India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కృష్ణా జిల్లాలో ఐఈఆర్టీ ఉపాధ్యాయుల కొరతతో ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్యా సేవలు అంతరించిపోతున్నాయి. 25 మండలాల్లో 50 పోస్టులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 45 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, కృత్తివెన్ను మండలాల్లో ఒక్కో ఉపాధ్యాయుడే ఉండటంతో సేవలు ప్రభావితమవుతున్నాయని తల్లిదండ్రులు రెండో పోస్టు భర్తీ చేయాలని కోరుతున్నారు.

గుడివాడ ఆర్టీసీ డిపోలో ఔట్ సోర్సింగ్ విధానంలో రోజువారీ వేతనంతో డ్రైవర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. హెవీ లైసెన్స్ పొందిన 18 నెలలు పూర్తై ఉండాలి. బయోడేటా, యాక్సిడెంట్ లేని సర్టిఫికెట్, ఆధార్, లైసెన్స్తో 12-08-2025లోపు దరఖాస్తులు సమర్పించాలి. రికార్డుల పరిశీలన అనంతరం వైద్య పరీక్ష, శిక్షణతో ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన “మీ కోసం” కార్యక్రమంలో మహిళల సమస్యలు ప్రధానంగా వినిపించాయి. ఎస్పీ ఆర్.గంగాధరరావు 33 ఫిర్యాదులు స్వీకరించి చట్టపరంగా త్వరిత పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. గుడ్లవల్లేరు, అవనిగడ్డ నుంచి వచ్చిన మహిళలు భర్తల వేధింపులు, బెదిరింపులు, అదనపు కట్నం డిమాండ్లపై ఫిర్యాదు చేయగా, ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్రను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ సోమవారం కలిశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కేసుల పురోగతిపై నివేదికను సమర్పించి, రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా భవిష్యత్ వ్యూహాలపై కూడా చర్చించారు.

కృష్ణా జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో DRO కె. చంద్రశేఖరరావు నేతృత్వంలో PGRS కార్యక్రమం సోమవారం జరిగింది. మొత్తం 103 అర్జీలు స్వీకరించగా, వాటిని సంబంధిత శాఖలకు వర్చువల్గా పంపించారు. రెవెన్యూ శాఖలో పెండింగ్లో ఉన్న 23 అర్జీలను 48 గంటల్లో పరిష్కరించనున్నట్లు డీఆర్ఓ తెలిపారు. పారదర్శక సేవలు, ఖాళీ పోస్టులను కారుణ్య నియామకాలతో భర్తీ చేస్తామన్నారు.

బందరు కలెక్టరేట్ నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు జాతీయ పతాకాలతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ సోమవారం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరేయాలని, స్వదేశీ ఉత్పత్తుల తయారీ, కొనుగోళ్లు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అవగాహన కార్యక్రమాలు, క్విజ్లు, ఫోటో ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కైకలూరు నియోజకవర్గం మళ్లీ కృష్ణా జిల్లాలో కలవనుంది. కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలతో కొత్త కృష్ణా జిల్లా ఏర్పాటు కానుంది. ఈ నిర్ణయాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం, సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులకు ఉదయం 10.30 నుంచి అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు.

పోరంకి శ్రీలక్ష్మీ నరసింహ గార్డెన్స్లో అడుసుమిల్లి వారి నూతన వస్త్రబహుకరణ వేడుక ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై చిన్నారులకు ఆశీర్వాదాలు అందించారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎస్పీ ఆర్. గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. కష్టాల్లో తోడుగా నిలుస్తానంటూ సోదరుడు చెప్పే మాట సోదరికి కొండంత బలాన్నిస్తుంది. చిన్ననాటి నుంచి ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు, అల్లరి చేష్టలు, కోపతాపాలు ఎన్నున్నా.. ఎవరికి ఇబ్బంది కలిగినా మరొకరు తల్లిడిల్లిపోతారు. ప్రేమాఆప్యాయతల కలబోత వీరి బంధం. ఆ బ్లడ్లో ఉండే మ్యాజిక్కే వేరు. మరి మీకు రాఖీ కట్టే సోదరికి కామెంట్ ద్వారా విషెస్ చెప్పండి.
Sorry, no posts matched your criteria.