Krishna

News March 14, 2025

గన్నవరం: వల్లభనేని వంశీని వదలని కేసులు 

image

వల్లభనేని వంశీపై నమోదైన 2 కేసుల్లో గురువారం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గన్నవరం, ఆత్కూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో, పోలీసులు గన్నవరం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీపై, ఈ కేసుల్లో విచారణ చేపట్టేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. కేసుల విచారణ కోసం త్వరలోనే వంశీని కోర్టు ముందుకు హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

News March 14, 2025

వైసీపీ మహిళా విభాగం కృష్ణాజిల్లా అధ్యక్షురాలిగా భారతి

image

వైసీపీ మహిళా విభాగం కృష్ణాజిల్లా అధ్యక్షురాలిగా శీలం భారతి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. భారతీ మచిలీపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా వ్యవహరిస్తున్నారు. భారతి నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. తన నియామకానికి కృషి చేసిన మాజీ మంత్రి పేర్ని నానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

News March 14, 2025

కృష్ణా: ఈనెల 17 నుంచి 10th exams

image

మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తెలిపారు. గురువారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో విద్యాశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.

News March 13, 2025

జగన్‌తో కృష్ణాజిల్లా వైసీపీ నేతల భేటీ

image

మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని నాయకత్వంలో జిల్లాలోని ఆ పార్టీ నేతలు గురువారం తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ని కలిశారు. యువత పోరు పేరుతో కలెక్టరేట్ వద్ద బుధవారం జరిగిన ధర్నా విజయవంతం అయిన తీరు, జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను జగన్‌కు వివరించారు. జగన్‌ని కలిసిన వారిలో సింహాద్రి రమేష్, కైలే అనిల్, ఉప్పాల రాము, పేర్ని కిట్టు తదితరులు ఉన్నారు.

News March 13, 2025

బోరగడ్డ అనిల్‌ను మచిలీపట్నం తీసుకురానున్న పోలీసులు

image

YCP నేత బోరుగడ్డ అనిల్‌పై చిలకలపూడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై దూషణ కేసులో అనిల్ కుమార్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయనపై గతంలో చిలకలపూడి PSలో 2 కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో రాజమండ్రి నుంచి కాసేపటి క్రితం అనిల్‌ను ఇక్కడకు తీసుకొచ్చారు.

News March 13, 2025

కృష్ణాజిల్లా TODAY TOP NEWS 

image

* మచిలీపట్నంలో ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి ఏడేళ్లు జైలు
* కృష్ణాజిల్లాలో ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్.. విద్యార్థుల జోష్‌
* మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.7.63లక్షలు
* వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ 17కి వాయిదా
* తాడేపల్లిలో జగన్‌ని కలిసి కృష్ణాజిల్లా వైసీపీ నేతలు
* కృష్ణా జిల్లాలో 145 పరీక్షా కేంద్రాలు: Way2Newsతో- DEO
* GDV: రైలులో నుంచి జారిపడి మహిళ మృతి

News March 13, 2025

మచిలీపట్నంలో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

image

మచిలీపట్నంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేశ్వరరావు రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వెళ్తున్న లారీ కాలును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన కుడి కాలు పాద భాగం నుజ్జు నుజ్జైంది. క్షతగాత్రుడిని వెంటనే మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News March 13, 2025

కృష్ణా జిల్లాలో నేడు వడగాల్పులు

image

కృష్ణా జిల్లాలో గురువారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. జిల్లాలో పలు మండలాలకు హైఅలర్ట్ ప్రకటించింది. బాపులపాడు 40.7°, గన్నవరం 41.7, కంకిపాడు 40.6°, నందివాడ 40°, పెదపారుపూడి 40.4, పెనమలూరు 40.9°, ఉంగుటూరు 41.4°, ఉయ్యూరు 40.6° ఉష్ణోగ్రతలు ఉండనున్నట్లు చెప్పారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 12, 2025

రెవెన్యూ అంశాలపై పట్టు పెంచుకొవాలి: కలెక్టర్

image

మచిలీపట్నం కలెక్టరేట్‌లో మీకోసం సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్‌ఓ కే చంద్రశేఖరరావు, కె ఆర్ ఆర్ సి. ఎస్.డి.సి శ్రీదేవితో కలిసి రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పురోగతి, రీ సర్వే, గ్రామ, వార్డు సచివాలయాల సేవలు తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్దేశం చేశారు.

News March 12, 2025

గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ నేడు

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు (బుధవారం) విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఏ 71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా వల్లభనేని వంశీ పై పలు కేసులు నమోదయ్యాయి.

error: Content is protected !!