India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాణ్యంలోని భారత్ పెట్రోల్ బంకు సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్టీలు సామన్లతో వెళ్తున్న గూడ్స్ ఆటో, కారు ఢీకొనడంతో కారు డిక్కీ పూర్తిగా దెబ్బతింది. గూడ్స్ ఆటోలోని స్టీల్ సామన్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్ గాయపడినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నంద్యాలలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘పేరుకేమో న్యాయశాఖ మంత్రి. చేసేది మాత్రం అక్రమాలు, అన్యాయాలు. నంద్యాలలో రూ.58 కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు మంత్రి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆ భూమిపై కోర్టు తీర్పులున్నా పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఛైర్పర్సన్పై ఒత్తిడి తెస్తూ దొడ్డిదారిన కాజేసే కుట్ర చేస్తున్నారు’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
ఆదోని టౌన్కు చెందిన సంఘ సేవకుడు, సామాజిక కార్యకర్త వంకదారు శ్రీనాథ్ గుప్తా NTR జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును మదర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ (హైదరాబాద్) అధ్యక్షుడు సూర్యనారాయణ రాజు, సొసైటీ ఛైర్మన్ ప్రసాద్ రావు అందజేశారు. శ్రీనాథ్ ఆర్య వైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఆవోపా), ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ (వామ్)కు అధ్యక్షుడిగా ఉన్నారు.
అవుకు రిజర్వాయర్లో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. జీఎన్ఎస్ఎస్ కాలువ మూడవ గేటు వద్ద నీళ్లలో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని సోమవారం మండల వీఆర్వో హేమ్లా నాయక్ గమనించారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అవుకు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. మృతుడి వయసు 32 సంవత్సరాలుగా ఉంటుందని పేర్కొన్నారు.
విశ్రాంత డీఈఈ సుబ్బారాయుడు వేదవతి నదిపై ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించి ఎల్లెల్సీ కాల్వకు నీటిని మళ్లిస్తే కరవు కష్టాలు తీర్చవచ్చని సీఎం చంద్రబాబు, d.cm పవన్కు లేఖ రాశారు. 4 నెలల్లో పూర్తి చేయొచ్చంటూ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఇందుకు సుమారు రూ.200 కోట్ల వరకు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు బ్యాంకాక్లో జరగనున్న కింగ్స్ కప్ సెపక్ తక్రా పోటీలకు కర్నూలు నుంచి శివకుమార్ ఎంపికయ్యారు. ఆయన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు రాష్ట్ర సెపక్ తక్రా సంఘం కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. శివ కుమార్ గతంలో అనేక జాతీయ స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు బ్యాంకాక్లో జరగనున్న కింగ్స్ కప్ సెపక్ తక్రా పోటీలకు కర్నూలు నుంచి శివకుమార్ ఎంపికయ్యారు. ఆయన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు రాష్ట్ర సెపక్ తక్రా సంఘం కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. శివ కుమార్ గతంలో అనేక జాతీయ స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇంద్రధనస్సు కనువిందు చేసింది. ఉదయం నుంచి ఎండ ఎక్కువగా ఉంటూ సాయంత్రం వేళ ఆకాశంలో దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం కురిసిన తర్వాత ఇంద్రధనస్సు ఏర్పడి పట్టణవాసులకు కనువిందు చేసింది. ప్రజలు ఈ ఇంద్రధనస్సు చిత్రాలను తమ ఫోన్లలో బంధించారు.
ఉమ్మడి కర్నూల్ జిల్లా బేతంచెర్ల మండలం గొర్లగుట్ట గ్రామంలో బోయినపల్లి హనుమంతు (30) అనే వ్యక్తి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వారు గమనించి కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
బనగానపల్లె మండలం చెరువుపల్లి గ్రామంలోని గాలేరు నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) నుంచి అక్కాజమ్మ చెరువుకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గేట్లు ఎత్తి సోమవారం నీరు విడుదల చేశారు. ఎత్తిపోతల పథకం వద్ద మోటార్లకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మోటార్లను స్విచ్ ఆన్ చేసి అక్కాజమ్మ చెరువుకు నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.