Krishna

News September 13, 2024

కృష్ణా: బ్లాక్ స్పాట్స్ గుర్తించడంతో రోడ్డు ప్రమాదాల నివారణ

image

జిల్లాలో బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించారు.

News September 13, 2024

గంపలగూడెం: ఒకే ఇంట్లో 100 వరకు పాములు

image

గంపలగూడెం మండల కేంద్రంలోని పడమట దళితవాడకు చెందిన రజిని ఇంటి ఆవరణలో 100 వరకు పాములు కలకలం రేపాయి. ప్రహారికి పడ్డ కన్నంలో పాములు కనిపించాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒకే చోట చేరి గుట్టగా తయారైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. వాటిని గమనించిన ఆ ఇంటి యజమానులు, చుట్టుపక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే వాటిని బయటకు తీసేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు.

News September 13, 2024

విజయవాడలో బాడీ మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి

image

విజయవాడలో బాడీ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. మాచవరం సీఐ ప్రకాశ్ తెలిపిన వివరాల మేరకు.. మొగల్రాజపురంలో బాడీ స్పా నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం సాయంత్రం అరెస్ట్ చేశామన్నారు. అలాగే ఇద్దరు యువతులను రక్షించామని తెలిపారు. బాడీ స్పా నిర్వహిస్తున్న చైతన్య, నాగరాజును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇద్దరు మహిళలను సంరక్షణా కేంద్రానికి పంపించామన్నారు.

News September 13, 2024

వరద ముంపు ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ

image

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని కండ్రిక, జర్నలిస్ట్ కాలనీ, రాజీవ్ నగర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వరద నీటి పంపింగ్ పనులను గురువారం రాత్రి మంత్రి నారాయణ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వరద నీటిని బయటకి పంపించేందుకు భారీ మోటర్ల సహాయంతో చర్యలు చేపట్టామన్నారు. కొన్నిచోట్ల రోడ్లకు గండ్లు కొట్టి మరి నీటిని బయటికి పంపించామన్నారు.

News September 12, 2024

షర్మిలను కలిసిన కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ

image

కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన గొల్లు కృష్ణ గురువారం విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. కృష్ణ మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయుటకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.

News September 12, 2024

విజయవాడ: నీటి గోతిలో ఇరుక్కుపోయిన మంత్రి కారు

image

విజయవాడలో మంత్రి నారాయణ, బొండా ఉమామహేశ్వరావుతో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ కారు నీటి గోతిలో కూరుకుపోయింది. సిబ్బంది క్రేన్ సహాయంతో కారును గోతిలో నుంచి వెలికితీశారు. అనంతరం మంత్రి పర్యటన కొనసాగింది.

News September 12, 2024

విజయవాడ వరద బాధితులకు కీలక ప్రకటన

image

విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎన్యుమరేషన్‌లో ఇబ్బంది ఎదురైతే ప్రజలు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం 0866- 2574454, VMC కార్యాలయం- 8181960909 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ జి.సృజన సూచించారు. ఇంటి వద్ద ఎన్యుమరేషన్‌ జరగని పక్షంలో ఈ నెల 12, 13 తేదీల్లో తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శిని సంప్రదించి చేయించుకోవాలని సూచించారు.

News September 12, 2024

కృష్ణా:70 మంది వరద బాధితులకు పాము కాటు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంభవించిన వరద విపత్తు ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. వరద నీటితో పాటు కొట్టుకొస్తున్న పాములు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో 70 మంది పాముకాటుకు గురయ్యారని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులకు పాము కాట్ల బాధితులు వస్తున్నారన్నాయి.

News September 12, 2024

విజయవాడ నుంచి జ్యోతిర్లింగాలకు ప్రత్యేక రైలు

image

విజయవాడ నుంచి పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పేరుతో ఈ నెల 14న IRCTC ప్రత్యేక రైలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 11 రాత్రులు, 12 పగళ్లతో కొనసాగే యాత్ర ఈనెల 14న విజయవాడ నుంచి బయలుదేరి 25న తిరుగు ప్రయాణం అవుతుందన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News September 11, 2024

సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి జోగి రమేశ్

image

సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో తన ముందస్తు బెయిల్ పిటీషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి జోగి రమేశ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వైసీపీ అధికారంలో ఉండగా జోగి రమేశ్ చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారని పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ మార్పిడి తర్వాత రమేశ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.