Kurnool

News August 29, 2024

ప్రజలకు మెరుగైన సేవలు అందించండి: నంద్యాల జిల్లా కలెక్టర్

image

సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సచివాలయ సిబ్బందికి సూచించారు. బుధవారం నంద్యాల పట్టణం మున్సిపల్ పరిధిలోని రైతు నగర్‌లో సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

News August 28, 2024

కోవెలకుంట్లలో బాలికపై అత్యాచారం?

image

నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితులపై కోవెలకుంట్ల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం నంద్యాల జీజీహెచ్‌‌కు తరలించినట్లు సమాచారం. రాష్ట్రంలో రోజురోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్నా హోంమంత్రి పట్టించుకోవడం లేదంటూ వైసీపీ మండిపడింది.

News August 28, 2024

పురుగు మందు తాగి యువకుడి సూసైడ్

image

బనగానపల్లె మండలం నందివర్గంలో ఉగ్గు సంజీవ రాయుడు(32) అనే వ్యక్తి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు నందివర్గం ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. గ్రామానికి చెందిన దస్తగిరి కుమారుడు సంజీవరాయుడు రెండేళ్ల క్రితం బస్సు నుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. దీంతో నరాల బలహీనత, మానసిక స్థితి సరిగా లేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

News August 28, 2024

కర్నూలు: వచ్చే నెల 2న కౌన్సెలింగ్

image

కర్నూలు వైద్య కళాశాలలోని ఆడిటోరియంలో పారా మెడికల్ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు సెప్టెంబరు 2న కౌన్సెలింగ్ ఉంటుందని వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్ మంగళవారం తెలిపారు. అభ్యర్థులు తమ అర్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు. బైపీసీ వారికి మొదటి ప్రాధాన్యమిస్తామని పేర్కొ న్నారు. మార్కులు, రోస్టర్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు.

News August 28, 2024

‘బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నోటి దురుసు తగ్గించుకో..’

image

రైతు ఉద్యమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన నోటి దురుసు తగ్గించుకోవాలని ఏపీ రైతు సంఘం నంద్యాల జిల్లా కార్యదర్శి జీ.సోమన్న సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దేశంలో రైతు ఉద్యమాన్ని అణచివేయకపోతే బంగ్లాదేశ్ పరిస్థితులు ఏర్పడతాయంటూ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతు ఉద్యమాన్ని అణచివేయాలని అధికార దాహంతో అన్నట్లుగా ఉందన్నారు.

News August 28, 2024

గణేశ్ మండపాలకు అనుమతులు తప్పనిసరి: కలెక్టర్

image

గణేశ్ విగ్రహ నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై ఎస్పీ, జేసీతో కలిసి సమావేశం నిర్వహించారు. విగ్రహ మండపం ఏర్పాట్లకు అనుమతులు తప్పనిసరి ఆమె అన్నారు.

News August 27, 2024

నేర నియంత్రణకు కృషి చేయాలి: ఎస్పీ

image

పెండింగ్ కేసులు తగ్గించాలని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్‌లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్‌ కేసులపై ఆరా తీశారు. పోలీసు స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నేర నియంత్రణకు కృషి చేయాలని సూచించారు.

News August 27, 2024

ఫ్రీ హోల్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయకండి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రీ హోల్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని సబ్ రిజిస్ట్రార్లను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. నిషేధిత ఆస్తుల జాబితాకు సంబంధించి సెక్షన్ 22ఏ పరిధిలోకి వచ్చే అసైన్డ్, ప్రభుత్వ, దేవాలయ భూములకు సంబంధించి అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ విష్ణు చరణ్, అధికారులు పాల్గొన్నారు.

News August 27, 2024

శ్రీశైలం జలాశయానికి 2 లక్షల వరద నీటి ప్రవాహం

image

కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైల జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా 2,08,001 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో డ్యామ్ నీటిమట్టం 884.30 అడుగులుగా, నిల్వ సామర్థ్యం 211.4759 టీఎంసీలుగా నమోదైంది. కుడి, ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 68,744 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

News August 27, 2024

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించి ఉద్యోగులు, కార్మికుల రక్షణకు ప్రాధాన్య‌తనివ్వాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత నిర్వాహకులను సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌మాద ఘ‌ట‌న నేప‌థ్యంలో జిల్లాలోని ఫ్యాక్టరీలు, ప‌రిశ్ర‌మ‌ల నిర్వాహ‌కులకు పలు సూచనలు చేశారు. 28 వేల మంది వివిధ చోట్ల పని చేస్తున్నారన్నారు.