Krishna

News September 11, 2024

సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో మరో వ్యక్తి అరెస్టు

image

సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పాలడుగు దుర్గాప్రసాద్‌ను మంగళగిరి పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. దుర్గాప్రసాద్ ఈ కేసులో ఏ4గా నిందితుడిగా ఉన్నాడు. దుర్గాప్రసాద్ కోసం కొంతకాలంగా గాలిస్తున్న పోలీసులు.. ఇవాళ గుంటుపల్లిలో ఆయన ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా దుర్గాప్రసాద్ సతీమణి ఎంపీపీ పాలడుగు జోష్న వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.

News September 11, 2024

పులిగడ్డ గురుకుల పాఠశాలను సందర్శించిన డీఎంహెచ్‌వో

image

అవనిగడ్డ మండలం పులిగడ్డలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో డీఎంహెచ్వో గీతాబాయి పాఠశాలను సందర్శించారు. ప్రిన్సిపల్ కుమార్‌ను, వైద్యులు డా. ప్రభాకర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం రాత్రి వరకు జరిగిన పరీక్షల్లో మొత్తం 31 మంది జ్వర పీడితులు తేలారని, వారిలో ముగ్గురు తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉండగా, మరో ఆరుగురు చికిత్స కోసం ఇళ్లకు వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు.

News September 11, 2024

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తాన ఓ ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. దరఖాస్తులను ఈ నెల 17వ తేదీ లోపు అందజేయాలన్నారు. ఇతర వివరాలకు మచిలీపట్నంలోని డీఈఓ కార్యాలయం ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

News September 11, 2024

24న కృష్ణా జిల్లా మత్స్య సహకార సంఘం ఎన్నికలు

image

కృష్ణా జిల్లా మత్స్య సహకార సంఘం నూతన పాలకవర్గం ఎన్నికకు సంబంధించి కలెక్టర్ డీకే బాలాజీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 24న ఎన్నికలు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 17వ తేదీన నామినేషన్ల స్వీకరణ, 18న పరిశీలన, 19న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 24వ తేదీ ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు.

News September 11, 2024

విజయవాడలో ‘ఉరుకు పటేల’ చిత్ర యూనిట్ సందడి

image

‘ఉరుకు పటేల’ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. ఈ నెల 7న చిత్రం విడుదలై థియేటర్‌లలో విజయవంతంగా నడుస్తోందని ఆ సినిమా హీరోహీరోయిన్లు తేజ‌స్ కంచ‌ర్ల‌, కుష్బూ చౌదరి తెలిపారు. మూవీ విజయోత్సవం సందర్భంగా విజయవాడ వచ్చిన యూనిట్ నగరంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడిని మంగళవారం రాత్రి దర్శించుకొని పూజలు చేశారు. తమ చిత్రం వినాయకచవితి రోజున విడుదల అయ్యిందని, ఆ గణపయ్య ఆశీస్సులతో మంచి సక్సెస్ సాధించిందన్నారు.

News September 11, 2024

విజయవాడ: పాడైన విద్యుత్ మీటర్ల స్థానంలో కొత్తవి..

image

విజయవాడలో వరదల కారణంగా విద్యుత్ శాఖకు కూడా బాగానే నష్టం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్, సెల్లర్లో ఉన్న విద్యుత్ మీటర్లు వరద నీటికి పాడయ్యాయి. పాడైన మీటర్ల స్థానంలో తాత్కాలికంగా కొత్త మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 35 వేల మీటర్లను సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. నేటి నుంచి మీటర్లు పాడైన స్థానంలో కొత్త మీటర్లను ఉచితంగా ఏర్పాటు చేయనున్నారు.

News September 11, 2024

డీజేలకు నో పర్మిషన్: మచిలీపట్నం డీఎస్పీ

image

వినాయక నిమజ్జన ఊరేగింపులో DJలకు అనుమతి లేదని మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తెలిపారు. స్థానిక సిరి కళ్యాణ మండపంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమైన ఆయన.. నిమజ్జనం రోజు తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మద్యం తాగి నిమజ్జన ఊరేగింపుల్లో పాల్గొన్నా, ఎక్కడైనా అల్లర్లకు పాల్పడినా కమిటీ వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అందరూ సహకరించి, పండగను ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలన్నారు.

News September 10, 2024

రేపు విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటించనున్న మెగా హీరో

image

ఈ నెల 11న సినీ హీరో సాయి ధరమ్ తేజ్ విజయవాడలో పర్యటించనున్నారు. వరద బాధితులకు నిత్యావసర సరకులు, దుప్పట్లు, బట్టలు పంపిణీ చేయనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఉదయం 11గంటలకు సింగ్‌నగర్‌లోని అమ్మసేవ ఆశ్రమాన్ని ఆయన సందర్శిస్తానని, అభిమానులు రావాలని కోరారు. ఇటీవల ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయన చెరో రూ. 10 లక్షల చొప్పున విరాళం అందించిన విషయం తెలిసిందే.

News September 10, 2024

విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో దొంగలు

image

విజయవాడ వరద ప్రభావిత కాలనీలలో దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా బీరువాల్లోని నగదు, బంగారం, గ్యాస్ సిలిండర్లు కాజేస్తున్నారు. లూనా సెంటర్లో 10తులాల బంగారం. రూ.లక్షన్నర నగదు, వాంబే కాలనీలో 3తులాల బంగారంతో పాటు సింగ్ నగర్, తదితర ప్రాంతాల్లో చోరీలు జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇళ్లలోని సొత్తు కాజేశారని కంటతడి పెడుతున్నారు.

News September 9, 2024

విజయవాడ: వరద బాధితులకు రూ.కోటి విరాళం

image

లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ.1 కోటి విరాళాన్ని సోమవారం అందజేశారు. సీఎం చంద్రబాబును విజయవాడ కలెక్టరేట్‌లో కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం చంద్రబాబు అభినందించి, వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని అన్నారు.