Krishna

News August 29, 2024

కృష్ణా: UG & PG విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANUCDE)లో డిస్టెన్స్ విధానంలో UG, PG కోర్సులు చదివే విద్యార్థులు(C-24 బ్యాచ్‌) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్ విడులైంది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 27 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధ రుసుము లేకుండా సెప్టెంబర్ 2లోపు చెల్లించాలని వర్సిటీ సూచించింది. పూర్తి వివరాలకు http://anucde.info/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని స్పష్టం చేసింది.

News August 29, 2024

కృష్ణా: APEDBలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డులో 13 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్(2), జనరల్ మేనేజర్(5), మేనేజర్(6) పోస్టులున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 11లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు https://apedb.ap.gov.in/career.html అధికారిక వెబ్‌సైట్ చూడాలని సంబంధిత వర్గాలు సూచించాయి.

News August 29, 2024

ఈనెల 31వ తేదీనే పెన్షన్లు పంపిణీ: సీఎం చంద్రబాబు

image

ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు నేడు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం, ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో లేకపోవడం వల్ల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31వ తేదీన తీసుకోని వారికి తరువాత పింఛను అందిస్తారు.

News August 28, 2024

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు

image

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీదేవిగా, 4న గాయత్రి దేవిగా, 5న అన్నపూర్ణ దేవిగా 6న లలిత త్రిపుర సుందరిదేవిగా, 7న. మహా చండీగ, 8న మహాలక్ష్మి దేవిగా. 9న సరస్వతిదేవిగా. 10న దుర్గాదేవిగా, 11న మహిషాసురమార్థని. 12న. రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లను చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు.

News August 28, 2024

జగన్ చీకటి పాలన నడిపారు: మాజీ మంత్రి ఉమా

image

కృష్ణా: గత ప్రభుత్వంలో రహస్య జీవోలతో జగన్ చీకటి పాలన నడిపారని మాజీ మంత్రి దేవినేని ఉమా ట్వీట్ చేశారు. అవినీతి, దోపిడీ, అరాచకాలు కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు మార్గాలు ఎంచుకున్న గత సర్కారు జీవోలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిందన్నారు. ప్రతి జీవో ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంతో జీవోలకు చీకటి చెర వీడిందని ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News August 28, 2024

కృష్ణా: ఎం-ఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా వర్సిటీ క్యాంపస్‌ కళాశాలలోని ఎం-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను సెప్టెంబర్ 23 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 9లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలంది. వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News August 28, 2024

ఆగిరిపల్లి: లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో విగ్రహం చోరీ

image

ఆగిరిపల్లి గ్రామంలో స్వయంభూగా వేంచేసియున్న శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహం మంగళవారం రాత్రి చోరీకి గురైన సంఘటన సంచలనంగా మారింది. మూడు గుళ్ల వద్ద గంట, ఒక అడుగు ఎత్తుగల ఉత్సవ విగ్రహంలను దుండగులు చోరీ చేశారు. తలుపు తాళాలు పగల కొట్టి ఆలయంలోకి చొరబడి వెండి వస్తువులతో పాటు శటారి, ఇతర వస్తువులు చోరీ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

News August 28, 2024

2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం: సీఎం

image

కృష్ణా: సీఎం చంద్రబాబు అమరావతిలో నీతిఆయోగ్ ప్రతినిధులతో మంగళవారం సమావేశమయ్యారు. వికసిత ఏపీ-2047 డాక్యుమెంట్ రూపకల్పనపై సీఎం ఈ సమావేశంలో నీతిఆయోగ్ బృందంతో చర్చించారు. 12 అంశాలతో వికసిత ఏపీ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని, 2047నాటికి ఏపీని 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో వెల్లడించారు.

News August 27, 2024

కృష్ణా: ఇసుక నిల్వలపై తాజా పరిస్థితిని ప్రకటించిన ప్రభుత్వం

image

రాష్ట్రంలో 28వ తేదీ బుధవారం నాటికి 56 నిల్వ కేంద్రాలలో 16,65,586 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 35,523 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం 2,739 దరఖాస్తులు గనుల శాఖకు అందాయన్నారు. వీరిలో 2,545 మంది దరఖాస్తు దారులకు 33,181 మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుకను అందించామని మీనా మీడియాకు తెలిపారు.

News August 27, 2024

అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవు: దేవినేని ఉమా

image

ఎన్టీఆర్: మద్యం, దందా అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని మాజీ మంత్రి దేవినేని ఉమా ట్వీట్ చేశారు. మదనపల్లి ఫైల్స్ దహనం కుట్ర తీగలాగితే వైసీపీ పెద్దల మద్యం మాఫియా గుట్టు రట్టయిందన్నారు. క్యాష్ & క్యారీ అక్రమ లావాదేవీలు, వేలకోట్ల లిక్కర్ స్కాం ముడుపుల బాగోతంపై ప్రభుత్వ విచారణలో కీలక ఆధారాలు బయటపడ్డాయని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.