India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మచిలీపట్నం నగర పాలక సంస్థలో పని చేస్తున్న 38 మందిపై శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది. గతంలో ACB అధికారులు చేపట్టిన తనిఖీల్లో బిల్లులు ఇవ్వకుండా కొత్త నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం, ఇంటి పన్నుల విధింపులో అవకతవకలు చేశారని గుర్తించారు. దీనికి బాధ్యులైన 38 మందిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. వీరిలో అప్పటి మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఉన్నారు.

బందరు పోర్టు అభివృద్ధికి ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం రూ.573.77 కోట్లతో భారీ రహదారి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. NH-65, NH-216 జంక్షన్లను నేరుగా పోర్టుతో అనుసంధానిస్తూ 6 లైన్ల ప్రధాన రహదారి, సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రాజెక్టులో 3 ఫ్లైఓవర్లు, ఒక భారీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు తెలిపారు.

కృష్ణా జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిమ్మకూరు వేదికగా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లా టిడిపి అధ్యక్షుడిగా నియమితులైన వీరంకి గురుమూర్తి కార్యక్రమంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు, వివిధ హోదాల్లో నియమితులైన కార్యవర్గ సభ్యులు కూడా అదే సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

చల్లపల్లి(M) శివరాందుర్గాపురానికి చెందిన అంధ యువకుడు నాగరాజు అసాధారణ పట్టుదలతో గ్రూప్-2 విజేతగా నిలిచారు. 2010లో జరిగిన ప్రమాదంలో చూపు కోల్పోయినా అధైర్యపడకుండా, ఒంగోలు అంధుల పాఠశాలలో విద్యనభ్యసించి MA పూర్తి చేశారు. గ్రూప్-2 ఫలితాల్లో HOD విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా ఎంపికయ్యారు. గతంలో CM చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న ఆయన, భవిష్యత్తులో గెజిటెడ్ అధికారి కావడమే తన లక్ష్యమన్నారు.

పదో తరగతి (SSC) విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ SSC ఎగ్జామినేషన్ బోర్డు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి గురువారం తెలిపారు. పరీక్ష ఫీజును ఇప్పటివరకు చెల్లించని విద్యార్థులు రూ.1000ల అపరాధ రుసుంతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఈ తత్కాల్ పథకం ఈనెల 6 నుంచి 12 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

మచిలీపట్నంలోని ఎస్ఎన్ గొల్లపాలెం పంచాయతీ పరిధిలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అక్షర ఆంధ్ర (ఉల్లాస్)’ కార్యక్రమాన్ని కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. అనంతరం ఆయన నేలపై కూర్చుని తరగతుల నిర్వహణ, హాజరు, బోధనా విధానాలను పరిశీలించి అధికారులతో చర్చించారు. వయోజనులు చదువుతో స్వావలంబన సాధించాలన్నారు. అక్షరాస్యత కుటుంబం, సమాజ అభివృద్ధికి దోహదమని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా మిగిలిపోయిన బార్ లైసెన్సుల కోసం జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ మచిలీపట్నం లాటరీ విధానాన్ని నిర్వహించారు. మొత్తం 11 బార్లలో 6 బార్లకు 37 దరఖాస్తులు వచ్చాయన్నారు. గురువారం లాటరీ విధానం ద్వారా మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో 5 బార్లు, గుడివాడ మున్సిపాలిటీలో 1 బారుకు లైసెన్సులు మంజూరు చేశారు. గుడివాడలో 4, పెడనలో 1 బార్కు దరఖాస్తులు లేకపోవడంతో వాటి లాటరీని రద్దు చేశారు.

తాము చదువుకున్న పాఠశాలలను మర్చిపోకుండా, వాటి అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తోడ్పాటు అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తమ వంతు సాయం అందించడం అభినందనీయమన్నారు. పాఠశాలల బలోపేతానికి పూర్వ విద్యార్థుల సహకారం ఎంతో అవసరమని, వారి భాగస్వామ్యం నేటి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

TDP జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని రేపు NTR స్వగ్రామమైన నిమ్మకూరులో నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి NTR కుమారుడు నందమూరి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వీరంకి వెంకట గురుమూర్తి, ప్రధాన కార్యదర్శిగా గోపు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బందరు ఓడరేవు తొలి దశలో 4 బెర్తుల నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని మెగా ఇంజినీరింగ్ లిమిటెడ్ జీఎం తులసీదాసు తెలిపారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చొంగ్ పూ షీన్ నేతృత్వంలోని బృందం ప్రాజెక్ట్ పనులను బుధవాం పరిశీలించింది. 2000 ఎకరాల్లో సాగుతున్న పనుల్లో 1300 మంది కూలీలు పనిచేస్తున్నట్లు వివరించారు.
Sorry, no posts matched your criteria.