Krishna

News April 17, 2025

కృష్ణా: ఉచిత గ్యాస్ సిలిండర్ ఎప్పుడంటే.! 

image

దీపం 2 పథకంలో భాగంగా 2025-26లో ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు దరఖాస్తు చేయాలని జేసీ గీతాంజలి శర్మ తెలిపారు. ఈ ఏడాది మూడు విడతల్లో సిలిండర్‌లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్-జులైలో మొదటిది, ఆగస్టు-నవంబర్‌లో రెండోది, డిసెంబర్-మార్చిలో మూడోది ఉచితంగా అందించనున్నారు. గతేడాది 3,60,500 సిలిండర్లు ఇచ్చారు. ఇప్పటి వరకు 59,333 పంపిణీ చేశారు. 

News April 17, 2025

గన్నవరం: నేడు వంశీ బెయిల్ పిటిషన్‌లపై విచారణ

image

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ బెయిల్ పిటీషన్‌పై నేడు విచారణ జరగనుంది. ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

News April 17, 2025

కృష్ణా: జర్నలిస్టులకు క్రికెట్ పోటీలు 

image

ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి మీడియా ప్రతినిధులు నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ కప్‌ను ఆవిష్కరించారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో ‘అమరావతి జర్నలిస్టు క్రికెట్ లీగ్’ పోటీలు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు ఏసీఏ స్టేడియంలో జరగనున్నాయి. టోర్నీలో 10 మీడియా జట్లు పాల్గొంటున్నాయి. ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. 

News April 17, 2025

కృష్ణా జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం 

image

ఉమ్మడి కృష్ణా జిల్లాకు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌లుగా 8 మందిని ప్రభుత్వం బుధవారం నియమించింది. వీరిలో 7 టీడీపీకి, 1 మాత్రమే జనసేనకు చెందడం ఆసక్తికర చర్చలకు దారి తీసింది. అధికార కూటమిలో భాగమైనా జనసేనకు తక్కువ ప్రాధాన్యం ఎందుకు కలిగిందన్న దానిపై రాజకీయ వర్గాల్లో గట్టిగా చర్చలు సాగుతోందన్నారు. ఇదిలా ఉండగా బీజేపీకి అసలు ఏమి అవకాశం లభించలేదు. 2 పార్టీల సీనియర్ నాయకులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.  

News April 17, 2025

ఉమ్మడి కృష్ణాలో SGT, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు 

image

త్వరలో విడుదల కానున్న డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు విడుదలయ్యాయి. ఇందులో ప్రైమరీ స్థాయి స్పెషల్ ఎడ్యుకేషన్ (SGT) పోస్టులు 71 ఉండగా, సెకండరీ స్థాయిలో 154 మంది స్కూల్ అసిస్టెంట్లు స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో కావాల్సి ఉండగా.. 65 పోస్టులు ఇప్పటికే మంజూరు చేశామని, కొత్తగా 89 మంజూరు అయ్యాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

News April 16, 2025

కృష్ణా: మొక్కల పెంపకానికి సన్నద్ధం కావాలి – కలెక్టర్

image

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తన క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ.. వృక్షో రక్షతి రక్షితః అంటూ మొక్కల పెంపకం కంటే మించిన గొప్ప పనేదిలేదని స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలానికి ముందుగానే రహదారి మార్గాలు, విద్యాసంస్థలు, కాలువలు, చెరువుల గట్ల పైన మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు.

News April 16, 2025

గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న 16వ ఆర్థిక సంఘం 

image

గన్నవరం విమానాశ్రయానికి పనగారియ నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం చేరుకుంది. రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా విజయవాడ, తిరుపతి నగరాల్లో ఈ బృందం పర్యటిస్తుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయం వంటి కీలకమైన అంశాలపై ఫైనాన్స్ కమిషన్ టీమ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల భేటీ కానున్నారు.

News April 16, 2025

కృష్ణా: అంతరించిపోతున్న ఈత బుట్టలు.!

image

ఓ కాలంలో ప్రతిష్ఠగా నిలిచిన ఈత బుట్టలు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు, సుంకొల్లు, పామర్రు, గన్నవరం, బాపులపాడు తదితర ప్రాంతాల్లో తయారయ్యేవి. ఈత చెట్ల చువ్వలు కోసి, వాటిని చేతితో నేసి అందంగా తయారు చేసేవారు. పట్టణాల్లోకి వెళ్లి అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. ప్లాస్టిక్ వస్తువులు వచ్చాక ఈ కళ జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది. 

News April 16, 2025

గుడివాడ: తమ్ముడి మృతిని తట్టుకోలేక అక్క మృతి

image

సోదరుడి మృతదేహాన్ని చూసేందుకు విజయవాడ వెళ్లిన మృతుడి సోదరి అంజలి షాక్‌కు గురై చనిపోయిన ఘటన మంగళవారం చోటు చేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. గుడివాడ రూరల్ మండలం దొండపాడుకు చెందిన మాజీ సర్పంచ్ రామాంజనేయులు అనారోగ్యంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. ఈయన భార్య గద్దె పుష్పరాణి ప్రస్తుతం గుడివాడ రూరల్ మండల ఎంపీపీగా ఉన్నారు. తమ్ముడి మృతితో అక్క మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 16, 2025

కృష్ణా: జిల్లాలో నీటి చౌర్యం కాకుండా చూడండి- కలెక్టర్

image

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా, జిల్లాలో ఉన్న 266 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లను పూర్తిస్థాయిలో నింపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో తాగునీటి స్థితిగతులపై సమీక్షించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైన నీరు చౌర్యానికి గురి కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలపై నిఘా పెంచాలన్నారు.