 2024

లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో ప్రథమ స్థానంలో ‘కృష్ణా’

image

జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 6363 వివిధ రకాల పెండింగ్ కేసులను పరిష్కరించారు. ఇందులో 5413 క్రిమినల్ కేసులు ఉండగా 181 సివిల్, 484 చెక్ బౌన్స్ కేసులు, 85 మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు ఉన్నాయని జిల్లా జడ్జి అరుణ సారెక తెలిపారు.

News September 15, 2024

విజయవాడలో రాత్రివేళ పర్యటించిన మంత్రి

image

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పాయకాపురం నున్న పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి వేళ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్వయంగా పర్యటించారు. స్థానిక ప్రజలని కలిసి స్వయంగా మాట్లాడి ఆందోళన చెందవద్దని తెలిపారు. బుడమేరుకు వరద అంటూ ప్రచారం చేసిన ఆకతాయిలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బుడమేరుకు ఎటువంటి వరద రాదని ప్రజలు అధైర్యం పడవద్దని అన్నారు.

News September 15, 2024

గుంతలమయమైన రోడ్లకు పూర్వవైభవం: ఉమా

image

వైసీపీ పాలనలో గుంతలమయమైన రోడ్లకు పూర్వవైభవం తెచ్చేందుకు NDA కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమా ట్వీట్ చేశారు. 2 నెలల్లోగా యుద్ధ ప్రాతిపదికన గుంతలు పూడ్చాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. విపత్తు నిధి, PPP విధానాల్లో మరమ్మతులకు గురైన వేలాది కిలోమీటర్ల రోడ్లను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News September 15, 2024

మళ్లీ వరదనే పుకార్లు నమ్మవద్దు: NTR కలెక్టర్

image

బుడమేరుకు మళ్లీ వరద పుకార్లు నమ్మవద్దని NTR జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఓ ప్రకటనలో తెలిపారు. బుడమేరుకు ఎలాంటి ముంపు ప్రమాదం లేదన్నారు. ప్రజలు ఎలాంటి భయందోళన చెందవద్దన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సురక్షితంగా ఎవరి ఇంట్లో వాళ్లు నివసించవచ్చని ఆమె సూచించారు.

News September 14, 2024

గొల్లపూడి వరకు HYD-VJA జాతీయ రహదారి విస్తరణ

image

HYD- VJA జాతీయ రహదారిని గొల్లపూడి వరకు విస్తరించనున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. తొలుత దండుమల్కాపూర్(TG) నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలని భావించినా, గొల్లపూడి వరకు 6 వరుసల రహదారి విస్తరించాలని కేంద్రం నిర్ణయించి ఈ పనులకు టెండర్లను ఆహ్వానించింది. 6 వరుసల రహదారి అందుబాటులోకి వస్తే ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి.

News September 14, 2024

కృష్ణా: బీఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ 2వ సెమిస్టర్(రెగ్యులర్ & సప్లిమెంటరీ) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెప్టెంబర్ 25 లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని పరీక్షల విభాగం తెలిపింది.

News September 14, 2024

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మోర్(MS), సత్రాగచ్చి(SRC) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి నవంబర్ 31 వరకు ప్రతి శనివారం MS- SRC(నం.06077), ఈ నెల 23 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం SRC- MS(నం.06078) ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.