India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల మీదుగా ప్రవహిస్తున్న కుందూ నది, మద్దిలేరు వాగు, పట్టణంలో గల చెరువును మంగళవారం ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పరిశీలించారు. కుందూ నది, మద్దిలేరు వాగులలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున ఎస్పీ వాటిని పరిశీలించి వరద ఉద్ధృతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ DSP సంతోశ్, రెండో పట్టణ సీఐ ఇస్మాయిల్ ఉన్నారు.
రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రి, కర్నూలు నియోజకవర్గ MLA టీజీ భరత్ విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచారు. TGV గ్రూప్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని సీఎం సహాయ నిధికి అందజేశారు. ఇలాంటి కష్టకాలంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా విజయవాడ వరద బాధితులకు అండగా నిలవాలని మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు.
నందవరం మండలం నాగులదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. కోళ్ల ఫారంలో కూలీ పనికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి ఇమ్మానియేల్(50) అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ పెద్దదిక్కు మృతి చెందడంతో ఆ కుటుబంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.
అనకాపల్లి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కర్నూలు జిల్లా క్రీడాకారులు 12 పతకాలు సాధించిన సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మంగళవారం తన చాంబర్లో అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. గెలుపే లక్ష్యంగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. డీఎస్డీఓ పాల్గొన్నారు.
విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకులు, వస్తువుల పంపిణీ వాహనాన్ని కర్నూలు ఎంపీ నాగరాజు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితులలో అండగా నిలవాలని కోరారు. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు.
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ప్రభుత్వ వైన్ షాప్ ఉద్యోగులు 7న బంద్కు పిలుపు ఇస్తూ రాష్ట్ర యూనియన్ నిర్ణయం తీసుకుంది. సోమవారం జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, రాష్ట్ర జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జతిన్ రెడ్డి, అడ్వైసర్ నాగచంద్రు కలిసి జిల్లా మద్యం డిపో అధికారులకు బంద్ నోటీసులు ఇచ్చారు. తమకు మరో శాఖలో ఉపాధి కల్పించాలని కోరుతున్నామన్నారు.
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ప్రభుత్వ వైన్ షాప్ ఉద్యోగులు 7న బంద్కు పిలుపు ఇస్తూ రాష్ట్ర యూనియన్ నిర్ణయం తీసుకుంది. సోమవారం జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, రాష్ట్ర జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జతిన్ రెడ్డి, అడ్వైసర్ నాగచంద్రు కలిసి జిల్లా మద్యం డిపో అధికారులకు బంద్ నోటీసులు ఇచ్చారు. తమకు మరో శాఖలో ఉపాధి కల్పించాలని కోరుతున్నామన్నారు.
వారణాసిలో ఇంటర్నేషనల్ కార్నేటిక్ మెజీషియన్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మెగా ఈవెంట్లో నందికొట్కూరుకు చెందిన విన్మయ శ్రీ శివతాండవం విభాగంలో అద్భుత నృత్య ప్రదర్శన చేసి అత్యుత్తమ ప్రతిభ చాటారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు విన్మయ శ్రీకి వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందించి సన్మానించారు. విద్యార్థినిని పలువురు అభినందించారు.
ఆళ్లగడ్డలోని బృందావన్ కాలనీ వెంచర్ సమీపంలో సోమవారం రాత్రి ఘోరం జరిగింది. ప్రమాదవశాత్తు గుడిసె కాలిపోవడంతో అందులోని 85 గొర్రెలు సజీవ దహనం అయ్యాయి. రాత్రి 10:30 గంటల సమయంలో గొర్రెలకు దోమలు కుట్టకుండా గొర్రెల యజమాని మిట్టపల్లి కృష్ణయ్య పొగ పెట్టడంతో ప్రమాదవశాత్తు గుడిసె అంటుకుంది. అందులో ఉన్న 85 గొర్రెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది.
వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో బ్రిడ్జిలపై పారుతున్న నీటిలోకి రాకపోకలు నిలుపుదల చేసి ఇరువైపులా నిరంతర నిఘా ఉండాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ రాజకుమారి సోమవారం ఆదేశించారు. దెబ్బతిన్న పంట పొలాలు, పండ్ల తోటలు, పశు నష్టం, తదితర వాటిపై సంబంధిత అధికారులు వెంటనే నివేదికలు అందించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.