India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలోని ఘంటసాల మండలం పాపవినాశనం ఇసుక రీచ్ నుంచి ఇసుక తవ్వకాలకు నిబంధనల మేరకు ఈ-టెండర్లు పిలవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక నిల్వలపై సమీక్షించారు.

☞ చల్లపల్లిలో చోరీలకు పాల్పడుతున్న దంపతులు అరెస్ట్
☞ స్వమిత్వ సర్వేతో భూ సమస్యల పరిష్కారం: కలెక్టర్
☞ NTR: 13 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
☞ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ
☞ ఉంగుటూరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు
☞ హరికృష్ణ జయంతి.. కొడాలి నాని ట్వీట్
☞ హనుమాన్ జంక్షన్లో ఆటో డ్రైవర్ల ఆందోళన

హరికృష్ణ జయంతి సందర్భంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించారు. ‘నిరాడంబరత, నిజాయితీ కలగలసిన మంచి మనిషి, అనునిత్యం మా ఎదుగుదలను కాంక్షించిన నా గురువు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా స్మరించుకుంటూ’ అని రాసుకొచ్చారు. గతంలో ఆయనతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు.

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రజల నుంచి 39 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను చట్టపరంగా వెంటనే విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

☞ కృష్ణా: రీవాల్యుషన్ ఫలితాలు విడుదల.
☞ కృష్ణా: ‘మీకోసం’ కార్యక్రమంలో 36 ఫిర్యాదులు.
☞ కృష్ణా: ఉచిత బస్సు పథకానికి భారీ స్పందన.. బస్సుల సంఖ్య పెంపు.
☞ పవన్ కళ్యాణ్ను కలిసిన VHP నేతలు.
☞ గైర్హాజరు అయ్యే అధికారులపై శాఖాపరమైన చర్యలు: కలెక్టర్.
☞ విజయవాడలో OG ‘ మూవీ ఉత్సవ్’.
☞ కృష్ణా: జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ.

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రజల నుంచి 39 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను చట్టపరంగా వెంటనే విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమానికి గైర్హాజరయ్యే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలు శాఖల అధికారులు గైర్హాజరైనట్టు గుర్తించిన కలెక్టర్ వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీఆర్ఓను ఆదేశించారు.

జిల్లాలో 4.7mm సరాసరి వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో ఈ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు. అత్యధికంగా పెనమలూరు మండలంలో 20.4mm వర్షపాతం నమోదవ్వగా అత్యల్పంగా పెదపారుపూడిలో 0.6mm నమోదైందన్నారు. బంటుమిల్లి, కోడూరు, పెడన, నాగాయలంకలో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.