India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులతో ఎండలో పని చేయిస్తున్న ఘటన కలకలం రేపింది. హెచ్.ఎం, డ్రిల్ మాస్టర్ ఆదేశాలతో విద్యార్థులతో తాపీ పని చేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవిలో చెప్పులు లేకుండా విద్యార్థులతో పనిచేయించడం ఆందోళన కలిగిస్తోంది. స్కూల్లో ఇలా చేయించడమేంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కానూరు సనత్ నగర్లో ఇద్దరు మైనర్లకు కొంతమంది గంజాయి తాగించడానికి బలవంతం చేశారు. దీనిని వద్దని తిరస్కరించడంతో వారిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అడ్డుకోగా వారిపై కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శనివారం బాధితుల ఫిర్యాదు మేరకు నయీమ్, సమీర్, నజీర్ సహా 22 మందిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉ.8గంటలకు మొదలవుతుంది. సుదీర్ఘంగా సాగే కౌంటింగ్ ప్రక్రియ కావడంతో సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. కాగా ఉమ్మడి GNT, కృష్ణా జిల్లాల్లోని గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కట్టారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. TDP అభ్యర్థి ఆలపాటి, PDF అభ్యర్థి లక్ష్మణరావు మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై ఇరు వర్గాల్లో టెన్షన్ నెలకొంది.
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును విజయవాడ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు, నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు స్థానిక సమస్యలను వివరించగా, ఆయన వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
కృష్ణాజిల్లాలో నేటి ముఖ్యంశాలు * కృష్ణా జిల్లాలో ఇంటర్ మొదటి రోజు పరీక్షకు 98.03% హాజరు* విజయవాడలో పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ * కృష్ణా: ప్రజలపై బాలకృష్ణ ఆగ్రహం..YCP రియాక్షన్ * కృష్ణా: అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్స్ * కృష్ణ విశ్వవిద్యాలయం ఇన్చార్జి రిజిస్టర్గా ఆచార్య ఉష * కృష్ణా జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్టు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు విద్యాశాఖాధికారి పీబీ సాల్మన్ రాజు తెలిపారు. తొలిరోజు పరీక్షకు 98.03% మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మొత్తం 24,810 మందికి గాను 24,323 మంది పరీక్షకు హాజరయ్యారని, 487 మంది గైర్హాజరయ్యారన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు జిల్లాలో నమోదు కాలేదన్నారు.
కృష్ణా జిల్లా నిమ్మకూరులో ప్రజలపై సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై వైసీపీ X వేదికగా స్పందించింది. ‘ఎంత అవివేకం ఎంత కుసంస్కారం నీకు బాలయ్య.?’ అని పోస్ట్ చేసి బాలకృష్ణ గ్రామస్థులతో ఉన్న వీడియోను వైసీపీ జత చేసింది.
ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు విద్యార్థులు నిర్ణీత సమయంలో చేరుకొని పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 66 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి.
కొత్త వాహన చట్టాన్ని మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు కృష్ణా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5వేలు, మద్యం తాగి, సెల్ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేల జరిమానా విధించనున్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని అధికారులు కోరారు.
వార్షిక బడ్జెట్లో విజయవాడ మెట్రో నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించింది. కాగా మెట్రో పూర్తిచేసేందుకు కేంద్రం 100% భరించేలా గతంలో రాష్ట్రం ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనపై కేంద్రం అధికారిక ప్రకటన ఇచ్చినట్లయితే రాష్ట్రం నుంచి మరిన్ని నిధుల కేటాయింపుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం విజయవాడ మెట్రోపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
Sorry, no posts matched your criteria.