Krishna

News March 11, 2026

గ్యాస్ సిలిండర్లపై అసత్య ప్రచారం చేస్తే చర్యలు: SP

image

ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత, ధరలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా SP విద్యాసాగర్ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించాలని చూసినా చర్యలు తప్పవన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

News March 11, 2026

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి మృతి

image

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు బుధవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ఆయన 1984,1989,1998లో మచిలీపట్నం నుంచి, 2004, 2009లో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2013లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కావూరి మరణంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

News March 10, 2026

కృష్ణా: ‘పుర’లో ప్రత్యేక పాలన

image

స్థానిక సంస్థలైన నగర పాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 17తో ముగియనుంది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 18 నుంచి ప్రత్యేక అధికారులు అధికారం చేపట్టనున్నారు. మచిలీపట్నం కార్పొరేషన్‌కు కలెక్టర్, పెడన మున్సిపాల్టీకి RDO, పెడనకు MUDA VC ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు.

News March 10, 2026

చల్లపల్లిలో బాలిక ఆత్మహత్య

image

చల్లపల్లి(M) నారాయణరావునగర్‌లో విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలిక కడుపునొప్పితో స్కూలుకు వెళ్లకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకుంది. గమనించిన తల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 10, 2026

కృష్ణా: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలో విద్యార్థుల సౌకర్యార్థం APSRTC ఉచిత BUS సర్వీస్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షల రోజుల్లో విద్యార్థులు తమ నివాస ప్రాంతం నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి తిరిగి రావడానికి హాల్ టికెట్ చూపించి అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.

News March 9, 2026

EVM గోడౌన్‌ను తనిఖీ చేసిన కృష్ణా కలెక్టర్

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న EVM గోడౌన్‌ను కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వివిధ రాజకీయ పక్షాల ప్రతినిథుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీలు తీయించారు. భద్రతా ప్రమాణాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ కె చంద్రశేఖరరావు, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

News March 7, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* విజయవాడలో డ్రగ్స్ ముఠా అరెస్ట్
* కృష్ణ యూనివర్సిటీ డిగ్రీ 3,4 సెమిస్టర్ రీవాల్యూషన్ ఫలితాలు విడుదల
* ఉయ్యూరులో విద్యార్థుల మెడలో చెప్పుల దండ
* విజయవాడలో పోలీసులపై కాల్పులకు యత్నం.!
* కృష్ణాజిల్లాలో అంగన్వాడీ పోస్ట్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
* విజయవాడలో మూడు నెలలపాటు ఉచిత వెబ్ డెవలపర్ శిక్షణ
* మొవ్వ: బావిలో పడి మహిళా కూలి మృతి

News March 6, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* నాగాయలంక: 18 నెలల పసికందును కాటేసిన పాము
వీరవల్లి: ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి ఘటనలో విద్యార్థులకు కౌన్సెలింగ్
* విజయవాడ: OLX పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
* విజయవాడలో బైక్ స్టంట్స్ చేస్తున్న యువకులకు కౌన్సెలింగ్
* విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కుంబాభిషేకం
* అసెంబ్లీ పాయింట్ వద్ద మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే

News March 6, 2026

కృష్ణా: గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా రెండో పంటైన అపరాల సాగు కోత పనులు ఊపందుకున్నాయి. అయితే అపరాల సాగు ప్రారంభ దశలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక తెగుళ్లు వ్యాపించి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అపరాలు విక్రయాలు చేద్దామన్న మద్దతు ధర లేక రైతులు సిండికేట్‌గా మారిన దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News March 6, 2026

విద్యార్థులు పెడదోవ పట్టకుండా అవగాహన కల్పించాలి: కృష్ణా కలెక్టర్

image

విద్యార్థులు పెడదోవ పట్టకుండా విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున అవగాహనా సదస్సులు నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంచి, చెడుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి తన చాంబర్లో బాలబాలికలు, యువత భద్రతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.