India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ.1 కోటి విరాళాన్ని సోమవారం అందజేశారు. సీఎం చంద్రబాబును విజయవాడ కలెక్టరేట్లో కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం చంద్రబాబు అభినందించి, వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని అన్నారు.
వరద బాధిత ప్రాంతాల్లో దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఇటీవల నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మొబైల్స్ షాపు, మద్యం దుకాణంలో చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. నీళ్లలో మునిగిన బైక్లలో పెట్రోల్, టైర్లు చోరీ అయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లలో మునిగిన బైక్లను ఆగంతుకులు తుక్కు కింద అమ్మేస్తున్నారని ముంపు ప్రాంతాల వారు చెబుతున్నారు.
నిర్వహణ కారణాల రీత్యా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రయాణించే కింది రైళ్లను ఈ నెల 9, 10 తేదీల్లో రద్దు చేశామని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ కార్యాలయం తెలిపింది. రాజమండ్రి- విజయవాడ (07460), విజయవాడ- మచిలీపట్నం (07895) , మచిలీపట్నం- విజయవాడ (07896), విజయవాడ- మచిలీపట్నం (07769), మచిలీపట్నం- గుడివాడ (07872), గుడివాడ- మచిలీపట్నం (07871), మచిలీపట్నం- విజయవాడ (07899).
ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు. వరద ముంపునకు గురైన లేదా పునరావాస కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు మాత్రమే సెలవు వర్తిస్తోందని స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది. ఏపీ దుస్థితికి చలించి పోయిన వారంతా విరాళాలు ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, NRIలు పలువురు, ఏపీ ఉద్యోగుల సంఘం తమ విరాళాలను ప్రకటించింది. ఇంకా పలువురు ప్రముఖులు విరాళాలను ప్రకటిస్తూనే ఉన్నారు. విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
అత్యంత క్లిష్టమైన బుడమేరు గండ్లను పూడ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 4 రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్ కలిసి ఈ పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. దీంతో ఇన్ఫ్లో పూర్తిగా ఆగిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులను మెయింటెనన్స్ సరిగా చేయలేదని ఆరోపించారు.
వినాయక చవితి సందర్భంగా మంగినపూడి బీచ్, కాలేఖాన్ పేట మంచినీళ్ళ కాలువ వద్ద నిమజ్జనాల ఏర్పాట్లను ఎస్పీ ఆర్.గంగాధర రావు స్వయంగా పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతిమలను నిమజ్జనం చేసే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. భక్తులు నీటిలో ఎక్కువ దూరం వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
వరద బాధితుల ఇళ్లలో ప్లంబర్, ఎలక్ట్రీషియన్ల సేవలు అందించేందుకు APSSDC(ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్)యాప్ తీసుకొచ్చింది. APSSDC ద్వారా శిక్షణ పొందిన ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసేందుకు 462 మంది ముందుకొచ్చారని, త్వరలో వీరిని ముంపు ప్రాంతాలకు పంపించి బాధితుల ఇళ్లలో ప్లంబింగ్ తదితర పనులు చేయిస్తామని అధికారులు తెలిపారు.
ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్ల యజమానులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ పడవలు గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్కు చెందినవిగా గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రభుత్వ సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. యజమానుల గుర్తింపుపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
విజయవాడ పరిసరాల్లోని పల్లపు ప్రాంతాల్లోని వారిని చీకటిపడేలోగా పునరావాస శిబిరాలకు తరలించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో వారికి ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆమె సూచించారు. శనివారం కలెక్టర్ జి.సృజన, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జలదిగ్బంధంలోనే ఉన్న జక్కంపూడి కాలనీ, అంబాపురం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
Sorry, no posts matched your criteria.