India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లాలో ధాన్యం సేకరణకు 3,715 వాహనాలను నడుపుతున్నామని కలెక్టర్ డీకే బాలాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు తెలిపారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ధాన్యం సేకరణ, గంజాయిపై అవగాహన, తదితర అంశాలపై సమీక్షించారు.

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే తక్షణమే అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. అజెండాలోని అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. సింగిల్ విండో ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామన్నారు.

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే తక్షణమే అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. అజెండాలోని అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. సింగిల్ విండో ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్న మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోనశశిధర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం నిర్వహించిన మెగా పేరెంట్, టీచర్స్ సమావేశంపై వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. సమావేశంలో విద్యార్థుల పురోగతిపై చర్చించారు.

కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్న సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డి.కె. బాలాజి తెలిపారు. గురువారం ఉదయం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల పనుల పురోగతిని జిల్లాల వారీగా సమీక్షించారని కలెక్టర్ వివరించారు.

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి కృష్ణా జిల్లా రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర హామీ నీటిపై రాతయ్యిందని అంటున్నారు. ఇక్కడి మిల్లర్లు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో, గోదావరి జిల్లాల మిల్లర్లు 28% తేమ ఉన్న ధాన్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఒకప్పుడు కృష్ణాజిల్లాలో భాగంగా ఉన్న కైకలూరు నియోజకవర్గం మళ్లీ జిల్లాలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజనకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత YCP హయాంలో కైకలూరును ఏలూరు జిల్లాలోకి తీసుకువెళ్లారు. ఈ విలీనాన్ని వ్యతిరేకించిన నియోజకవర్గ ప్రజలు కృష్ణాజిల్లాలోనే కొనసాగించాలన్న డిమాండ్ ను బలంగా వినిపించారు. మరి కూటమి ప్రభుత్వం కైకలూరును జిల్లా పరిథిలోకి తెస్తారో, లేదో చూడాలి.

జిల్లాల పునర్విభజన కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేల మధ్య కొత్త వివాదానికి తెరలేపింది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల విలీనం విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదు. విజయవాడకు ఆనుకుని ఉన్న ఈ రెండు నియోజకవర్గాలను NTR జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంలో గన్నవరం MLA యార్లగడ్డ పట్టుబట్టి కూర్చున్నారు. అలా చేస్తే జిల్లా విస్తీర్ణం తగ్గి ప్రాధాన్యత కూడా తగ్గిపోతుందని ఇతర MLAలు అంటున్నారు.

జిల్లాల పునర్విభజన కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేల మధ్య కొత్త వివాదానికి తెరలేపింది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల విలీనం విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదు. విజయవాడకు ఆనుకుని ఉన్న ఈ రెండు నియోజకవర్గాలను NTR జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంలో గన్నవరం MLA యార్లగడ్డ పట్టుబట్టి కూర్చున్నారు. అలా చేస్తే జిల్లా విస్తీర్ణం తగ్గి ప్రాధాన్యత కూడా తగ్గిపోతుందని ఇతర MLAలు అంటున్నారు.

జిల్లాల పునర్విభజన కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేల మధ్య కొత్త వివాదానికి తెరలేపింది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల విలీనం విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదు. విజయవాడకు ఆనుకుని ఉన్న ఈ రెండు నియోజకవర్గాలను NTR జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంలో గన్నవరం MLA యార్లగడ్డ పట్టుబట్టి కూర్చున్నారు. అలా చేస్తే జిల్లా విస్తీర్ణం తగ్గి ప్రాధాన్యత కూడా తగ్గిపోతుందని ఇతర MLAలు అంటున్నారు.
Sorry, no posts matched your criteria.